India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ శుక్రవారం కడప వెళ్లనున్నట్లు పార్టీ సెంట్రల్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు మేడా రఘునాథ్ రెడ్డి కన్వెన్షన్లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారని తెలిపారు.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు పోషక విలువ అధికంగా ఉండడంతో వీటి కొనుగోలు కోసం ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కిలో పుచ్చకాయ ధర రూ.40 నుంచి రూ.45 పలుకుతోంది. ధరలు కాస్తా అధికంగా ఉన్నప్పటికీ ప్రజలు తింటున్నారు. ఎండ వేడిమిని తట్టుకోవడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని ప్రజలు భావిస్తున్నారు. వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు.
గోదావరి జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న వదంతులతో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అయితే ఈ ఫ్లూ ప్రభావం ఉమ్మడి గుంటూరు జిల్లాపై ఎక్కడా లేదని, వదంతులు నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే చికెన్ ధరలు రూ.50 వరకు తగ్గడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇటు గుడ్డు ధర కూడా రూ.4.50కి దిగివచ్చింది. మీ ఏరియాలో ధరలెలా ఉన్నాయి.
తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్మభూమి నగర్లో జరిగింది. పూర్ణ కుమార్(20) పనికి వెళ్లడం లేదని బుధవారం తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన పూర్ణ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనికి వెళ్లి తిరిగొచ్చిన తల్లి కుమారుడు విగతజీవిగా ఉండడాన్ని చూసి నిశ్చేష్ఠురాలైంది. ఘటనపై ఆమె ఫిర్యాదుతో కేసు నమోదైంది.
2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పలు ప్రాంతాలకు చెందిన 35 మంది వైసీపీ కార్యకర్తలపై గుంటూరు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి వైవీఎస్బీజీ పార్థసారథి దాడి కేసులో 35 మంది వైసీపీ కార్యకర్తలకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో నిందితుల తరపున వైసీపీ లీగల్ సెల్ వాదించారు.
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. కలెక్టరేట్ లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ప్రిసైడింగ్ అధికారులు, కమిషనర్లు, ఎంపీడీవోలు, తాహశీల్దార్లు, సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. 26న ఏసీ కళాశాలలో పోలింగ్ కేంద్రాల సామాగ్రిని అందిస్తామని చెప్పారు.
గుంటూరు-కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడానికి EPIC కార్డ్ లేని పక్షంలో ప్రత్యామ్నాయ ధృవపత్రాలు చూపించవచ్చని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్, ఉద్యోగుల సేవా గుర్తింపు కార్డ్, MP/MLA/MLCలు, విద్యాసంస్థలు జారీచేసిన సేవా గుర్తింపు కార్డులతో పాటూ వర్సిటీలు జారీచేసిన సర్టిఫికెట్స్ చూపాలన్నారు.
కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆదాము ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో నిమ్మతోటలో భారీ కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊర్లోకి వెళ్లి గ్రామస్థులను తీసుకువచ్చి కొండ చిలువను పట్టుకొని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలారు. తరచూ గ్రామంలో, పొలాల్లో కొండ చిలువలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
గుంటూరు జిల్లాలో పొరుగు జిల్లాలతో పోల్చుకుంటే చికెన్ కి డిమాండ్ ఎక్కువగానే ఉంది. జిల్లాలో నేడు స్కిన్ లెస్ రూ.246, స్కిన్ రూ.236గా ఉంది. సాధారణ రోజుల్లో గుంటూరుకి ఇతర జిల్లాలకు 5, 10 రూపాయలు తేడా ఉండేది. కానీ ఇప్పుడు ఇతర జిల్లాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి గుంటూరుకి ఇతర జిల్లాలకు రూ.20 నుంచి రూ.25 వ్యత్యాసం కనిపిస్తోంది.
JEE మెయిన్స్ ఫలితాల్లో గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయిమనోజ్ఞ సత్తా చాటింది. తొలి విడత పేపర్-1 ఫలితాల్లో 100% మార్కులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. నగరానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ కిషోర్ చౌదరి, ప్రైవేట్ ఆసుపత్రిలో HODగా పనిచేస్తున్న పద్మజ దంపతుల కుమార్తెనే సాయిమనోజ్ఞ. ఇష్టపడి విద్యను అభ్యసించడం కారణంగా 100% మార్కులు సాధించానని హర్షం వ్యక్తం చేస్తుంది.
Sorry, no posts matched your criteria.