India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పల్నాడు జిల్లాలో అన్న,తమ్ముడిని సోదరి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి విస్తు పోయే నిజాలు బయటకు వస్తున్నాయి. స్థానికుల సమాచారం మేరకు.. ఉపాధ్యాయుడైన తండ్రి పక్షవాతంతో మృతిచెందగా, ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం గత కొంతకాలంగా ముగ్గురి మధ్య వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే సోదరి కృష్ణవేణి సోదరుడు గోపికృష్ణను చున్నీతో ఉరివేయగా, దుర్గ రామకృష్ణను కాలువలో తోసి చంపినట్లు సమాచారం.
అమెరికాకు అనేక కారణాలతో వెళ్లిన యువకులు వరుసగా మృతిచెందడంతో తెనాలిలో తీవ్ర విషాదం నింపుతోంది. 2024 సంవత్సరంలో తెనాలి నుంచి చదువుకోడానికి వెళ్లిన ఇద్దరిలో ఒకరు యాక్సిడెంట్, మరొకరు స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ మృతిచెందారు. ఇది మరువక ముందే తాజాగా తెనాలికి చెందిన మరో యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తెనాలి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరుగుతోందన్న భయంలో తెనాలి వాసులు ఉంటున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లాలోని అన్ని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులు చేయదలచిన ప్రజలు విషయాన్ని గమనించి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువచేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన వివాహానికి రావాలని చంద్రబాబుకు సింధు తండ్రితో కలిసి ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానించారు.
సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన జీవిత చరిత్రను గురించి చంద్రబాబు కొనియాడారు. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం, తెలుగుజాతి కోసం 56 రోజుల పాటు నిరాహారదీక్ష చేసి ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, మహారాష్ట్ర వంటి భాషా ప్రభుత్వ రాష్ట్రాల ఏర్పాటుకు తోడ్పడ్డారన్నారు.
గుంటూరులో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జరిగింది. పట్టాభిపురం పోలీసుల వివరాల మేరకు.. మద్యానికి బానిసైన రాంబాబు(35)అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలని భార్యను ఒత్తిడి చేస్తున్నాడు. భార్య ఇవ్వకపోవడంతో తన తల్లి నివాసం ఉంటున్న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సినీ హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కావడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా మరో ట్వీట్ చేశారు. ‘గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు.. నా మాట కాదు.. ఇది జనం మాట’! అంటూ అంబటి ఏపీ CM చంద్రబాబు, తెలంగాణ CM రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ను ట్యాగ్ చేశారు. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో అంబటి వరుస ట్వీట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
తల్లిదండ్రులను కన్నకొడుకు హత్య చేసిన సంఘటన బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. విజయభాస్కరరావు, సాయి కుమారి అనే దంపతులు అప్పికట్లలో గృహం నిర్మించుకొని నివాసం ఉంటున్నారని ఆస్తుల పంపకంలో విభేదాల గురించి సంబంధించి వీరి కుమారుడు కిరణ్ వారిని దారుణంగా హత్య చేశాడన్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సిఉంది. పోలీసులు హత్య జరిగిన ఇంటి వద్ద పహారా కాశారు.
సినీ హీరో అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పద్మవ్యూహం నుంచి బయటకి వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు! అంటూ ఆయన పోస్ట్ చేశారు. కాగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్ అల్లుఅర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు.
పిడుగురాళ్ల మండలంలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన నూర్జిత్ కుమార్ (20) కుటుంబ సభ్యులతో పిడుగురాళ్ల మండలం కామేపల్లికి వరి మిషన్తో పాటు వచ్చారు. కొంతకాలంగా ఆ ప్రాంతంలో ఓ యువతిని ప్రేమించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ప్రేమ విఫలం కావడంతో చెట్టుకు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.