Guntur

News May 31, 2024

జస్టిస్ ఏపీ శేష సాయి సేవలు ప్రసంశనీయం: చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

image

ఏపీ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవీ శేష సాయి అందించిన సేవలు ప్రసంశనీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నశేష సాయి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు సమావేశ మందిరంలో నిర్వహించిన సభలో చీఫ్ జస్టిస్ ప్రసంగించారు. హైకోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.

News May 31, 2024

గుంటూరులో గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. బ్రాడీపేట 2/17 రోడ్డుపై మద్యం మత్తులో ఓ వ్యక్తి పడిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిసింది. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసినవారు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ తెలిపారు.

News May 31, 2024

చిలకలూరిపేట వద్ద రెండు లారీలు ఢీ

image

చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తాతపూడి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తున్న మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ భోగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 31, 2024

పల్నాడులో షాపులు బంద్.. ఎప్పటినుంచంటే..!

image

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాల మేరకు జూన్ 2,3,4,5 తేదీలలో షాపులు పూర్తిగా మూసి వేయనున్నట్లు, నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరి కిషోర్ బాబు తెలిపారు. శాంతి భద్రతల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్థులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. శనివారం ఐదు గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి అనంతరం షాపులు మూసి వేయవలసిందిగా కిషోర్ కోరారు.

News May 31, 2024

గుంటూరు: కట్నం కోసం భార్యను కొరికిన భర్త పై కేసు

image

అదనపు కట్నం కోసం భార్య ఒళ్లంతా కొరికేసిన వైనం పెనమలూరు PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన షేక్‌ మహ్మద్‌ రఫీకి, కానూరు సనత్‌నగర్‌కు చెందిన షేక్‌ ముస్కాన్‌కు ఏడాది కింద వివాహమైంది. వివాహమైన మూడు నెలల తర్వాత చెడు వ్యసనాలకు అలవాటైన భర్త అదనపు కట్నం తేవాలంటూ భార్య ఒళ్లు కొరికేయడం, కొట్టడం చేస్తుండడంతో పుట్టింటికి వెళ్లి గురువారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 31, 2024

గుంటూరు: అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తులు

image

అగ్నివీర్-వాయు ఉద్యోగాలకు ఆన్లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెంది పదో తరగతి విద్యార్హత కలిగిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు agnipathvayu.cdac.in వెబ్సైట్ ద్వారా జూన్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తాత్కాలిక అడ్మిట్ కార్డు పొందిన అభ్యర్థులు మాత్రమే రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొంటారన్నారు.

News May 31, 2024

గుంటూరు: కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను గురువారం సాయంత్రం కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. ముందుగా కంట్రోల్ రూమ్ సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాటుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. కమిషనర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఉన్నారు.

News May 30, 2024

బాపట్ల: గల్లంతయిన నాలుగో వ్యక్తి మృతదేహం లభ్యం

image

మండలంలోని నాగరాజు కాలవలో బుధవారం గల్లంతు అయిన వారిలో నాలుగో వ్యక్తి మృతదేహం గురువారం లభ్యం అయింది. మండలంలోని మూలపాలెం గ్రామం వద్ద కాలవలో నాలుగో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అధికారులు రెండు రోజులు పాటు కృషి చేసి 4 మృతదేహాలను వెలికి తీశారు.

News May 30, 2024

గుంటూరు: జూన్ 3 నుంచి మద్యం షాపులు మూసివేత

image

జూన్ 3 సాయంత్రం 6:00 నుంచి జిల్లాలోని మద్యం షాపులు మూసివేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించడంలో భాగంగా జూన్ 3 సాయంత్రం 6:00 నుంచి ఓట్ల. లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. 

News May 30, 2024

బాపట్లలో నలుగురి గల్లంతు.. రంగంలోకి దిగిన NDRF బృందం

image

బాపట్ల జిల్లా నల్లమల వాగులో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే 3 మృతదేహాలు లభ్యం కాగా <<13341655>>నాలుగో వ్యక్తి ఇంకా లభ్యం కాలేదు. <<>>ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాలతో తహసీల్దార్ శ్రవణ్ కుమార్, డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో NDRF బృందం రంగంలోకి దిగింది. ఇప్పటికే బాపట్ల రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు ప్రత్యేక బోట్ల ద్వారా నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.