India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాఠశాల విద్యలో మార్పులకు శ్రీకారం చుట్టిన AP ప్రభుత్వం పరీక్షలను పేపర్లపై కాకుండా పుస్తకాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టింది. ప్రతి సబ్జెక్టుపై ప్రత్యేకంగా రూపొందించిన ఎస్ఎస్మెంట్ పుస్తకాలను మండల విద్యావనరుల కేంద్రాలకు సరఫరా చేసింది. వీటిని పాఠశాలలకు పంపి అన్ని పరీక్షలను పుస్తకాల్లోనే రాయాలని ఆదేశాలిచ్చింది. 11 నుంచి నిర్వహించనున్న ఫార్మేటివ్-1 పరీక్షలు వీటిలోనే నిర్వహించనున్నారు.
బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో ఆధునిక సదుపాయాలతో కొత్త ‘సంజీవని’ 104 వాహనాలు సిద్ధమవుతున్నాయి. పాత నీలం రంగును తొలగించి, తెలుపు, ఎరుపు, పసుపు రంగులతో కొత్త రూపునిచ్చారు. ఈ వాహనాలపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రాలను ముద్రించారు. త్వరలో ఇవి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 13లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. JNV అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మచిలీపట్నం పోలీసు కార్యాలయంలో సోమవారం “మీకోసం” కార్యక్రమం జరిగింది. ఎస్పీ ఆర్. గంగాధరరావు, స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 30 మంది ఫిర్యాది దారులు తమ సమస్యలను ఎస్పీకి తెలిపినట్లు పేర్కొన్నారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, వేధింపులు తదితర సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేశారు. ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీసు అధికారలను పరిష్కారానికి ఆదేశించారు.
జిల్లాలో సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ‘మీ కోసం’ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సీఎస్ఆర్ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు త్వరితంగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మచిలీపట్నం: జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పోలీసు కవాతు మైదానంలో అన్ని అవసరమైన సౌకర్యాలను కల్పించాలన్నారు. శాఖలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 6వ తేదీన జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ కోరారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న విద్యార్థులు పాల్గొనవచ్చునని తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళా జరుగుతుందన్నారు.
ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ MLAలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తిరిగి రాజకీయంగా చురుగ్గా మారేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో YCP ఓటమి, వంశీ అరెస్ట్, నాని ఆరోగ్య సమస్యలు వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరూ ప్రజల కంటపడకుండా ఉన్నారు. నాని కొన్ని సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చినప్పటికీ, వంశీ పూర్తిగా మౌనంగా ఉన్నారు. గుడివాడలో జరగనున్న YCP సమావేశంతో వీరు రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారు.
అన్నదాతా సుఖీభవ-PM కిసాన్ పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. రైతులు తమ ఆధార్ నంబర్ను మన మిత్ర వాట్సాప్ 9552300009కు పంపి అర్హతను తెలుసుకోవచ్చు. పేరు లేకుంటే గ్రామ రైతు సేవా కేంద్రంలో అర్జీ, పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. పోర్టల్ గ్రీవెన్స్ మాడ్యూల్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈనెల 13వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. జిల్లాలో 3,44,029 రైతులు ఉండగా 1,35,881 అర్హత పొందారు.
☞ విజయవాడ అమ్మాయికి కాంస్య పతకం
☞కృష్ణా జిల్లా వ్యాప్తంగా పీటీఎం
☞ పామర్రు – భీమవరం హైవే( వీడియో)
☞ గన్నవరం: కుమారులని రక్షించాలంటూ పవన్ కళ్యాణ్కు వినతి
☞ గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్గా భారత్: గవర్నర్
☞ మచిలీపట్నంలో 11న జర్నలిస్టులకు వర్క్ షాప్
☞ పెనమలూరు: భార్య పుట్టింటికి వెళ్లిందని.. ఆత్మహత్య
☞కృష్ణా: డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల
☞ విజయవాడ: నేటితో ముగిసిన శాకంబరి ఉత్సవాలు
Sorry, no posts matched your criteria.