India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 7 రోజుల సమయమే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 15 అసెంబ్లీ, 2 MP స్థానాలు గెలుచుకోగా, తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీది ఆధిపత్యం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఆదివారం సరకుల రైలు పట్టాలు తప్పిన ఘటనపై విచారణకు కమిటీని నియమిస్తూ మండల రైల్వే అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో సీనియర్ అధికారులను నియమించారు. సీనియర్ డీఈఎన్(కోఆర్డినేషన్), సీనియర్ డీఎస్వో, సీనియర్ డీఎంఈ, సీనియర్ డీఎంవో ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు తమ నివేదికను జూన్ 2 లోపు ఇవ్వాలి. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను సోమవారం గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. శ్రీనివాసరావుపేటలో లత అనే మహిళ ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. కొద్దిరోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తోంది. సోమవారం సీఐ మధుసూదన్ రావు ఆ ఇంటిపై తనిఖీలు చేసి ఇద్దరు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూములను కౌంటింగ్ ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పరిశీలించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తి చేకూరి, ఎస్పీ తుషార్తో కలిసి స్ట్రాంగ్ రూంలో భద్రత ఏర్పాట్లను, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నామని మీనా తెలిపారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూములను కౌంటింగ్ ఏర్పాట్లను సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పరిశీలించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ కీర్తి చేకూరి, ఎస్పీ తుషార్తో కలిసి స్ట్రాంగ్ రూంలో భద్రత ఏర్పాట్లను, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నామని మీనా తెలిపారు.
లోన్ యాప్లో రుణం తీసుకొని, దాన్ని తీర్చలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడేపల్లిలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడకు చెందిన వంశీ(22) యాప్లో రుణం తీసుకొని క్రికెట్ బెట్టింగులు పెట్టాడు. తిరిగి చెల్లించాలని నిర్వాహకులు ఒత్తిడి నేపథ్యంలో, తల్లిదండ్రులకు చనిపోతున్నట్లు మెసేజ్ చేసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కచ్చితమైన ప్రణాళికలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటాయని ఆయన అన్నారు.
రెంటచింతల మండలంలోని రెంటాలలో ఈ నెల 13న ఏజెంట్లపై దాడి కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ఎం. ఆంజనేయులు ఆదివారం తెలిపారు. దాడిలో గాయపడిన చేరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, చేరెడ్డి మంజుల, గొంటు నాగమల్లేశ్వరరెడ్డి, చేరెడ్డి రఘురామిరెడ్డిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. 12 మందిని గురజాల జూనియర్ సివిల్ జిడ్జి ముందు హాజరు పరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.
పట్టణంలో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్న పోలీసులు చర్యలు తీసుకోకపోవటం బాధాకరమని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పాశవికంగా కత్తులతో స్వైర్య విహారం చేయడం పట్ల వారు ఆవేదన వెలిబుచ్చారు. తురక కిషోర్ ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకటేశ్ సుమారు 10కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.
పట్టణంలో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్న పోలీసులు చర్యలు తీసుకోకపోవటం బాధాకరమని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పాశవికంగా కత్తులతో స్వైర్య విహారం చేయడం పట్ల వారు ఆవేదన వెలిబుచ్చారు. తురక కిషోర్ ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకటేశ్ సుమారు 10కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.
Sorry, no posts matched your criteria.