Guntur

News December 22, 2024

GNT: హాస్టల్లోనే ఫార్మసీ విద్యార్థిని ప్రసవం

image

గుంటూరు కలెక్టర్, ఎస్పీ ఆఫీస్‌కి కూతవేటు దూరంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో 19ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాకు దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లోనే ప్రసవించడంతో అధికారులు జీజీహెచ్‌కి తరలించారు. ఈఘటనపై కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్ డబ్ల్యూఓ జయప్రదను సస్పెండ్ చేసి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సమీప బంధువు గర్భానికి కారణమని సమాచారం. 

News December 22, 2024

జమిలి ఎన్నికలకు మా పార్టీ సంపూర్ణ మద్దతు: సుబ్రహ్మణ్యం

image

ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించడం కోసం తెచ్చిన బిల్లు అన్ని పార్టీలు సమర్థించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలు బిల్లు చారిత్రాత్మక నిర్ణయమని, చరిత్రలో నిలిచిపోయే బిల్లు అని అన్నారు. జమిలి ఎన్నికలకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని రావు తెలిపారు.

News December 21, 2024

ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.

News December 21, 2024

బాలయేసు కేథడ్రల్ చరిత్ర మీకు తెలుసా.? 

image

ఫిరంగిపురంలోని బాలయేసు కేథడ్రల్‌ ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద చర్చి. ఈ చర్చి నిర్మాణానికి దశాబ్దాలుగా కృషిచేసిన ఫాదర్ థియోడర్ డిక్మన్ 1891లో పూర్తిచేశారు. జులై, క్రిస్మస్‌లో ఇక్కడ జరిగే ఉత్సవాలు ప్రసిద్ధం. జులై 14,15,16 DEC 23,24,25 తేదీల్లో ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. 24రాత్రి గుంటూరు బిషప్ చర్చిలో దివ్య బలిపూజా నిర్వహిస్తారు. కాగా ఈ బలి పూజను గుంటూరు జిల్లా నుంచే ప్రారంభమవుతుంది.

News December 21, 2024

తెనాలి: ఇస్రో ప్రయోగంతో అంతరిక్షంలోకి ఎన్ స్పెస్ టెక్ కమ్యూనికేషన్

image

తెనాలికి చెందిన రక్షణ ఎయిరోస్పేస్‌ సంస్థ ఎన్‌–స్పేస్‌టెక్‌ రూపొందించిన తొలి యూహెచ్‌ఎఫ్‌ కమ్యూనికేషన్‌ పేలోడ్‌ను ఇస్రోకు చెందిన పీఎస్‌ఎల్‌వీ–సీ60 మిషన్‌లో ప్రయోగించనున్నారు. స్వదేశీ సామర్థ్యంతో, ఉపగ్రహ కమ్యూనికేషన్‌లో వినూత్నతను ప్రతిబింబించే స్వేచ్ఛాశాట్‌–వీఓ మిషన్‌ పేరుతో చేపడుతున్న ఈప్రయోగం చివరి వారంలో ఇస్రో పొయెం-4 ప్లాట్‌ఫాం ద్వారా జరుగుతుందని ఎన్‌–స్పేస్‌టెక్‌ సీఈవో దివ్య కొత్తమాసు తెలిపారు.

News December 21, 2024

పేరేచర్ల: అర్ధరాత్రి ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్

image

మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరేచర్ల కాలువ సమీపంలో అర్ధరాత్రి ప్రమాదం సంభవించి ఓ యువకుడు ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి  తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News December 21, 2024

పీఎం రాష్ట్రీయ బాలపురస్కార్‌‌కు మంగళగిరి బాలిక

image

అంతర్జాతీయ స్కేటింగ్‌ వేదికపై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన మంగళగిరికి చెందిన క్రీడాకారిణి జెస్సీరాజ్‌ను ప్రధానమంత్రి రాష్ట్రీబాల పురస్కార్‌–2025 వరించింది. 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ పతకం సాధించి ప్రపంచ క్రీడావనిపై మువ్వెన్నల జెండాను ఎగురవేసిన జెస్సీని అత్యున్నత పురస్కారంతో ప్రభుత్వం గౌరవించనుంది. ఈ నెల 26న ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనుంది.

News December 21, 2024

గుంటూరు: ‘చైన్ స్నాచింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు’

image

పాత నేరస్తులు, జైలు నుంచి విడుదలైన వారిపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చైన్ స్నాచింగ్‌కు పాల్పడే వారిపై సాంకేతిక పరమైన నిఘా పెట్టి త్వరగా పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

News December 20, 2024

గుంటూరు జిల్లా బ్రాండ్ ప్రతిభింబించాలి: కలెక్టర్ నాగలక్ష్మి

image

పట్టణంలోని శంకర్ విలాస్ సెంటరులో నూతనంగా నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వల్ల కలిగే ట్రాఫిక్ రద్దీ నివారణకు అనుగుణంగా, ఐకానిక్ ఆర్కిటెక్చర్ ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పిల్లర్లపై జిల్లా బ్రాండ్‌ను ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని సూచించారు.

News December 20, 2024

విస్తుపోయేలా చేసిన మహిళ మర్డర్ స్కెచ్

image

డబ్బే లోకంగా మారిపోయిన రోజులివి. ఆస్తి, ఉద్యోగం దక్కితే చాలు.. తమ జీవితాలు ఇక స్థిరపడిపోతాయనే ఆలోచన బలంగా నాటుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. తల్లి, తండ్రి, అన్నాచెల్లి అనే పేగు బంధాలకు పాతర వేసి హంతకులవుతున్నారు. నకరికల్లులో జరిగిన <<14929205>>డబుల్ మర్డర్ <<>>కేసే ఇందుకు ఉదాహరణ. ఆస్తి, తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కోెసం అన్నదమ్ములను ప్రియుడితో కలిసి దారుణంగా చంపిన కృష్ణవేణి క్రూరమైన ఆలోచన మానవత్వానికే మాయని మచ్చ.