Guntur

News July 18, 2024

ANU ఇన్‌ఛార్జ్ వీసీగా కంచర్ల గంగాధర్ నియామకం

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్(వీసీ)గా ప్రొఫెసర్ కంచర్ల గంగాధర్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న గంగాధర్‌ను ఇన్‌ఛార్జ్ వీసీగా నియమించారు. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

News July 18, 2024

వినుకొండ హత్యపై స్పందించిన నరసరావుపేట ఎంపీ

image

వినుకొండ ముళ్లమూరు బస్టాండ్ సెంటర్లో బుధవారం రాత్రి జరిగిన హత్య ఘటన దురదృష్టకరం అని నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పార్టీలకు అతీతంగా ఈ సంఘటనను అందరూ ఖండించాలన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయకుండా బాధితుడి కుటుంబానికి చట్టపరంగా న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరుతున్నానన్నారు. ఇంకెప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు.

News July 18, 2024

శాంతిభద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల వాయిదా

image

శాంతిభద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం నేటి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసే కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న శ్వేతపత్రాల్లో మిగిలిన మూడింటిని అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేయనుంది.

News July 18, 2024

బాపట్ల: మరమ్మతులు చేస్తుండగా తిరగబడ్డ JCB

image

బాపట్ల పట్టణంలోని త్రవ్వు కాలువ మరమ్మతులు చేస్తుండగా గురువారం JCB అదుపుతప్పి తిరగబడింది. ఒక్కసారిగా తిరగబడటంతో డ్రైవర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 18, 2024

రేపు వినుకొండకు YS జగన్..?

image

రేపు వినుకొండకు YCP అధినేత జగన్ రానున్నట్లు తెలుస్తోంది. వినుకొండలో గత రాత్రి హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొంటారని సమాచారం. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వినుకొండకు చేరుకోనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి బయలుదేరారు. రషీద్ మృతదేహాన్ని సందర్శించడానికి వెళ్లిన బొల్లాకు జగన్ కాల్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.

News July 18, 2024

గుంటూరు: బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్

image

చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో జరిగిన బాలిక శైలజ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లికి నిందితుడు నాగరాజుకు మూడేళ్లుగా పరిచయం ఉన్నట్లు సమాచారం. నిందితుడి ఇంట్లో మృతురాలి తల్లి ఇందిరమ్మ గాజులు దొరకడంతో నాగరాజుకు, ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్న కోణంలో పోలీసులు ఇందిరమ్మను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

News July 18, 2024

చేబ్రోలు: బాలిక మృతి కేసులో నిందితుడికి నేర చరిత్ర

image

చేబ్రోలులో మైనర్ బాలిక మృతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు నాగరాజుకి నేర చరిత్ర ఉన్నట్లు నిర్ధారించారు. అతనిపై కొండపల్లి, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లలో కేసులు ఉన్నట్లు చెప్పారు. కొండపల్లి పరిధిలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెని హత్య చేసి పరారయ్యాడు. మరో మహిళతో సంబంధం పెట్టుకొని విభేదాలు రావడంతో హత్యాయత్నం చేశాడు. చేబ్రోలు వచ్చిన ఐదేళ్లలో 6 SIMలు మార్చాడని తేలింది.

News July 18, 2024

అమరావతి: CRDAలో పోస్టుల భర్తీకి ఆమోదం

image

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి కోరుతూ.. సీఆర్డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ ఈనెల 10న పురపాలక శాఖకు లేఖ రాశారు. దీనికి ఆమోదం తెలుపుతూ.. మూడేళ్ల కాలపరిమితితో 75 ఒప్పంద పోస్టులను, పొరుగుసేవల పద్ధతిలో 68 పోస్టులను నింపేందుకు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి GO జారీ చేశారు.

News July 18, 2024

మలికా గార్గ్ ఉండి ఉంటే ఈ హత్య జరిగేది కాదు: అంబటి

image

వినుకొండ పట్టణంలో బుధవారం రాత్రి హత్య జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మలికా గార్గ్ పల్నాడు జిల్లా ఎస్పీగా ఉండి ఉంటే వినుకొండలో ఈ దారుణ హత్య జరిగి ఉండేది కాదని ‘X’ లో పోస్ట్ చేశారు.

News July 18, 2024

ఈనెల 21 నుంచి యథావిధిగా రైళ్లు నిలుపుదల

image

నారయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈనెల 19 నుంచి పిడుగురాళ్ల, నడికుడి స్టేషన్ల‌లో నిలిపేదిలేదని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రైల్వే అధికారులతో మాట్లాడారు. ప్రజల అవసరాల దృష్ట్యా రైళ్లను పిడుగురాళ్ల, నడికుడి రైల్వేస్టేషన్లలో నిలుపుదల చేయాలని కోరారు. రైల్వే అధికారులు స్పందించి ఈనెల 21 నుంచి 3 రైళ్లను నిలుపుదల చేస్తామని చెప్పారు.