India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నరసరావుపేటలో ఓ ఔషధ వ్యాపారి అదృశ్యం కావడం సంచలనం రేకెత్తించింది. రాజాగారికోటలో ఔషధ దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి 2రోజులుగా కనిపించకపోవడంతో, అతనికి అప్పులిచ్చినవారు అతని అచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇంటికి తాళం వేసి ఉండటం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో దివాళా తీసినట్లు భావిస్తున్నారు. సుమారు రూ.15 కోట్ల అప్పులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై తమకు ఫిర్యాదు అందలేదని 2వ పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు.
జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు గుంటూరు డీఈవో పి. శైలజ తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 21వ తేదీ తుది గడువు అని డీఈవో వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
10వ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గుంటూరు డివిజన్లో 29, తెనాలి డివిజన్లో 28, నరసరావుపేట డివిజన్లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPM అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ABPM అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. SHARE IT.
విజయవాడ- గూడూరు, గూడూరు- విజయవాడ రైళ్లను పునరుద్ధరించారు. డబ్లింగ్, సిగ్నలింగ్ పనుల వల్ల ఇటీవల ఈ రైళ్లను రద్దు చేయగా.. వీటిని పునరుద్ధరించాలని దక్షిణ మధ్య రైల్వే GM అరుణ్ కుమార్ జైన్కు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం ఉదయం లేఖ పంపారు. స్పందించిన రైల్వే శాఖ రద్దయిన ఆ రైళ్లను పునరుద్ధరించింది. వీటి రద్దు సమయంలో ఒంగోలు-బాపట్ల-తెనాలి ప్రయాణికులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు గుంటూరులోని జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది. నిందితుల బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. అయితే అనారోగ్య కారణాలతో గిరి రాంబాబు అనే వ్యక్తికి మాత్రం బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో మరికొంతమంది వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదే కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
పల్నాడు జిల్లాకు నూతన ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం కలెక్టర్ పి. అరుణ్ బాబును కలెక్టర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలపై కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కలెక్టర్ ఆయనకు సూచించారు.
జగ్గయ్యపేట మండలం బూదవాడ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య<<13582186>> ఇప్పటివరకు 4కి చేరింది. <<>>విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిమెంట్ కర్మాగార ఉద్యోగి శ్రీమన్నారాయణ నేడు మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. మృతుని స్వస్థలం పల్నాడు జిల్లా మాచర్లగా అధికారులు వెల్లడించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బాపట్ల రూరల్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కథనం మేరకు.. బాపట్ల మండలం నందిరాజు తోట గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు దాడి నిర్వహించి ఒక జెసీబీ, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* CM చంద్రబాబు బయోపిక్ షూటింగ్ ప్రారంభం
* బాపట్ల: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి
* గుంటూరు: మహిళతో సహజీవనం..
* మంగళగిరిలో రోడ్డు ప్రమాదంలో.. బాలుడి మృతి
* అంబానీ పెళ్లి వేడుకల్లో గుంటూరు MP పెమ్మసాని
* గుంటూరులో వ్యక్తి మృతి.. హత్యా? ఆత్మహత్యా?
* రేపల్లేలో గంజాయి అమ్ముతున్న 10 మంది అరెస్ట్
* టీడీపీ నేత మృతి.. సంతాపం తెలిపిన మంత్రి లోకేశ్
* ఫిరంగిపురంలో 178 క్వింటాళ్ళ బియ్యం పట్టివేత
Sorry, no posts matched your criteria.