Guntur

News May 22, 2024

గుంటూరు: వాయుసేనలో ఉద్యోగాలకు దరఖాస్తులు

image

భారత వాయు సేనలో అగ్ని వీర్ సైనిక ఉద్యోగాలకు ఆన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు. పదో తరగతి తత్సమానమైన విద్యా అర్హత కలిగి ఉండాలన్నారు. సంగీత ప్రావీణ్యం ఫ్లూట్, కీబోర్డ్, పియాసో మొదలైన వాటిలో ఏదైనా ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. నేటి నుంచి జూన్ ఐదవ తేదీ వరకు https:///agnipathvayu.cdac.in ఆన్లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.

News May 22, 2024

నేర నియంత్రణే లక్ష్యంగా కార్డెన్ & సెర్చ్: డీజీపీ

image

నేర నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్డెన్ & సెర్చ్ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు 301 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ఎటువంటి పత్రాలు లేని 1104 వాహనాలు జప్తు చేసి, 482 లీటర్ల ఐడీ లిక్కర్, 33.32 లీటర్ల మద్యం, 436 లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News May 21, 2024

గుంటూరు: ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు ఆహ్వానం

image

గుంటూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు నందు అవుట్ సోర్సింగ్ బేసిస్‌పై 3 ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి మంగళవారం తెలిపారు. OC-01, EWS -01, BC–B(W)-01 పోస్టులకు, ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్ధులు 18 నుంచి 42 సం.ల లోపు వయస్సు కలిగి ఉండి, 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్హతలు కలిగి ఉండాలని సూచించారు.

News May 21, 2024

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు కలెక్టర్, ఎస్పీ

image

జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కలెక్టర్ శ్రీకేశ్, ఎస్పీ మలికా గర్గ్‌తో కలిసి నరసరావుపేట జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్, రిటర్నింగ్ అధికారి రమణ కాంత్ రెడ్డి, సరోజ తదితరులు పాల్గొన్నారు.

News May 21, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరిది ఆధిపత్యం?

image

జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం గుంటూరు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 MP స్థానాలున్నాయి. మహిళల ఓటింగ్ పెరిగిందని, వారంతా YCPకే ఓటు వేశారని మంత్రి అంబటి, తదితర నేతలు ప్రకటించారు. మరోవైపు, మెజార్టీ స్థానాలు తమవే అని యరపతినేని, ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీది ఆధిపత్యం ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News May 21, 2024

గుంటూరు: సీల్ లేని పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లు.. చర్చనీయాంశం

image

పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లకు సీల్ వేయకుండా వదిలేసిన వైనం చర్చనీయాంశమైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లను జీఎంసీలోని అద్దాల గదిలో ఉంచారు. సరైన భద్రత లేని ఆ గది నుంచి బాక్సులను మార్చాలని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇటీవల అధికారులు వాటిని మరో స్ట్రాంగ్ రూంలోకి మార్చారు. వాటికి సీల్ లేకపోవడం గుర్తించి అధికారులకు తెలపడంతో సీల్ వేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు.

News May 21, 2024

విచారణకు నేను సిద్ధం: లావు కృష్ణదేవరాయలు

image

పల్నాడులో అల్లర్లకు తానే కారణమని YCP నేతలు ఆరోపిస్తున్నారని నరసరావుపేట MP అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మండిపడ్డారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఎన్నికల ప్రధాన అధికారికి ముకేశ్ కుమార్‌కు ఆయన సోమవారం ఫిర్యాదు చేశారు. మాజీ ఎస్పీ బిందు మాధవ్‌తో తమ కుటుంబానికి బంధుత్వం ఉందని కట్టుకథలు అల్లుతున్నారని పేర్కొన్నారు. తన కాల్ డేటా పరిశీలించాలని, విచారణకు సిద్ధమని ప్రకటించారు.

News May 20, 2024

గుంటూరును పాలించిన రాజవంశీయులు వీరే..

image

గుంటూరు కొన్ని ప్రసిద్ధ రాజవంశాలచే పాలించబడింది. వారిలో శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రికలు, కోటవంశీయులు, విష్ణుకుండినలు, చాళుక్యలు, చోళులు, కాకతీయులు, విజయనగర వంశీయులు, కుతుబ్ షాహిలు ఉన్నారు. కొందరు చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని గుంటూరులోని ధాన్యకటకం (అమరావతి) అని అభివర్ణిస్తున్నారు.

News May 20, 2024

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలి: కలెక్టర్

image

జూన్ 4న కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులతో ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేనందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ.. అధిక మొత్తంలో బాణా సంచా విక్రయాలు చేపట్టవద్దని హోల్ సేల్ డీలర్స్‌ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. అధికారుల ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.

News May 20, 2024

స్ట్రాంగ్ రూమ్ ఉన్న ప్రాంతంలో డ్రోన్లు ఎగరవేయడం నిషేధం: వేణుగోపాల్ రెడ్డి

image

గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీయంలు, వీవీ ప్యాట్‌లు భద్రపరచిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతంలో డ్రోన్లు ఎగురవేయడం నిషేధిస్తూ గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి, ఈవీఎంలు కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచే వరకు ఈ నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.