India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చల్లపల్లి మండలం నడకుదురు వద్ద కరకట్టపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా రేపల్లె సమీపంలోని గ్రామానికి చెందిన కుంభా నాంచారయ్య అనే వ్యక్తి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై గ్రామాల్లో తిరుగుతూ.. వ్యాపారం చేసుకుని జీవించే నాంచారయ్య బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు గుర్తించి 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చి మోపిదేవి అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
జూన్ 4న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ మల్లింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలు బుడంపాడు జంక్షన్, తెనాలి, వేమూరు, పెనుమూడి బ్రిడ్జి మీదుగా ప్రయాణించాలన్నారు. నాలుగో తేదీ కౌంటింగ్ ముగిసే వరకు మళ్లింపు ఉంటుందన్నారు. వాహనదారు సహకరించాలన్నారు.
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. ఆదివారం పోలీసులు గ్రామంలో తనిఖీలు నిర్వహించగా.. ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తి గడ్డివామిలో నిల్వ చేసి ఉంచిన సుమారు 5 లీటర్ల పెట్రోలు, 18 సీసాలు, 9 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముడి సామగ్రికి సంబంధించిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. హోంగార్డ్ భాస్కరరావు కొంత కాలంగా రేంజ్ ఐజీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులుగా బందోబస్తు విధులకు హాజరవుతున్నాడు. శనివారం రాత్రి విధులకు హాజరై తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా నల్లపాడు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించిన టేబుల్స్ ఇతర సామాగ్రిని ఆదివారం అధికారులు సిద్ధం చేశారు. గుంటూరు పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్కు సర్వ సిద్ధం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో అసెంబ్లీ నియోజవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్, పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ సిద్ధం చేసినట్లు తెలిపారు.
గుంటూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయులు విజయం సాధిస్తారని పేర్కొంది. మరోవైపు, బాపట్ల ఎంపీగా నందిగం సురేశ్ గెలవనున్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాలోని 3 ఎంపీ స్థానాల్లో 2 టీడీపీ, ఒకటి వైసీపీ సొంతం చేసుకుంటాయన్న ఈ సర్వేపై మీ COMMENT.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజలు కూటమికే పట్టం కట్టారని ‘చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్’ అంచనా వేసింది. మొత్తం 17 స్థానాల్లో కూటమి 10 సీట్లు గెలుస్తుందని, మూడు చోట్ల ఎడ్జ్(TDP) ఉన్నట్లు పేర్కొంది. ఇదే క్రమంలో వైసీపీకి ఒక సీటు వస్తుందని చెప్పింది. బాపట్ల, నరసరావుపేట, మాచర్లలో రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఈ సర్వేపై మీ COMMENT.
గుంటూరు-కేసీ కెనాల్ మధ్య ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఈనెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. విజయవాడ-గుంటూరు(07464), గుంటూరు-విజయవాడ (07465), గుంటూరు-విజయవాడ(07976), హుబ్బళి-విజయవాడ(17329) రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రెండు రోజులు సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో 2024 సార్వత్రిక ఎన్నికల సంబంధించి ఓట్లలెక్కింపు ఉన్న నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు సెలవులు కేటాయించినట్లు పేర్కొన్నారు. వర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల 3,4 (సోమ, మంగళవారాలు) తేదీల్లో సెలవులు కేటాయించినట్లు చెప్పారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 సీట్లకు గానూ, NDA కూటమి 11-12 సీట్లు గెలుస్తుందని బిగ్ టీవీ సర్వే తెలిపింది. 5-6 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తం మీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.