India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం, సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులకు ఉదయం 10.30 నుంచి అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు.
పోరంకి శ్రీలక్ష్మీ నరసింహ గార్డెన్స్లో అడుసుమిల్లి వారి నూతన వస్త్రబహుకరణ వేడుక ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై చిన్నారులకు ఆశీర్వాదాలు అందించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎస్పీ ఆర్. గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. కష్టాల్లో తోడుగా నిలుస్తానంటూ సోదరుడు చెప్పే మాట సోదరికి కొండంత బలాన్నిస్తుంది. చిన్ననాటి నుంచి ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు, అల్లరి చేష్టలు, కోపతాపాలు ఎన్నున్నా.. ఎవరికి ఇబ్బంది కలిగినా మరొకరు తల్లిడిల్లిపోతారు. ప్రేమాఆప్యాయతల కలబోత వీరి బంధం. ఆ బ్లడ్లో ఉండే మ్యాజిక్కే వేరు. మరి మీకు రాఖీ కట్టే సోదరికి కామెంట్ ద్వారా విషెస్ చెప్పండి.
ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే లైసెన్స్ లేని నాటు తుపాకులు కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఆర్. గంగాధరరావు హెచ్చరించారు. నాటు తుపాకులు ఉంచడం నేరమని, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారని చెప్పారు. ఈ విషయంలో ఎవరికైనా సమాచారం ఉంటే ఎస్పీ నంబర్ 9440796400కు తెలియజేయవచ్చని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు.
తేలప్రోలులోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్లో గురువారం పట్టభద్రుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ‘యువత ఆత్మనిర్భర్ భారత్కు రాయబారులుగా, అమృత కాలంలో దేశాభివృద్ధికి శక్తులుగా నిలవాలి’ అన్నారు. AI, రోబోటిక్స్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో యువత ఆవిష్కరణలు చేసి భారతాన్ని ప్రపంచ నాయకత్వానికి తీసుకెళ్లాలన్నారు.
☞ కృష్ణా: పిల్లలు లేరని వేధింపులు.. మహిళ ఆత్మహత్య
☞ యువతే దేశ భవిష్యత్తుకు మార్గదర్శులు: వెంకయ్యనాయుడు
☞ గుడివాడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
☞ కృష్ణా: పదవుల కోసం తెలుగు తమ్ముళ్ల ఎదురుచూపు
☞ విజయవాడ: హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్
☞ విజయవాడ: 8 నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు
☞ కృష్ణా: పరీక్షల టైం టేబుల్ విడుదల
కృత్తివెన్ను మండలం మాట్లం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాల మేరకు.. స్థానికంగా నివసిస్తున్న స్వాతి (23)కి, పల్లెపాలెంకు చెందిన కుమారస్వామితో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి సంతానం లేకపోవడంతో భార్యాభర్త మధ్య తరచూ గొడవలు, అత్తింటివారి వేధింపులతో బాధపడేది. ఈ క్రమంలో ఆమె మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కృత్తివెన్ను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుడివాడ ఆర్టీసీలో డిపోలో కాంట్రాక్టు ప్రాతిపదికన డ్రైవర్లుగా పని చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ మంగళవారం తెలిపారు. డ్రైవర్లుగా పనిచేయాలనుకునేవారికి తప్పనిసరిగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 12లోపు గుడివాడ డిపో మేనేజర్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి రోజువారీ జీతం చెల్లిస్తామన్నారు.
బాపులపాడు మండలంలోని పెరికిడు, కానుమోలు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, హైస్కూల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం సరిగా పెడుతున్నారా.? లేదా.? తెలుసుకున్నారు. ఆయన వెంట డీఈఓ రామారావు ఉన్నారు.
బందరు పార్లమెంట్ పరిధిలో TDP పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గ్రామ పార్టీ అధ్యక్ష పదవులు పలుచోట్ల పూర్తికాగా కొన్నిచోట్ల ఎదురుచూస్తున్నారు. మండల అధ్యక్షుడి పదవితో పాటు, పార్టీ విభాగాలకు సంబంధించిన పదవుల కోసం కూడా పలువురు పోటీ పడుతున్నారు. మహానాడు అయ్యాక పదవులు కేటాయిస్తారని ఎదురు చూసిన వారికి నిరాశ ఎదురైంది. ఇప్పటికీ పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తూనే ఉన్నారు.
Sorry, no posts matched your criteria.