India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి జీజీహెచ్లో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని కొత్తపేట పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు బాలుడిని అప్పగించారు. షేక్ అబ్దుల్ బాసిత్ (9) జీజీహెచ్లో ఒంటరిగా తిరుగుతుండగా.. గమనించిన స్థానికులు బాలుడిని కొత్తపేట పోలీసులకు అప్పగించారు. బాలుడు తల్లిపేరు షరీఫా అని, విజయవాడలోని సుందరయ్యకాలనీలో నివాసం ఉంటున్నట్లు చెప్పాడన్నారు. తెలిసినవారు 0863-2221815 ఫోన్ చేయగలరని సీఐ తెలిపారు.
తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి జీజీహెచ్లో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని కొత్తపేట పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు బాలుడిని అప్పగించారు. షేక్ అబ్దుల్ బాసిత్ (9) జీజీహెచ్లో ఒంటరిగా తిరుగుతుండగా.. గమనించిన స్థానికులు బాలుడిని కొత్తపేట పోలీసులకు అప్పగించారు. బాలుడు తల్లిపేరు షరీఫా అని, విజయవాడలోని సుందరయ్యకాలనీలో నివాసం ఉంటున్నట్లు చెప్పాడన్నారు. తెలిసినవారు 0863-2221815 ఫోన్ చేయగలరని సీఐ తెలిపారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద పీజీ కోర్సులలో చేరేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు, ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. MA, Mcom Msc, MA (జర్నలజం- మాస్ కమ్యూనికేషన్),MPA, MLISC , MED, MPED కోర్సులలో చేరేందుకు ఈనెల 31న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఈనెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చని సంచాలకులు అనిత తెలిపారు.
* రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్
* బాపట్ల జిల్లాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు
* వినుకొండ హత్యకు కారకుడు జగనే: మంత్రి డోలా
* త్రికోటేశ్వరుని ఆదాయం రూ.20.96 లక్షలు
* దుగ్గిరాల: పశ్చిమ డెల్టాకు 2010 క్యూసెక్కుల నీరు
* తెనాలి డిపోకు 10 కొత్త బస్సులు
*వినుకొండలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత
అధిక వర్షాల వలన ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్లోకి వరద నీరు ప్రవేశిస్తే పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. శుక్రవారం బాపట్ల జిల్లా పరిధిలోని కొల్లూరు పరిసర ప్రాంతాలలో గల కృష్ణా నది ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. వరద నీరు అధికంగా వస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయాలపై కచ్చితంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడతారన్నారు. వారిద్దరూ YCP కార్యకర్తలేనా అని మీడియా అడగ్గా.. ఇవన్నీ పిచ్చిమాటలని వినుకొండలో అందరికీ తెలిసిన విషయమేనని, హత్య చేసిన వ్యక్తి TDPలోనే ఉన్నాడని, మొన్న ఆ పార్టీ గెలుపుకై పోరాడిన విషయం తెలిసిందేనన్నారు.
వైసీపీ అధినేత YS జగన్ కార్యకర్త రషీద్ ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటి కిందట వినుకొండ చేరుకున్న ఆయన మృతుడు రషీద్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను పరామర్శించారు. పార్టీ తరఫున ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరికాసేపట్లో జగన్ మీడియాతో మాట్లాడనుండగా.. ఏం మాట్లాడతారా అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.
ప్రయాణికుల సౌకర్యార్థం గతంలో ఈనెల 31వ తేదీ వరకు రద్దు చేసిన రైళ్లను 21వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. గుంటూరు-డోన్ (17228), నర్సపూర్-గుంటూరు (17282)రైళ్లను ఈనెల 21వ నుంచి, డోన్-గుంటూరు (17227), గుంటూరు-నర్సపూర్ (17281) రైళ్లు ఈ నెల 22వ తేదీ నుంచి పాత సమయాల ప్రకారం యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.
కీటక జనిత సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. గురువారం బాపట్ల కలెక్టరేట్లో ఆయన వైద్యశాఖ, మున్సిపల్, వాటర్ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మురుగు కాలువలలో ఆయిల్ బాల్స్, దోమల నివారణ మందులు స్ప్రే చేయాలని సూచించారు. రహదారులపై నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట సత్వర వైద్య సేవలు అందించాలని సూచించారు.
గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సతీశ్ కుమార్ తాడేపల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఏర్పాటు చేసిన భద్రతను తనిఖీ చేశారు. అనంతరం అక్కడి నుంచి సచివాలయం వరకు దారి వెంట విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడి, వారి యెగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, తదితర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.