Guntur

News November 7, 2024

మేరుగు నాగార్జునపై అత్యాచారం కేసులో BIG TWIST

image

మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై అత్యాచారం కేసు ఊహించని మలుపు తిరిగింది. మేరుగుపై రాజకీయ ఒత్తిడితో తప్పుడు చేసు కేసు పెట్టానని బాధిత మహిళ హైకోర్టులో తెలిపింది. కేసు కొట్టేయాలని బాధిత మహిళ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు చేసిన వారు కోరిన వెంటనే కేసు కొట్టివేయలేమని, ఫిర్యాదు చేసిన వారు కూడా దీనిపై పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈనెల 12కి కేసు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.

News November 7, 2024

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

* CRDA పరిధిలోకి పల్నాడు జిల్లా.. కేబినెట్ ఆమోదం
* అంబటికి హోంమంత్రి అనిత కౌంటర్
* మచిలీపట్నం-రేపల్లె, రేపల్లె-బాపట్ల మధ్య కొత్త రైల్వేలైన్
* నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
* అమరావతిలో బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి
* పట్టభద్రుల ఓటు కోసం 40,105మంది దరఖాస్తు: పల్నాడు కలెక్టర్
* బోరుగడ్డ అనిల్‌కు మరో 14రోజుల రిమాండ్
* మంచి మనసు చాటుకున్న మంత్రి సవిత

News November 6, 2024

డిసెంబర్ 15లోపు అందుబాటులోకి తేవాలి: గుంటూరు కలెక్టర్

image

గుంటూరు నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. ప్రాంతీయ గ్రంథాలయాన్ని, పాత గుంటూరులోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్‌ భవనాన్ని డిసెంబర్ 15లోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు.

News November 6, 2024

CRDA పరిధిలోకి పల్నాడు జిల్లా.. కేబినెట్ ఆమోదం

image

సీఆర్డీఏ పరిధి పెంచుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా సీఆర్డీఏ పరిధిలోకి చేరింది. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 1069.55 చదరపు కి.మీ విస్తీర్ణం, పల్నాడు జిల్లాలోని 92 గ్రామాలు, బాపట్ల జిల్లాలోని 62 గ్రామాలను చేర్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని అభివృద్ధి నిధులతో పల్నాడు మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 6, 2024

విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలి: గుంటూరు ఎస్పీ 

image

క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో శాంతిభద్రత సమస్యలను పరిష్కరించాలని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌ని ఎస్పీ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరను స్వయంగా పరిశీలించారు. మహిళా ఫిర్యాదిదారుల కోసం ప్రత్యేక వెయిటింగ్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని, పెండింగ్ వాహనాలను త్వరగా డిస్పోస్ చేయాలని ఆదేశించారు.

News November 5, 2024

తుళ్లూరు: సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలన

image

తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో 400/220 కేవీ సబ్ స్టేషన్ నవంబర్ 7న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ నాగలక్ష్మీ పరిశీలించి మాట్లాడారు. సీఆర్డీఏ పరిధిలో భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా కేవీ సబ్ స్టేషన్‌ను జీఐఎస్ పద్ధతిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాన్స్కో ద్వారా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు.

News November 5, 2024

గుంటూరు: ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌కి దరఖాస్తులు ఆహ్వానం

image

APSRTCలో అప్రెంటిస్ షిప్ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రజారవాణా అధికారి ఎం.రవికాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో జిల్లాల వారీగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.apsrtc.ap.gov.in లో చూడాలని చెప్పారు.

News November 5, 2024

నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఇదే!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11:30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం డ్రోన్ ఐటీ, సెమీకండక్టర్ పాలసీలపై అధికారులతో సమీక్ష చేస్తారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం పనులపై రివ్యూ చేసి, తరువాత రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్స్ తో సమావేశం అవుతారు

News November 5, 2024

తిరుమలలో జగన్ స్టిక్కర్‌తో అంబటి.. ఏం జరిగిందంటే..?

image

పల్నాడు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ స్టిక్కర్‌తో కూడిన షర్టులనే వాడుతుంటారు. ఆయన ఎక్కడకు వెళ్లినా అదే షర్టుతో ఉంటారు. ఈక్రమంలో అంబటి నిన్న తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆ సమయంలోనూ షర్టుపై జగన్ స్టిక్కర్ ఉందని అనకాపల్లి MP సీఎం రమేశ్ గుర్తించారు. తిరుమలలో రాజకీయ స్టిక్కర్లు, ప్లెక్సీలు నిషేధమని.. వెంటనే అంబటి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

News November 5, 2024

మాచవరం రానున్న డిప్యూటీ సీఎం పవన్

image

మాచవరం మండలం చెన్నాయపాలెంలోని సరస్వతి ఇండస్ట్రియల్ భూములను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించినట్లు తహశీల్దార్ క్షమారాణి మంగళవారం తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని సుమారు 1000 ఎకరాల వరకు రైతుల వద్ద నుంచి భూములు సేకరించి ఇప్పటివరకు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదన్నారు. దీంతో వవన్ పర్యటనపై జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.