India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెనాలికి చెందిన అడిగోపుల నరసింహారావు, బాలత్రిపుర సుందరి దంపతులు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. క్విట్ ఇండియా పోరాటంలో జైలుకు కూడా వెళ్లారు. స్వాతంత్ర్య సంగ్రామం అనంతరం వీరి త్యాగాలను గుర్తిస్తూ ప్రభుత్వం తామ్ర పత్రాలను ఇచ్చి గౌరవించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆదరణలేక సాయం అందక వీరి కుమారుడు ఉమామహేశ్వరరావు దారం తయారీ కంపెనీలో కూలీగా పనిచేస్తూ అద్దె ఇంట్లో భారంగా కాలం వెలదీస్తున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన ఎందరో మాతృమూర్తులు స్వాతంత్య్ర ఉద్యమంలో నేనుసైతం అంటూ చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిషు పాలకుల అణిచివేతకు గురై జైలు జీవితం గడిపారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ, గోళ్లమూడి రత్నమ్మ, ఘంటా మల్లికాంబ, భారతి దేవి రంగా, సూర్యదేవర అన్నపూర్ణమ్మ, సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, కొడాలి కమలాంబ, తుమ్మల దుర్గాంబ వంటి మహిళా యోధులు స్వాతంత్రం కోసం పోరాడి మన దేశానికి స్వతంత్ర్యం సాధించారు.

ప్రభుత్వం కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్న విషయం విధితమే. అమరావతి జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అమరావతి జిల్లాలో తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ, పెదకూరపాడు నియోజకవర్గాలు ఉంటాయని ప్రచారం. మంగళగిరి నియోజకవర్గంని అమరావతి జిల్లాలో కలపడం మంగళగిరి అభివృద్ధికి లాభమా నష్టమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయగలరు.

స్వాతంత్రోద్యమ కాలంలో ‘గుంటూరు కేసరి’గా నడింపల్లి లక్ష్మీనరసింహారావు పంతులు (1890-1978) పిలవబడ్డారు. టంగుటూరి ప్రకాశం వద్ద శిష్యుడిగా పనిచేసి, కోస్తాంధ్ర ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వ్యక్తి. స్వాతంత్రానికి ముందు 11 సంవత్సరాలు గుంటూరు పురపాలక ఛైర్మన్గా, 1953లో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా చేశారు. గాంధీ పార్క్ నిర్మాణం ఈయన హయాంలోనే జరిగింది. హిమని కూడలి వద్ద ఈయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

గుంటూరు జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిశాయి. ఫిరంగిపురం మండలంలో అత్యధికంగా 55.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. తుళ్లూరులో 41 మి.మీ, కొల్లిపర 27.5 మి.మీ, తాడికొండలో 27, గుంటూరు వెస్ట్ ప్రాంతంలో 25.75 మి.మీల వర్షపాతం నమోదైంది. మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో 22.5 మి.మీ, పొన్నూరు 19.5, దుగ్గిరాల 18, తెనాలి 15 మి.మీ చొప్పున వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది.

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం సుమారు 55 వేల బస్తాల వరకు ఏసీ సరుకు చేరుకుంది. కేజీల వారిగా ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేజ బెస్ట్: రూ. 80-120, తేజ ఏ/సి: రూ. 125-143, 355 ఏ/సి: రూ. 100-135 వరకు ఉంది. 2043 ఏ/సి: రూ. 120-135, 341 ఏ/సి: రూ. 120-150, షార్కు ఏ/సి: రూ. 110-130, నంబర్ 5 ఏ/సి: రూ. 125-142, డీడీ రకం ఏ/సి: రూ. 110-140, ఎల్లో రకం: రూ. 200-230, బుల్లెట్: రూ. 90-135 వరకు ధర లభించింది.

బాపట్ల వాసి బక్క గోపిని పట్టాభిపురం పోలీసులు నకిలీ నోట్లు మార్చుతుండగా అరెస్ట్ చేశారు. రత్నగిరి నగర్లో నివాసం ఉంటున్న గోపికి హైదరాబాద్కు చెందిన భరత్ ద్వారా కలకత్తా వాసి గోపాల్ పరిచయమయ్యాడు. గోపాల్ వద్ద నుంచి గోపి 160 నకిలీ రూ.500 నోట్లు కొనుగోలు చేసి గుంటూరులో మార్చుతున్నాడు. పోలీసులు అతడి వద్ద నుంచి 25 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించారు.

తెనాలికి స్వతంత్ర సంగ్రామంలో ప్రత్యేక చరిత్ర ఉంది. స్వతంత్రం ప్రకటించిన రోజే తెనాలిలో ఓ థియేటర్ ఓపెన్ చేశారని మీకు తెలుసా? అదే స్వరాజ్ టాకీస్. 1947 ఆగస్టు 15న ప్రారంభించారు. స్వాతంత్ర్యానికి చిహ్నంగా ఈ పేరు పెట్టారు. లండన్, జపాన్ నుంచి పరికరాలను దిగుమతి చేసుకుని ఆరోజుల్లోనే రూ.1.24 లక్షల వ్యయంతో దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఇది మూతబడింది.

నైతిక విలువలనే ఆస్తిపాస్తులుగా జీవించిన స్వాతంత్ర్య సమరయోధుడు షేక్ అబ్దుల్ వహాబ్. 1903 డిసెంబర్ 10న తెనాలిలో జన్మించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు. 1929లో గాంధీజీ తెనాలి వచ్చినప్పుడు సతీ సమేతంగా వెళ్లి తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలన్నింటినీ స్వరాజ్య నిధికి సమర్పించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిలర్గా 36 ఏళ్లు, 15 ఏళ్ల పాటు వైస్ ఛైర్మన్గా, 5ఏళ్లు ఛైర్మన్గా సేవలందించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 0863 2234014 నంబర్కు ఫోన్ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. ఈ కంట్రోల్ రూం 24 గంటలు పనిచేస్తుందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.