India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో దేవనకొండ మండలం కొత్తపేటకి చెందిన పీరా సాహెబ్, షాజిదాబీ దంపతుల కూతురు మస్తాన్ బి సత్తా చాటారు. తల్లిదండ్రులు పొలం పనులు చేస్తూ కూతురు ఉన్నత శిఖరాలను చూడాలని ఎన్నో కలలు కన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చదివించారు. మస్తాన్ బి డీఎస్సీ ఫలితాలలో 77.88 మార్కులు సాధించి ఎస్జిటి పోస్ట్కు ఎంపికైంది. తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలోని కృష్ణదొడ్డికి చెందిన గోపాల్, పుణ్యవతి దంపతుల కుమారుడు కోదండరాముడు గత 8ఏళ్లుగా ఆర్మీలో సైనికునిగా పనిచేశారు. 2018లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఏపీ మెగా DSCలో స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 86.07 మార్కులు సాధించారు. దీంతో జిల్లాలో 2వ ర్యాంక్, స్టేట్లో 13వ ర్యాంక్ రాగా SGTలో 87.77 మార్కులతో జిల్లా 94వ ర్యాంక్తో 2 ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలోని కృష్ణదొడ్డికి చెందిన గోపాల్, పుణ్యవతి దంపతుల కుమారుడు కోదండరాముడు గత 8ఏళ్లుగా ఆర్మీలో సైనికునిగా పనిచేశారు. 2018లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఏపీ మెగా DSCలో స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 86.07 మార్కులు సాధించారు. దీంతో జిల్లాలో 2వ ర్యాంక్, స్టేట్లో 13వ ర్యాంక్ రాగా SGTలో 87.77 మార్కులతో జిల్లా 94వ ర్యాంక్తో 2 ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
కర్నూలు జిల్లాలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 12(1)సీ కింద 1,082 మంది విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్ పాల్ తెలిపారు. ఎంపికైన వారు నేటి నుంచి 31వ తేదీ వరకు కేటాయించిన పాఠశాలల్లో అడ్మిషన్ పొందాలన్నారు. సంబంధిత అధికారులు మండలాల వారీగా వివరాలను సేకరించి, నివేదికను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.
ఈనెల 23 నుంచి 27 వరకు ఇండోనేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ వాలీబాల్ లెవెల్ వన్ కోర్సుకు కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో వాలీబాల్ శిక్షకుడిగా ఉన్న రాజేశ్ అర్హత సాధించి శిక్షణ పూర్తి చేశారు. దేశం నుంచి ఎంపికైన నలుగురు శిక్షకుల్లో కర్నూలుకు చెందిన రాజేశ్ ఉండటడం విశేషం. రాజేశ్ ఎంపిక పట్ల డీఎస్డీవో భూపతి రావు, సీనియర్ క్రీడాకారులు, జిల్లా వాలీబాల్ సంఘం, జిల్లా ఒలింపిక్ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రూ.6.74 కోట్ల విలువైన సిటీ స్కాన్ సౌకర్యాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో పాటు సంబంధిత అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో సిటీ స్కాన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు.
ఒంగోలులో జరిగిన సీపీఐ రాష్ట్ర 28వ మహాసభలలో ఆ పార్టీ ఎమ్మిగనూరు పట్టణ కార్యదర్శి రంగన్నను రాష్ట్ర సమితి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం సీపీఐ, ప్రజా సంఘాల ప్రతినిధులు సమివుల్లా, విజయేంద్ర, తిమ్మగురుడు, వీరేశ్ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర సమితి సభ్యుడిగా రంగన్నను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకుందామని, రాత్రి 10 గంటల తర్వాత వినాయక మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు ఆపివేయాలని విగ్రహ ఉత్సవ కమిటీలకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజలందరి జీవితాల్లో శాంతి, ఐశ్వర్యం, ఆనందం నిండాలని భగవంతుని కోరుకుంటున్నట్లు మంత్రి టీజీ భరత్ అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పర్యావరణహిత గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించి, పండుగను సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని మంత్రి ఆకాక్షించారు. ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రతీ ఒక్కరం వినాయక చవితి పండుగను జరుపుకుందామని కలెక్టర్ పి.రంజిత్ బాషా మంగళవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. గణనాథుని కృపతో జిల్లా అభివృద్ధితో పాటు ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలకు మంచి జరగాలని, చేపట్టే ప్రతీ పనిలో విజయం చేకూరాలని ఆకాంక్షించారు.
Sorry, no posts matched your criteria.