India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలో రైతుల సమస్యలపై డిసెంబరు 13న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఉద్యమం చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఉద్యమం పోస్టర్ను విడుదల చేశారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితర నేతలు పిలుపునిచ్చారు.
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటికి రక్షణ కోసం నిర్మించిన ఇనుప కంచెలో కొంత భాగాన్ని సోమవారం తొలగించారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో భద్రత కోసం తాడేపల్లిలోని తన ఇంటి ప్రహరీ గోడకు భారీ ఎత్తున ఇనుప కంచెను ఏర్పాటు చేయించుకున్నారు. వాస్తు ప్రకారం తూర్పు ఈశాన్య వైపు కంచె భాగాన్ని తొలగించినట్లు సమాచారం.
తాడేపల్లిలో ఆదివారం రాత్రి మహిళపై లైంగిక దాడికి తెగబడిన దుండగుడిని పోలీసులు 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. సీఐ కళ్యాణ రాజు మాట్లాడుతూ.. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు తెంపరల రామారావును సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మహిళ కుమారునితో ఉన్న స్నేహాన్ని అడ్డుపెట్టుకుని.. ఆమె ఇంటికి వచ్చి బలవంతం చేయగా ఆమె భయపడి పరుగులు తీశారు.
సుదూర ప్రాంతాల నుండి పిజిఆర్ఎస్ లో ప్రజలు అందించిన ఫిర్యాదులను పరిష్కరించకుంటే సంబంధిత జిల్లా అధికారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి 172 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు
రెంటచింతల పోలీస్ స్టేషన్ను గురజాల డీఎస్పీ జగదీష్ సోమవారం సందర్శించారు. సాధారణ తనిఖీలలో భాగంగా రెంటచింతల స్టేషన్లోని పెండింగ్ కేసుల వివరాలను, రికార్డు మెయిన్టెనెన్స్ తీరును ఆయన పరిశీలించారు. మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. డీఎస్పీ వెంట కారంపూడి సీఐ శ్రీనివాసరావు ఎస్సై నాగార్జున ఉన్నారు.
తాడేపల్లిలో ఓ మహిళపై ఆదివారం రాత్రి అత్యాచారయత్నం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. తన కుమారుడి స్నేహితుడు రామారావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో సదరు మహిళ భయంతో మాజీ CM జగన్ హెలీప్యాడ్ వైపు పరుగులు తీసింది. స్థానికుల సహాయంతో ఆ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసులు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆంజనేయస్వామి మాల వేసుకున్న వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా కారు చెట్టు ఢీకొని చనిపోయారు. కొండగట్టులో వాళ్లు తీసుకున్న చివరి ఫొటో ఇదే. ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు కన్నుమూయడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎన్జీఓ కాలనీలో ఆదివారం సాయంత్రం టీడీపీ వ్యవస్థాపకుడు NTR విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర సహాయమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గళ్ళా మాధవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విభాగానికి సంబంధించి ఈ నెల 9న సోమవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. వివరాలను యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ పి.బ్రహ్మజీరావు తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన వారు నేరుగా అడ్మిషన్ కార్యాలయానికి వచ్చి ప్రవేశాలు పొందవచ్చు అన్నారు. లా సెట్ రాయని వారికి కూడా ఈ ప్రవేశాల్లో అర్హులన్నారు.
Sorry, no posts matched your criteria.