Guntur

News August 18, 2025

తెనాలిలో గంజాయి ముఠా అరెస్ట్

image

తెనాలిలో గంజాయి విక్రయిస్తున్న 15 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. తెనాలి 3 టౌన్ పరిధిలోని సుల్తానాబాద్‌లో 8 మందిని అరెస్టు చేసి, వారి నుంచి కిలో 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ఒకరు పరారీలో ఉన్నారన్నారు. మరో కేసులో కొల్లిపరలో ఏడుగురిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి కిలో 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

News August 18, 2025

మన గుంటూరు హీలియం పుట్టినిల్లు

image

హీలియం అనే పదం వినగానే మనలో చాలామందికి బెలూన్లు గుర్తుకు వస్తాయి. అయితే, ఈ హీలియంను గుంటూరులో కనుగొన్నారు. 1868, ఆగస్టు 18న సూర్యగ్రహణం సమయంలో ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త జూల్స్ జాన్సెన్ సూర్యునిలోని ఓ గీతలో ఒక కొత్త మూలకాన్ని కనుగొన్నారు. ఆ మూలకానికి ఆయన హీలియం అని పేరు పెట్టారు. భూమిపై ఇంతకుముందు ఈ మూలకం ఉనికి లేకపోవడంతో ఇది గుంటూరుకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

News August 18, 2025

ANU: పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ANU పరిధిలోని కాలేజీల్లో బీ-ఫార్మసీ II/IV 4వ, III/IV 6వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 15, 16 తేదీల నుంచి పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు జరిమానా లేకుండా ఈనెల 28లోపు ఫీజు చెల్లించాలని ANU పరీక్షల విభాగం సూచించింది. వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in ను సందర్శించవచ్చని పేర్కొంది.

News August 18, 2025

స్కూల్స్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీకి దరఖాస్తులు ఆహ్వానం: DEO

image

గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌ ఆర్గనైజింగ్ సెక్రటరీ నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈఓ సి.వి. రేణుక తెలిపారు. 2025-27 సంవత్సరానికి సంబంధించి కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉన్న పీఈటీ/స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)లు ఈనెల 20లోపు deogunturblogspot.comలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News August 17, 2025

గుంటూరు జిల్లాలో రేపు వర్షం కురిసే ఛాన్స్

image

గుంటూరు జిల్లాలో సోమవారం పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇప్పటికే APSDMA చరవాణిలకు మెసేజ్‌లు పంపింది.

News August 17, 2025

గుంటూరు: GGHలో వాహనాల చోరీకి చెక్

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనాల చోరీ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ట్యాగ్ ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. దీని ద్వారా ఆసుపత్రి స్వాగతద్వారంలోనే వాహనంతో పాటూ సంబంధిత వాహన యజమానికి RFID ట్యాగ్ వేసి వాహనాల చోరీని అరికట్టనున్నారు. ఇది త్వరగా అందుబాటులోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

News August 17, 2025

గుంటూరు: GGHలో వాహనాల చోరీకి చెక్

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ద్విచక్ర వాహనాల చోరీ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) ట్యాగ్ ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. దీని ద్వారా ఆసుపత్రి స్వాగతద్వారంలోనే వాహనంతో పాటూ సంబంధిత వాహన యజమానికి RFID ట్యాగ్ వేసి వాహనాల చోరీని అరికట్టనున్నారు. ఇది త్వరగా అందుబాటులోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

News August 16, 2025

తెనాలి: అవయవదానం.. ఏడుగురికి ప్రాణదానం

image

తెనాలి (M) సోమసుందరపాలెంకు చెందిన సుబ్బరాజు(62) తాను మరణించి కూడా ఏడుగురికి ప్రాణాలిచ్చారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శనివారం తెల్లవారుజామున బ్రెయిన్‌ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ఓ ట్రస్ట్ ద్వారా ఆయన అవయవాలను దానం చేశారు. తహశీల్దార్ గోపాలకృష్ణ మృతుడి కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేసి, సత్కరించారు.

News August 15, 2025

GNT: ఎమ్మెల్యే కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం..!

image

గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ కార్యాలయం వద్ద శుక్రవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఇటీవల MLA ఓ మహిళతో మాట్లాడినట్లు వీడియో కాల్‌ను తానే క్రియేట్ చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనను అనవసరంగా ఇరికించారంటూ మహిళ వాపోయింది

News August 15, 2025

గుంటూరు జిల్లాలో ఫ్రీ బస్సు.. 302 బస్సులు కేటాయింపు

image

రాష్ట్ర వ్యాప్తంగా నేడు మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం కానుంది. అయితే గుంటూరు జిల్లా పరిధిలోని 5 డిపోల్లో 302 బస్సులను స్త్రీ శక్తి పథకానికి కేటాయించినట్లు ఇన్‌ఛార్జ్ RM సామ్రాజ్యం చెప్పారు. ఫ్రీ బస్సు పథకానికి 302 బస్సుల్లో కేటాయించగా వాటిలో 241 పల్లె వెలుగు, 8 అల్ట్రా పల్లె వెలుగు, 53 ఎక్స్‌ప్రెస్ బస్సులను మహిళలకు అందుబాటులో ఉంచామని ఆమె వెల్లడించారు.