Krishna

News April 9, 2025

కృష్ణా: జోగి రమేశ్‌కు నోటీసులు

image

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసు విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11వ తేదీన తాడిగడప సీఐడీ కార్యాలయానికి ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు సంబంధించి అవసరమైన ఆధారాలను కూడా తీసుకురావాలని ఆదేశించింది.

News April 9, 2025

కృష్ణా: మండలానికి 3 లేదా 4 ఆదర్శ పాఠశాలలు- కలెక్టర్

image

విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి అంగీకారంతో ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, ఆర్డీఓతో సంయుక్త సమావేశం నిర్వహించారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణపై ఆయన సమీక్షించారు. మండలానికి కనీసం 3 లేదా 4 ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.

News April 9, 2025

కృష్ణా: ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు  

image

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ICDS)లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 16 పోస్టుల భర్తీకి ఇటీవల అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ 16 పోస్టులకు 122 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

News April 9, 2025

రూ.కోటి పనులకు భూమి పూజ చేసిన కలెక్టర్ 

image

కృష్ణాజిల్లా మొవ్వలో కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్, డ్రైనేజీ నిర్మాణ పనులకు కలెక్టర్ బాలాజీ గురువారం ఉదయం భూమి పూజచేశారు. వేద పండితులు వేదమంత్రోచ్ఛారణ పూజా కార్యక్రమాలు నిర్వహించగా కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

News April 9, 2025

కృష్ణా: డిగ్రీ పరీక్షల రివైజ్డ్ టైమ్ టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో UG కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ (రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షల రివైజ్డ్ టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 21 నుంచి మే 2 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్ సైట్ చూడాలని కోరారు.

News April 9, 2025

గుడ్లవల్లేరు: రైలు పట్టాలు దాటుతూ.. వ్యక్తి మృతి 

image

గుడ్లవల్లేరు రైల్వే స్టేషన్ వద్ద పుల్లేరు వంతెనపై గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటే క్రమంలో మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే లోకో పైలట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు చామన చాయ రంగు, మెరిసిన జుట్టు, కుంకుమ రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, బ్లూ నలుపు డిజైన్ లుంగీ ధరించినట్లు తెలిపారు. 

News April 9, 2025

కృష్ణా: భవన నిర్మాణాలకు నిధులు ఇవ్వండి- కలెక్టర్

image

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతను అందించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశమైన కలెక్టర్ CSR నిధుల వినియోగంపై సమీక్షించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు నిధుల కొరత వలన సగంలో ఆగిపోయాయన్నారు.

News April 8, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా : యూజీ పరీక్షల షెడ్యూల్ విడుదల 
☞ కృష్ణా : 37 మందికి గ్రేడ్ -3 కార్యదర్శులగా పదోన్నతి 
☞ గన్నవరం : వంశీ కి 22 వరకు రిమాండ్ పొడిగింపు
☞ గుడివాడ: మందుబాబులపై లోకేశ్ సెటైరికల్ పోస్ట్
☞ కృష్ణా: అధికారులు పని తీరుపై కలెక్టర్ సీరియస్
☞ గన్నవరం: చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్ట్
☞ కృష్ణా జిల్లాప్రధాన న్యాయమూర్తి బదిలీ

News April 8, 2025

కృష్ణా జిల్లాలో 37 మందికి గ్రేడ్-3 కార్యదర్శులుగా పదోన్నతి

image

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 37 గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్న 19 మంది, జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న 18 మంది జూ.అసిస్టెంట్లను గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సంబంధిత పదోన్నతులు పొందిన కార్యదర్శులకు కలెక్టర్ అందజేశారు.

News April 8, 2025

గుడివాడ: మందుబాబులపై లోకేశ్ సెటైరికల్ పోస్ట్

image

గుడివాడలో ఇంజినీరింగ్ కాలేజీ వెనుక బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ కెమెరాలతో పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. `పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది. సారీ గాయ్స్‌.. నేను మీకు ఎలాంటి హెల్ప్‌ చేయలేకపోతున్నా.. ఎందుకంటే ఏపీ పోలీసులు వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు’ అని X లో పోస్ట్ చేశారు.