Krishna

News April 14, 2025

మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ వద్ద హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. కొక్కిలిగడ్డకు చెందిన రాయన కృష్ణ తేజస్ (18), నాగ జశ్వంత్ బైకుపై మోపిదేవి వెళ్లేందుకు హైవే పైకి రాగానే వెనకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ తేజస్ మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. నాగ జస్వంత్(11) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

News April 14, 2025

కృష్ణా: ర్యాలీల నిర్వహణకు అనుమతి లేదు- డీఎస్పీ

image

అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లాలో బైక్ ర్యాలీలు, డీజే సౌండ్ బాక్స్‌లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మచిలీపట్నం డీఎస్పీ రాజా పేర్కొన్నారు. ఆదివారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలోని ప్రతి అంశాన్ని డ్రోన్ కెమెరాలతో నిశితంగా పర్యవేక్షిస్థామన్నారు. జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

News April 14, 2025

కృష్ణా: రేపు స్పందన కార్యక్రమం రద్దు- కలెక్టర్

image

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని ఈ సోమవారం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. అర్జీలు ఇచ్చేందుకు వచ్చే వారు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.

News April 13, 2025

కృష్ణా: రేపు కలెక్టరేట్‌లో ‘మీకోసం’ రద్దు- కలెక్టర్

image

సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

News April 13, 2025

గుడివాడలో వ్యభిచారం.. నలుగురి అరెస్ట్ 

image

గుడివాడ తాలూకా పోలీస్‌ స్టేషన్ పరిధిలో అసభ్య కార్యకలాపాలపై సమాచారం మేరకు ఎస్‌ఐ చంటిబాబు దాడులు నిర్వహించారు. శనివారం మల్లాయపాలెంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచార కేంద్రంగా మార్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి 2 సెల్‌ఫోన్‌లు, బైక్‌, రూ.2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

News April 12, 2025

కృష్ణా: ఒకేషనల్ కోర్సులో జిల్లా టాపర్‌గా గాయత్రి

image

నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఒకేషనల్ కోర్సుకు సంబంధించి మచిలీపట్నం లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన గాయత్రి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గుడ్లవల్లేరుకు చెందిన గాయత్రి 1000కి 988 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని కాలేజీ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ సుందర లక్ష్మి అభినందించారు. 

News April 12, 2025

కృష్ణా జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన మొవ్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల 

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 87% ఉత్తీర్ణతతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. 83.5% ఉత్తీర్ణతతో అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండవ స్థానంలో, 79% ఉత్తీర్ణతతో మచిలీపట్నంలోని లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మూడో స్థానంలో నిలిచింది. ఉత్తమ ఫలితాలు సాధించిన ఆయా కళాశాలల యాజమాన్యాలను ఇంటర్ బోర్డు జిల్లా అధికారి సాల్మన్ రాజు అభినందించారు.

News April 12, 2025

ఇంటర్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ మన బందరు అమ్మాయికే 

image

నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మచిలీపట్నం లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన ఎ.బాల త్రిపుర సుందరి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. క్యాంబెల్ పేటకు చెందిన త్రిపుర సుందరి 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆ విద్యార్థినిని కాలేజీ ప్రిన్సిపల్ అభినందించారు.  

News April 12, 2025

కృష్ణా: ఎస్సీ కార్పొరేషన్ బ్యాంక్ లింక్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద ఎస్సీల స్వయం ఉపాధికై బ్యాంక్ లింకేజీ రుణాలకు సంబంధించి దరఖాస్తులను ఈనెల 14వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు మే 10వ తేదీలోపు https:///apobmms.apcfss.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

News April 12, 2025

కృష్ణా: కంప్యూటరీకరణ ద్వారా మూల్యాంకనం 

image

మార్చి నెలలో జరిగిన కృష్ణా యూనివర్శిటీ B.Ed 1వ సెమిస్టర్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను కంప్యూటరీకరణ ద్వారా నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రయోగాత్మకంగా కంప్యూటరైజ్డ్ మూల్యాంకనాన్ని శనివారం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ ప్రారంభించారు. ఈ పద్ధతి వల్ల ఎలాంటి పొరపాట్లకు తావు ఉండదని, ఫలితాలు త్వరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఉపకులపతి చెప్పారు.