Kurnool

News September 19, 2024

కర్నూలు: నేటి నుంచే ఇసుక అమ్మకాలు ప్రారంభం

image

కర్నూలు జిల్లాలో ఇసుక ఆన్లైన్ అమ్మకాలు ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి ప్రారంభమవుతాయని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ డీడీ రాజశేఖర్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక బుకింగ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇసుక కొనుగోలుదారులు తహశీల్దారు కార్యాలయాలు, సచివాలయాల్లో బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపారు.

News September 19, 2024

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా జయలక్ష్మి

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా ఆర్.జయలక్ష్మిని నియమిస్తూ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జయలక్ష్మి అనంతపురం మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత కార్యదర్శి గోవిందును అనంతపురం బదిలీ చేశారు.

News September 18, 2024

ట్రైనీ ఐపీఎస్‌గా నంద్యాల జిల్లా యువ ఐపీఎస్ మనీషా రెడ్డి

image

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఏపీకి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది. నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లెకు చెందిన వంగల మనీషా రెడ్డి ఆ జాబితాలో ఉన్నారు. సొంత రాష్ట్రానికి ట్రైనీ ఐపీఎస్‌గా కేటాయించడంతో నందిపల్లి గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

News September 18, 2024

నంద్యాల: కాలువలో పడి బాలుడి మృతి

image

శిరివెళ్లలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కాశిరెడ్డి నాయన దేవాలయం సమీపంలోని కాలువలో పడి శంకరయ్య(13) అనే బాలుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన గురుమూర్తి, సుంకమ్మ కుమారుడు శంకరయ్య నిన్నటి నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలిస్తుండగా ఆలయం పక్కన ఉన్న కాలువలో మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

News September 18, 2024

కర్నూలు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛత హి సేవ

image

కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు జిల్లా వ్యాప్తంగా ఊరూరా స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పీ.రంజిత్ బాషా బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

News September 18, 2024

చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

చిన్నారుల ఆరోగ్యం పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం నంద్యాలలోని పొన్నాపురం కాలనీలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారి ప్రత్యేక దత్తత కేంద్రం (జిల్లా బాలల సంరక్షణ విభాగం)ను తనిఖీ చేశారు. దత్తత కేంద్రంలోని వసతులు, చిన్నారుల ఆరోగ్యం కోసం తీసుకుంటున్న చర్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News September 18, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొత్త అన్న క్యాంటీన్లు!

image

ఉ.కర్నూలు జిల్లాలో కొత్తగా మరిన్ని <<14130693>>అన్న<<>> క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాటి అడ్రస్‌లు ఇవే..
➤ ఆళ్లగడ్డ: టీబీ రోడ్డు పాతూర్ వీధి
➤ డోన్: LIC కార్యాలయం కింద
➤ ఎమ్మిగనూరులో(రెండు చోట్ల): శ్రీనివాస థియేటర్ ఎదురుగా, తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో
➤ గూడూరు: కూరగాయల మార్కెట్ వద్ద
➤ ఆదోనిలో(మూడు చోట్ల): పాత లైబ్రరీ పోస్ట్ ఆఫీస్, యాక్సిస్ బ్యాంక్ ఎదురుగా, శ్రీనివాస భవన్
SHARE IT

News September 18, 2024

నేడు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం

image

అమరావతిలో ఇవాళ మధ్యాహ్నం ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూక్, టీజీ భరత్, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. 100 రోజుల పాలన, MLAల పనితీరుపై సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

News September 18, 2024

ధర్మవరం సుబ్బారెడ్డికి కీలక పదవి దక్కనుందా?

image

నామినేటెడ్ పదవుల కోసం జిల్లా TDP నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండగా ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలు ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో డోన్ TDP ఇన్‌ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డికి కీలక పోస్ట్ వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూల్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆయనను నియమించనున్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

News September 18, 2024

వంద రోజుల ప్రణాళిక లక్ష్యాలను చేరుకోండి: కలెక్టర్

image

వంద రోజుల ప్రణాళికలో భాగంగా శాఖల వారిగా నిర్దేశించిన లక్ష్యాలను అక్టోబర్ రెండో తేదీ లోపు పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో 100 రోజుల ప్రణాళికల లక్ష్యాల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ ప్రాంతంలో వందరోజుల ప్రణాళికలో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్ లో 1,83,600 మొక్కలను నాటామన్నారు.