India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాచర్ల నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన జూలకంటి బ్రహ్మారెడ్డి తండ్రి నాగిరెడ్డి, తల్లి దుర్గాంబ మాచర్ల ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1972 ఎన్నికలలో ఇండిపెండెంట్గా పులి గుర్తుపై పోటీ చేసి జూలకంటి నాగిరెడ్డి గెలుపొందారు. అప్పటినుంచి ఆయనను పల్నాటి పులి అని పిలుస్తారు. 1999 ఎన్నికలలో నాగిరెడ్డి సతీమణి దుర్గాంబ టీడీపీ నుంచి గెలుపొందారు. తాజాగా బ్రహ్మారెడ్డి విజయం సాధించారు.
పెదకూరపాడులో టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన తన మామ, సమీప ప్రత్యర్థి నంబూరు శంకర్రావుపై గెలిచారు. కాగా, మార్చి 15న నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు ప్రవీణ్ను ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన 60 రోజుల్లోనే ప్రజల మనసు గెలుచుకున్నారు. సీనియర్ నేత, టికెట్ ఆశించి భంగపడిన కొమ్మాలపాటి శ్రీధర్ సహకారం ఈయనకు కలిసొచ్చింది. పల్నాడులో తొలిసారి గెలిచిన వారిలో భాష్యం ప్రవీణ్ ఒకరు.
బాపట్ల ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ విజయం సాధించినట్లు బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి, బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ధ్రువీకరించారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి నందిగం సురేశ్ పై, తెన్నేటి కృష్ణ ప్రసాద్ విజయం సాధించినట్లు ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
గురజాల, మాచర్లలో TDP అభ్యర్థులు గెలిచారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇక్కడి MLAలకు మంత్రి పదవి దక్కలేదు. గురజాల నుంచి వరుసగా 7సార్లు పోటీ చేసి 4సార్లు గెలిచిన యరపతినేనికి పలుమార్లు మంత్రి పదవి చేతిదాకా వచ్చి జారిపోయింది. ఒక దశలో యరపతినేని అనధికార హోంమంత్రిగా చక్రం తిప్పారు. చంద్రబాబు, లోకేశ్కు సన్నిహితుడైన యరపతినేనికి రానున్న మంత్రివర్గంలో స్థానం దక్కుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
గుంటూరు టీడీపీ ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపొందారు. ఆయన తన ప్రత్యర్థి కిలారు వెంకట రోశయ్యపై 3,44,695 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయనకి 8,64,948 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 5,20,253 ఓట్లు వచ్చాయి. కాగా పెమ్మసాని అమెరికా నుంచి గుంటూరు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి తనదైన శైలిలో అందరినీ కలుపుకుంటూ వెళ్ళారు. గుంటూరు జిల్లాలో టీడీపీ జెండా ఎగరవేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గల్లా మాధవి విజయకేతనం ఎగురవేశారు. వైసీపీ అభ్యర్థి, మంత్రి విడుదల రజనీపై 49722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలిసారిగా రాజకీయంలోకి వచ్చిన గల్లా మాధవి చివరి క్షణంలో అనూహ్యంగా ఎమ్మెల్యే సీటు పొందారు. ఏకంగా ఒక మంత్రిపై గెలుపొంది సంచలనం సృష్టించారు. దీంతో టీడీపీ శ్రేణులు గుంటూరులో సంబరాలు చేసుకున్నాయి.
నారా లోకేశ్ 85,140 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 22 రౌండ్లకు గానూ, 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పటి వరకు లోకేశ్కు 155462 ఓట్లు, వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు 70322 ఓట్లు వచ్చాయి. నారా లోకేశ్ గెలుపు ఖాయమైందని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఆయన 3,16,231 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 7,64,321 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 4,48,090 ఓట్లు నమోదయ్యాయి. మూడో స్థానంలో ఉన్న సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్కు 4,026 ఓట్లు వచ్చాయి.
చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కావటి మనోహర్ నాయుడిపై 32,098 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితులను మంగళవారం జిల్లా ఎస్పీ తుషార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ అనంతరం జిల్లాలోని పరిస్థితులను నాగార్జున యూనివర్సిటీలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం ఆవరణతోపాటు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.