Krishna

News April 11, 2025

మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగింపు

image

మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ రాజబాబును వెంటనే తొలగించాలని ఆదేశించారు. గడిచిన 10 నెలల కాలంలో గనుల శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబుకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయగా రాజబాబుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను విధుల నుంచి తప్పించారు.

News April 11, 2025

తిరుపతి-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైలు సేవలు.!

image

తిరుపతి-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి మచిలీపట్నం, మే 14 నుంచి 26 వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం నుంచి తిరుపతికి స్పెషల్ రైలు నడవనుంది. ఈ రైలులో 2AC, 3AC, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సూచించింది.

News April 11, 2025

MTM: పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు 

image

మచిలీపట్నంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మార్చి నెల జరిగిన క్రైమ్ డిటెక్షన్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ గంగాధరరావు రివార్డులు అందజేశారు. కంకిపాడు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్, హెడ్ కానిస్టేబుల్ చంద్ర, కానిస్టేబుల్స్ బాజీ, మూర్తిలను ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందించారు. 

News April 11, 2025

సమస్యలు తలెత్తకుండా రీ సర్వే: కలెక్టర్ బాలాజీ

image

ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రీసర్వే ప్రక్రియను సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పెదపారుపూడి మండలం పాములపాడులోని గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయం భవనంలో రి సర్వేకు సంబంధించిన రికార్డులను ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. గ్రామ పరిధిలో ఇప్పటివరకు పూర్తి చేసిన రిసర్వే ప్రక్రియ తలెత్తిన సమస్యలపై కలెక్టర్ బాలాజీ ఆరాతీశారు.

News April 10, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా జిల్లాలో నియోజకవర్గానికి ఒక MSME పార్క్ ఏర్పాటు: కలెక్టర్
☞ కేసరపల్లి: చెరువులో పడి మహిళ మృతి
☞12 నుంచి తేలప్రోలు రంగమ్మ పేరంటాలమ్మ తిరునాళ్లు
☞గుడివాడలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
☞ఇంతేరు సర్పంచి వైఖరిపై గ్రామస్థులు ఆగ్రహం
☞ పెనమలూరులో ముస్లింల నిరసన ర్యాలీ
☞ నాగాయలంకలో ఫుడ్ సేఫ్టీ అధికారి పేరుతో బెదిరింపులు.

News April 10, 2025

కేసరపల్లి: చెరువులో పడి మహిళ మృతి  

image

గన్నవరం మండలం కేసరపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వడ్డెర కుటుంబానికి చెందిన లక్ష్మి(45) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం కేసరపల్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.   

News April 10, 2025

కృష్ణా: నియోజకవర్గానికి ఒక MSME పార్క్ ఏర్పాటు- కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో నియోజకవర్గానికి ఒక MSME పార్క్ నెలకొల్పుటకు అనువైన స్థలాలను గుర్తించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రెవెన్యూ డివిజనల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ MSME పార్కుల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.

News April 10, 2025

కృష్ణా : ముగిసిన ‘పది’ మూల్యాంకణం

image

మచిలీపట్నం లేడియాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకణ బుధవారంతో ముగిసింది. ఈ నెల 1వ తేదీన మూల్యాంకణ ప్రారంభమవ్వగా మొత్తం 1,89,852 సమాధాన పత్రాలను మూల్యాంకణ చేశారు. సుమారు 1000 మంది ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు మూల్యాంకణ విధుల్లో పాల్గొన్నారు.

News April 9, 2025

కృష్ణా: రెవెన్యూ సర్వీసుల దరఖాస్తు ఫీజుల వివరాలు

image

కృష్ణాజిల్లాలో రెవెన్యూ సర్వీసులకు సంబంధించి దరఖాస్తు ఫీజుల వివరాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ప్రకటించారు.
* పట్టాదార్ పాస్ బుక్, అడంగల్ సవరణకు రూ.150
* భూ సర్వే, ఆన్ పట్టా సబ్ డివిజన్ కోసం రూ.550
* అడంగల్ సవరణ, కుల, ఆదాయ ధృవీకరణ, నివేశన స్థల ధృవీకరణ పత్రానికి రూ.50ను అధికారులు దరఖాస్తు రుసుంగా వసూలు చేస్తారన్నారు.

News April 9, 2025

కృష్ణా జిల్లా టుడే టాప్ న్యూస్

image

☞కృష్ణా: మండలానికి 3 నుంచి 4 ఆదర్శ పాఠశాలలు
☞అమరావతి: వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ప్రణాళిక
☞విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు
☞కృష్ణా: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
☞ మొవ్వ: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కలెక్టర్
☞కృష్ణా: ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు
☞ గుడ్లవల్లేరు: రైలు పట్టాలు దాటుతూ.. వ్యక్తి మృతి
☞ కృష్ణా: జోగి రమేష్‌కు నోటీసులు