India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అధికార పార్టీ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ శ్రేణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భరోసా ఇచ్చారు. బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్లలో సోమవారం నూతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ శ్రేణులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని కాటసాని హెచ్చరించారు.
కర్నూలు రేంజ్ పరిధిలో సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిరివెళ్ల సీఐ వంశీధర్ నంద్యాల వీఆర్కు, దస్తగిరి బాబు అన్నమయ్య డీటీసీ నుంచి సిరివెళ్ల, ప్రభాకర్ రెడ్డి అన్నమయ్య ఎస్సీ, ఎస్టీ సెల్ నుంచి నంద్యాల ఫ్యాక్షన్ జోన్, గౌతమి కర్నూల్ డీటీసీ నుంచి నంద్యాల ఉమెన్ పీఎస్, రమేశ్ కుమార్ నంద్యాల ఉమెన్ పీఎస్ నుంచి నంద్యాల వీఆర్, కృష్ణయ్య డీసీఆర్బీ నంద్యాలకు బదిలీ అయ్యారు.
➤మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్ ➤ వెల్దుర్తి: బొమ్మిరెడ్డిపల్లెలో టెన్షన్.. టెన్షన్..➤ కర్నూలును మెడికల్ హబ్గా మారుస్తాం: ఎంపీ➤ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది ఇక్కడే..!➤ పెద్దకడబూరు: ‘ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలి’➤ కౌతాళం: తుంగభద్ర కాలువలో పడి వ్యక్తి మృతి➤ ఇన్స్టాగ్రామ్లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి➤ కర్నూలు: ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ ఒత్తిళ్లను ఆపాలి
కర్నూలును మెడికల్ హబ్గా మారుస్తామని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రతి ఒకరూ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అనేక పథకాలను తీసుకొచ్చిందని, వాటిని అందరూ ఉపయోగించుకోవాలన్నారు.
వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి శ్రీరామనవమి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. తల్లిదండ్రులు, సోదరులతో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. చాలా రోజుల తర్వాత బైరెడ్డి ఫ్యామిలీతో కనిపించడంతో అభిమానులు సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ఇటీవల వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వహక అధ్యక్షుడిగా సిద్ధార్థ్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే.
ఆదోని మండల పరిధిలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన యువతికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి శ్రీరామనవమి రోజున ఒక్కటయ్యారు. నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కుటుంబ సభ్యులు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
కర్నూలు జిల్లాలో నేటి నుంచి క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 41-43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా నిన్న జిల్లాలోని కామవరంలో అత్యధికంగా 40.8°C ఉష్ణోగ్రత నమోదైంది.
➤జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు➤ నంచర్ల-గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన్➤ ఎమ్మిగనూరు: ప్రమాదంలో ఒకరు మృతి➤శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో హై కోర్టు జడ్జ్ ➤రామ నామాలతో శ్రీరాముడి చిత్రం➤ పారతో చెత్త తొలగించిన ఆదోని ఎమ్మెల్యే➤ శ్రీ మఠంలో మూల బృందావనానికి పూజలు➤ కోడుమూరు: యువకుడిపై పోక్సో కేసు➤ పెద్దకడబూరు: ఎల్ఎల్సీ కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహం
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన బాలికను నమ్మించి, మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన రామాంజనేయులు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన బాలికకు ఇన్స్టాలో పరిచయమయ్యాడు. ఆమెను మాయమాటలతో నమ్మించి, మోసం చేశాడు. తీరా ముఖం చాటేయడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి టౌన్ సీఐ సాయి ప్రసాద్ పేర్కొన్నారు.
➤కోసిగి: పేకాటరాయుళ్ల అరెస్ట్.. రూ.24,550లు స్వాధీనం➤ ఆదోని మార్కెట్లో పెరిగిన పత్తి ధర.!➤ జగ్జీవన్ రామ్ జీవితం అనుసరణీయం: జేసీ➤ విలువలతో కూడిన విద్యను అందించాలి: టీజీ వెంకటేశ్➤ సీఎం చంద్రబాబు నమ్మకద్రోహం చేశారు: హఫీజ్ ఖాన్➤ వర్ఫ్ బోర్డ్ బిల్లుకు రద్దు చేయాలని జిల్లా వ్యాప్తంగా నిరసనలు➤ కర్నూలు: 10th విద్యార్థులకు ఉచిత కోచింగ్➤ ఎమ్మిగనూరు: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
Sorry, no posts matched your criteria.