Guntur

News August 13, 2025

గుంటూరు చరిత్రలో మర్చిపోలేని PHOTO ఇది

image

బ్రిటిష్ వలస పాలన ముగిసిన తర్వాత మిగిలిన ప్రాంతాల్లో మాదిరిగానే గుంటూరులో 1947 ఆగస్టు 15వ తేదీన ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించారు. స్థానిక AC కళాశాలలో అదే రోజు జెండా ఎగురవేశారు. AC కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైవీ నారాయణ తన మాటలతో ప్రజలను ఉత్సహ పరిచరారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు ఆలపించారు. ప్రముఖ వ్యక్తులు ప్రసంగించారు. పైన ఉన్నది అప్పటి ఫొటోనే.

News August 13, 2025

గుంటూరు జిల్లాలో వేల ఎకరాలకు నష్టం: YCP

image

గుంటూరు జిల్లాలో వేల ఎకరాలు నీట మునిగాయని వైసీపీ ఆరోపిస్తుంది. ‘పెదకాకాని మండలం గొల్లమూడి సమీపంలో గుంటూరు ఛానల్ కాలువకు గండి పడినా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. గండి పడే అవకాశం ఉందని రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు కంటితుడుపుగా మరమ్మతులు చేసి వదిలేశారు. పంట నష్టపోయిన రైతు కన్నీటికి కారణం నీ నిర్లక్ష్యం కాదా చంద్రబాబు?’ అని ప్రశ్నిస్తూ YCP ట్వీట్ చేసింది.

News August 13, 2025

తెనాలితో గాంధీ మహాత్మునికి ప్రత్యేక అనుబంధం

image

స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా గాంధీజీ 3సార్లు తెనాలి వచ్చారు. 1929లో తొలిసారి తెనాలి వచ్చి పట్టణ నడిబొడ్డున సభలో ప్రసంగించారు. అందుకే ఆ ప్రాంతానికి గాంధీచౌక్‌గా నామకరణం చేశారు. 1933లో 2వ సారి వచ్చి రైల్వే స్టేషన్ పడమర వైపున బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం చెంచుపేటలోని ఇప్పటి శబరి ఆశ్రమాన్ని ప్రారంభించి రాత్రికి ఐతనగర్లో బస చేశారు. 1946లో 3వసారి మద్రాస్ వెళుతూ రైల్వే స్టేషన్లో సేద తీరారు.

News August 13, 2025

గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

image

గుంటూరు జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆగస్టు 12 ఉదయం 8:30 నుంచి 13 ఉదయం 8:30 వరకు అత్యధికంగా పొన్నూరులో 203.5 మి.మీ, దుగ్గిరాలలో 189.5 మి.మీ, తుళ్లూరులో 167.0 మి.మీ వర్షపాతం నమోదైంది. గుంటూరు వెస్ట్ 158, ఈస్ట్ మి.మీ, పెదకాకాని 156.5, తెనాలిలో 143.75, మంగళగిరిలో 138.0, కాకుమాను 108.0, ఫిరంగిపురం 94.25, కొల్లిపర 92.5, ప్రత్తిపాడులో 63.0మి.మీ వరకు నమోదైంది.

News August 13, 2025

గుంటూరు ప్రజలకు కమిషనర్ సూచన

image

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఏ సమస్య తలెత్తకుండా జీఎంసీ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. బుధవారం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తాగునీటి సమస్యలు, చెట్లు విరిగి ట్రాఫిక్‌కి అడ్డుగా ఉన్నా, వర్షం నీరు నిలిచినా 08632345103, 104,105 నంబర్‌లకు సమాచారం అందించాలని చెప్పారు.

News August 12, 2025

పనులు పూర్తైనా బిల్లులు రావడంలేదు: కాంట్రాక్టర్ల ఆవేదన

image

రాష్ట్రంలోని కాంట్రాక్ట్ పనులను పూర్తి చేసినప్పటికీ బిల్లులు రావడం లేదని రాష్ట్ర బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.విజయకుమార్, ప్రధాన కార్యదర్శి ఎం వి ఏ సూర్య ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి బైపాస్ రోడ్డులో వారు మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి కేటాయించిన బడ్జెట్ వినియోగంపై ఉన్న త్రైమాసిక పరిమితులను సడలించాలని డిమాండ్ చేశారు.

News August 12, 2025

జాతీయ లోక్ అదాలత్‌కు సిద్ధం కండి: ప్రధాన న్యాయమూర్తి

image

బ్యాంకులు, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణ చక్రవర్తి మంగళవారం సమావేశమయ్యారు. సెప్టెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కోసం ఈ సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. క్రిమినల్, సివిల్ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ ఆర్‌డిఓ ఆఫీస్‌ను సందర్శించారు.

News August 12, 2025

‘తెనాలి జిల్లా’ ఆశలు మరోసారి ఆవిరి.?

image

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. 26 జిల్లాలను 32 జిల్లాలుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంటుంది. ఆ జాబితాలో తెనాలి పేరు లేకపోవడంతో ‘తెనాలి జిల్లా’ ఆశలు మళ్లీ ఆవిరవుతున్నాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఇప్పటికే పార్లమెంటును కోల్పోయిన ఈ ప్రాంతానికి ప్రత్యేక జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ అవకాశం కూడా దక్కకపోతుండటం అందరిని నిరాశ పరుస్తోంది.

News August 12, 2025

ఆనాటి ఉద్యమ సారథి కల్లూరి చంద్రమౌళి

image

1942లో క్విట్ ఇండియా తీర్మానంలో పాల్గోన్న ప్రముఖ స్వాతంత్ర యోధుడు కల్లూరి చంద్రమౌళి తిరిగి తెనాలికి వచ్చారు. దీనిలో భాగంగా 1942 ఆగస్టు 12న ఆయన నాయకత్వంలో తెనాలిలో ఉద్యమం జరిగింది. శాంతియుత అందోళన అదుపు తప్పి హింసాత్మక రూపు ధరించింది. తెనాలి రైల్వై స్టేషన్ పూర్తిగా తుగలపెట్టిన ఆందోళనకారులు తమ తదుపరి లక్ష్యంగా తాలుకా ఆఫీస్ వైపు వెళ్తుండగా పోలీసులు కాల్పులు జరపటంతో 7 మృతి చెందగా అనేకమంది గాయపడ్డారు.

News August 12, 2025

వారు దేశం కోసం ప్రాణాలర్పించి నేటికీ 83 సంవత్సరాలు

image

1942 ఆగస్టు 12 న తెనాలి పట్టణంలో క్విట్ ఇండియా ఉద్యమంలో వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు పోలీసులు ప్రజలు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల కాల్పులలో ఏడుగురు ఉద్యమకారులు ప్రాణాలు అర్పించారు.
★ మాజేటి సుబ్బారావు
★ శిరిగిరి లింగయ్య
★ తమ్మినేని సుబ్బారెడ్డి
★ గాలి రామకోటయ్య
★ ప్రయాగ రాఘవయ్య
★ జాస్తి అప్పయ్య
★ భాస్కరుని లక్ష్మీనారాయణ
వీరి జ్ఞాపకార్థమే మన తెనాలి రణరంగ చౌక్.