Guntur

News August 20, 2025

GNT: 2nd ఛాన్స్.. నేటితో లాస్ట్

image

ఉచిత విద్యాహక్కు చట్టం-2009 కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ అదనపు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు http://cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే మేలో ఒకసారి నోటిఫికేషన్ జారీ చేశారు.

News August 20, 2025

నేడు మంగళగిరికి రానున్న సీఎం చంద్రబాబు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పర్యటన ఖరారైంది. ఉదయం 10:40 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభిస్తారు. అనంతరం సచివాలయంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 6:30 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

News August 19, 2025

24న పరీక్షలు.. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి: DEO

image

టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు ఈ నెల 24న సెయింట్ జోసఫ్ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక తెలిపారు. ఆరోజు ఉదయం 11గం. నుంచి సాయంత్రం 4 గం.ల వరకు రెగ్యులర్, ఒకసారి తప్పిన వారికి పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు www.bsc.ap.gov.in వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

News August 19, 2025

వివాహితకు అధిక వడ్డీల బెదిరింపులు.. ఐదుగురు అరెస్ట్

image

తాడేపల్లిలో ఓ వివాహితను అధిక వడ్డీలు చెల్లించమని బెదిరించి, లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తాడేపల్లి CI వీరేంద్ర తెలిపారు. నిందితుల నుంచి వివాహిత భర్త రూ.50 వేలు తీసుకోగా వడ్డీతో సహా చెల్లించినప్పటికీ బెదిరింపులకు గురిచేస్తూ పలుమార్లు ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడారని చెప్పారు. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరపరిచామని CI పేర్కొన్నారు.

News August 19, 2025

GNT: ఒక్క ఫొటోతో ఎన్నో మధుర జ్ఞాపకాలు

image

నేడే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం. ఒక్క ఫొటోతో ఎన్నో మధుర జ్ఞాపకాలు కదలాడుతాయి. కాలం గిర్రున తిరుగుతున్నప్పటికీ ఫొటో చూడగానే వెనక్కి వెళ్లి ఏండ్ల కింది మధురస్మృతులు మనసులో మొదలవుతాయి. ఒకప్పుడు ఫోటోలు అంటే ఫోటోగ్రాఫర్‌కి పరిమితం, ఇప్పుడు సెల్ ద్వారా ప్రతీ ఒక్కరు మధుర జ్ఞాపకాలని సెల్‌ఫోన్లో బందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ఫోటో ఎంతో మధురంగా ఉంటుంది. మరి ఫోటోతో మీకు ఉన్న అనుభవాన్ని COMMENT చేయండి.

News August 18, 2025

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

☞ అమరావతి అంతా లోతట్టు ప్రాంతం: అంబటి. 
☞ తాడికొండ: సొసైటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారంలో రచ్చ.
☞ తెనాలి: తెనాలిలో గంజాయి ముఠా అరెస్ట్.
☞ ప్రత్తిపాడు: పంట పొలాలను పరిశీలించిన వైసీపీ నేతలు.
☞ అమరావతి: అసైన్డ్ రైతులకు శుభవార్త.
☞ మంగళగిరి: CM పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్.
☞ పొన్నూరు: కండక్టర్ తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం. 
☞ GNT: ఫ్రీ బస్సు.. ఐడీ లేకుంటే 2 రోజులే అవకాశం.

News August 18, 2025

గుంటూరు: పంట పొలాలను పరిశీలించిన వైసీపీ నేతలు

image

కాకుమాను మండలంలో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్ బలసాని కిరణ్ కుమార్ సోమవారం పర్యటించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను వారు పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు తగిన నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని వారు కోరారు.

News August 18, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

సీఎం చంద్రబాబు ఈనెల 19, 20 తేదీల్లో మంగళగిరిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మీ, SP సతీశ్ కుమార్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. 19వ తేదీన సీకే కన్వెన్షన్‌లో ‘జీరో పావర్టీ పీ4’ కార్యక్రమం. 20న మంగళగిరి మయూరి టెక్ పార్క్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభిస్తారు. కలెక్టర్, SP సభాస్థలం, సిట్టింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

News August 18, 2025

GNT: ఫ్రీ బస్సు.. ఐడీ లేకుంటే 2 రోజులే అవకాశం!

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉచిత బస్సు పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో 403 బస్సులు అందుబాటులో ఉండగా, 302 బస్సులు (70%) బస్సుల్లో మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు గుంటూరు ఇన్‌ఛార్జ్ ఆర్.సామ్రాజ్యం తెలిపారు. రెండు, మూడు రోజులు ఒరిజినల్ ఐడీ కార్డు లేకపోయినా అనుమతిస్తామని, ఆ తర్వాత తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.

News August 18, 2025

GNT: ‘పీజీఆర్ఎస్‌కి 33, డీవైసీకి 16 ఫిర్యాదులు’

image

జీఎంసీ డయల్ యువర్ కమిషనర్‌కి 16, పీజీఆర్ఎస్‌కి 33 ఫిర్యాదులు అందాయని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అత్యధికంగా ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 14 ఫిర్యాదులు అందాయన్నారు. సోమవారం జీఎంసీ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, పీజీఆర్ఎస్ కార్యక్రమాలను కమిషనర్ నిర్వహించారు. అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి గడువు తేదీ లోపు పరిష్కరించాలని ఆదేశించారు.