Guntur

News November 24, 2024

కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు: సవిత

image

అమరావతి: కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో తగిన స్థానం లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని, అందుకు నిదర్శనంగా మద్దిరాల గంగాధర్‌ని ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా నియమించడమే అని ఆమె అన్నారు. విద్యార్థి దశ నుండే రాజకీయాల బాటపట్టారన్నారు.

News November 24, 2024

గుంటూరు: RRB పరీక్షల అభ్యర్థులకు ప్రత్యేక రైళ్లు

image

RRB పరీక్షల అభ్యర్థులకు విజయవాడ మీదుగా గుంటూరు(GNT)-సికింద్రాబాద్(SC) మధ్య అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07101 GNT-SC, నం.07102 SC-GNT మధ్య ఈనెల 24, 25, 26, 28, 29న ఈ రైళ్లను నడుపుతామన్నారు. ఆయా తేదీలలో ఉదయం 8 గంటలకు GNTలో బయలుదేరే ఈ రైలు సాయంత్రం 4.15కి SC చేరుకుంటుందని, తిరిగి 5.45కి SCలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 2 గంటలకు GNT వస్తుందన్నారు.

News November 24, 2024

IPL వేలంలో మన గుంటూరు కుర్రాళ్లు.!

image

ఐపీఎల్ మెగా వేలం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంలో గుంటూరుకు చెందిన షేక్ రషీద్ రూ.30లక్షలు, పృథ్వీరాజ్‌యర్రా రూ.30లక్షల బేస్ ప్రస్‌తో రిజిస్టర్ చేసుకున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో మన గుంటూరు జిల్లా ఆటగాళ్లు వేలంలో ఎంత మేరకు పలకొచ్చని అనుకుంటున్నారు. ఏ టీమ్‌కు సెలక్ట్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.

News November 24, 2024

నేను పుట్టిన ఊరు నరసరావుపేట: సీనియర్ సినీ నటుడు

image

తాన పుట్టిన ఊరు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట అని సీనియర్ సినీనటుడు నరేశ్ అన్నారు. న్యూ మాన్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ పోటీలు స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభించేందుకు వచ్చిన ఆయన తన అమ్మ విజయనిర్మలతో కలిసి చిన్నతనంలో ఇక్కడే పెరిగినట్లు గుర్తుచేసుకున్నారు. పట్నంలో దొరికే గోలి సోడా, మిరపకాయ బజ్జీలు తనకు ఎంతో ఇష్టమని అన్నారు. అనంతరం రాజా గారి కోట ఫేమస్ అన్నారు.  

News November 24, 2024

గుంటూరు: కేసుల పురోగతిని తెలుసుకున్న అంబటి 

image

ఐ-టీడీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులపై పెట్టిన అసభ్యకరమైన పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గతంలో నగరంలోని పలు స్టేషన్లలో ఐ-టీటీడీపై తాము ఇచ్చిన ఫిర్యాదుల పురోగతిని తెలుసుకోవడానికి పార్టీ శ్రేణులతో కలిసి అంబటి శనివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.  

News November 23, 2024

గుంటూరు: చిన్నారిపై బీటెక్ విద్యార్థి అఘాయిత్యం

image

గుంటూరులో శుక్రవారం రాత్రి దారుణ ఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల చిన్నారిపై బీటెక్ విద్యార్థి హత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. గుంటూరులో దంపతులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పక్కింటికి చెందిన నవీన్(20) బాలికను ఎవరూలేని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. బాలిక కేకలు వేయడంతో తల్లిదండ్రులు రాగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

News November 23, 2024

ఉండవల్లిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎంపీల సమావేశం 

image

ఉండవల్లి నివాసంలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఎంపీలతో చర్చించారు. అలాగే పార్టీ పాలనాపరమైన అంశాలు, కేంద్రంపై వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

News November 23, 2024

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

★ గుంటూరు: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
★ మంగళగిరి: మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు
★ గుంటూరు: కారంచేడు రైల్వే గేటును ఢీ కొన్న కారు
★ గుంటూరు: తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి
★ వినుకొండ: స్నానానికి వెళ్లిన స్వాములు.. ఇద్దరు మృతి
★ దాచేపల్లిలో డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి

News November 22, 2024

శాంతిభద్రతల ఏఎస్పీ రవికుమార్ బాధ్యతల స్వీకరణ

image

గుంటూరు జిల్లా శాంతి భద్రతల విభాగ ఏఎస్పీగా రవికుమార్ శుక్రవారం బాధ్యత స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలలో ప.గో జిల్లా ఏఎస్పీగా ఉన్న రవికుమార్ గుంటూరు జిల్లాకు నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మెక్కను అందించారు. జిల్లాలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. 

News November 22, 2024

గుంటూరు: తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి

image

గుంటూరులో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. శ్రీనివాస్ ఎస్కార్ట్ సెక్యూరిటీకి డ్యూటీ చేస్తూ ఉంటాడు. అయితే తుపాకీ మిస్ ఫైర్ అయి శ్రీనివాస్ మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉంచారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.