Guntur

News December 30, 2024

GNT: నేడు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు’

image

ఈనెల 30న వన్ మాన్ కమిషన్ పర్యటన (శ్రీ రాజీవ్ రంజాన్ మిశ్రా ఐఏఎస్(రిటైర్డ్) నేతృత్వంలోని బృందం రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల వర్గీకరణపై నిర్దిష్ఠ సిఫారసులు సూచించడానికి జిల్లాలో పర్యటించనుంది. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల దృష్ట్యా గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

News December 29, 2024

నరసరావుపేటలో సీఎం పర్యటన ఇలా.!

image

నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి ఈనెల 31న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. 11.40 వరకు పింఛన్లు అందజేస్తారు. అనంతరం గ్రామంలోని ఆలయాన్ని సీఎం సందర్శిస్తారు. మధ్యాహ్నం కోటప్పకొండకు చేరుకొని 2.20కి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. భోజనం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకొని 3.10లకు ముఖ్యమంత్రి తిరిగి ఉండవల్లి చేరనున్నారు.  

News December 29, 2024

గుంటూరు జిల్లాలో 16 శాతం క్రైమ్ రేటు తగ్గింది: ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ సతీశ్ కుమార్ వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాదితో పోల్చితే 16 శాతం క్రైమ్ రేటు గుంటూరు జిల్లాలో తగ్గిందని వెల్లడించారు. జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించామన్నారు. రోడ్డు ప్రమాదాలు 5 శాతం పెరిగాయని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 224 మందిని గంజాయి కేసుల్లో పట్టుకొని 12 మందిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు.  

News December 29, 2024

పెదకాకాని: మహిళ అనుమానాస్పద మృతి

image

పెదకాకాని(M) నంబూరులో మల్లికా(29) అనే మహిళ శనివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. మల్లిక మొదటి భర్తతో విడిపోయి ప్రేమ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య మంచంపై శవమై ఉంది. మెడ మీద గాయాలు ఉండటంతో పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. సీసీ కెమెరాలో ఇద్దరు మాస్కులు ధరించి వచ్చి వెళ్లినట్లు గమనించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 29, 2024

2024లో ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్

image

@అమరావతిని తిరిగి రాజధానిగా అభివృద్ధి చేయడం @ఎలక్షన్ సమయంలో నరసరావుపేట, మాచర్ల పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు @గుంటూరు నుంచి ఎంపీ పెమ్మసాని కేంద్రమంత్రిగా ఎంపిక @వినుకొండలో నడిరోడ్డుపై రషీద్ దారుణ హత్య @అక్టోబర్లో కృష్ణానది ఉగ్రరూపం, బోటు ఢీకొనడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ధ్వంసం @ఆస్తి కోసం అన్నదమ్ములను సోదరి హత్య చేయడం @ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుఫాన్లు, వరదల నేపథ్యంలో తీవ్ర పంట నష్టం.

News December 29, 2024

గుంటూరు: విద్యార్థినిని గర్భిణి చేసిన ఫుడ్ డెలివరీ బాయ్

image

10th విద్యార్థినిని గర్భిణి చేసిన ఫుడ్ డెలివరీ బాయ్‌పై అరండల్ పేట స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. ఇమ్మానియేల్ పేటకు చెందిన అజయ్ కుమార్ చదువు మానేసి ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల నుంచి అదే ప్రాంతానికి చెందిన విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడి చేశాడు. కడుపు నొప్పి రావడంతో బాలికను ఆసుపత్రికి తరలించే లోపు ఇంట్లోనే ప్రసవించిందన్నారు.

News December 28, 2024

మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: జస్టీస్ ఎన్వి రమణ

image

సమాజం సంతోషంగా ఉంటే మనం కూడా ఆనందమయ జీవితాన్ని గడుపుతామని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. నాగార్జున యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల సమావేశం శనివారం డైక్ మన్ హాల్లో సంఘం డైరెక్టర్ జివిఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వి రమణ పాల్గొని మాట్లాడుతూ మనలోని భావాలను మాతృభాష ద్వారా వ్యక్తపరిస్తే అందులో కనిపించే భావోద్వేగం సరైన క్రమంలో చెప్పగలుగుతామన్నారు.

News December 28, 2024

ఆటోడ్రైవర్లు నిబంధనలు పాటించాలి: GNT ఎస్పీ

image

ఆటో డ్రైవర్ల ముసుగులో కొంతమంది అసాంఘిక, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. గుంటూరు నగరంలోని పోలీస్ కల్యాణ మండపంలో శనివారం ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా డ్రైవర్లు వ్యవహరించాలని కోరారు. ప్రయాణీకులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. 

News December 28, 2024

గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో దేహదారుడ్య పరీక్షలు- ఎస్పీ

image

గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ శుక్రవారం తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్ పరీక్ష(PMT) ఉంటుందన్నారు. ఫిజికల్ ఎఫీషియన్సీ పరీక్షలను(PET) పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 30వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News December 27, 2024

నరసరావుపేట: వివాహిత అనుమానాస్పద మృతి

image

నరసరావుపేట మండలం గురవాయపాలెం ఎస్సీ కాలనీలో భార్యను చంపి ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా భర్త నమ్మించే ప్రయత్నం చేసిన ఉదంతం శుక్రవారం జరిగింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. భార్య గార్నేపూడి అనితపై అనుమానంతో భర్త రమేష్ కొట్టి చంపాడని, అనంతరం నైలాన్ తాడుతో ఉరి వేశాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట రూరల్ పోలీసులు తెలిపారు.