Kurnool

News April 4, 2026

డెంగ్యూ లక్షణాలపై తప్పనిసరి పరీక్షలు

image

డెంగ్యూ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డా. కామేశ్వర ప్రసాద్ సూచించారు. ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీలో జరిగిన మలేరియా ల్యాబ్ టెక్నీషియన్స్ సమావేశంలో మాట్లాడారు. రోజుకు 65 పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ టైమ్ ప్రకారం విధులు నిర్వహించాలని తెలిపారు. హెచ్ఐవి, టీబీ కేసుల రికార్డులను సక్రమంగా నిర్వహించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

News April 4, 2026

సూర్యఘర్ ఉత్సవ్‌కు శ్రీకారం: సీఎండీ

image

ఈ నెల 5 నుంచి 14 వరకు ‘సూర్యఘర్ ఉత్సవ్’ నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. 9 జిల్లాల్లో 25 వేల ఎస్సీ, ఎస్టీ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. 25 వేల ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

News April 4, 2026

కర్నూలులో ఈనెల 7న ఉద్యోగ మేళా

image

కర్నూలు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి వి.దీప్తి తెలిపారు. ఈ మేళాలో Enovizon, GPS Renewable Energy, Blue Star, Amber వంటి సంస్థలు పాల్గొని ప్రొడక్షన్ ఆపరేటర్, మెషీన్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్, టెలీకాలర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు విద్యార్హత కలిగిన 19-30 ఏళ్ల వయసున్న వారు అర్హులన్నారు.

News April 4, 2026

కర్నూలులో ఈనెల 7న ఉద్యోగ మేళా

image

కర్నూలు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి వి.దీప్తి తెలిపారు. ఈ మేళాలో Enovizon, GPS Renewable Energy, Blue Star, Amber వంటి సంస్థలు పాల్గొని ప్రొడక్షన్ ఆపరేటర్, మెషీన్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్, టెలీకాలర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు విద్యార్హత కలిగిన 19-30 ఏళ్ల వయసున్న వారు అర్హులన్నారు.

News April 4, 2026

కర్నూలులో ఈనెల 7న ఉద్యోగ మేళా

image

కర్నూలు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి వి.దీప్తి తెలిపారు. ఈ మేళాలో Enovizon, GPS Renewable Energy, Blue Star, Amber వంటి సంస్థలు పాల్గొని ప్రొడక్షన్ ఆపరేటర్, మెషీన్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్, టెలీకాలర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు విద్యార్హత కలిగిన 19-30 ఏళ్ల వయసున్న వారు అర్హులన్నారు.

News April 4, 2026

కర్నూలులో ఈనెల 7న ఉద్యోగ మేళా

image

కర్నూలు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి వి.దీప్తి తెలిపారు. ఈ మేళాలో Enovizon, GPS Renewable Energy, Blue Star, Amber వంటి సంస్థలు పాల్గొని ప్రొడక్షన్ ఆపరేటర్, మెషీన్ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్, టెలీకాలర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు విద్యార్హత కలిగిన 19-30 ఏళ్ల వయసున్న వారు అర్హులన్నారు.

News April 4, 2026

కర్నూలు జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

కర్నూలు జిల్లా ప్రజలు ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఇటీవల అత్యవసరం ఉందని చెప్పి డబ్బులు తీసుకొని PhonePe/Google Pay చేశామని చూపించి మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి మోసాల్లో డబ్బులు ఖాతాలో జమ కాకపోవడం లేదా హోల్డ్‌లో పడిపోవడం వల్ల బాధితులు నష్టపోతారని చెప్పారు. అపరిచితులతో డిజిటల్ లావాదేవీలు చేయవద్దన్నారు.

News April 3, 2026

చేనేతకు ఉచిత విద్యుత్.. 41 వేల మందికి లబ్ధి

image

ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసిందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా హ్యాండ్‌లూమ్ నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 41,046 మంది లబ్ధిదారులకు సంవత్సరానికి రూ.25.56 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం భరిస్తోందన్నారు.

News April 3, 2026

విషాదం.. లారీ బోల్తా పడి రైతు మృతి

image

మంత్రాలయం మండలం రచ్చమర్రిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యాకోబు గుంటూరులో మిరపకాయలు అమ్ముకుని తిరుగు ప్రయాణంలో ఆత్మకూరు ఘాట్ వద్ద లారీ బోల్తా పడటంతో బియ్యం సంచులు మీద పడి మృతి చెందాడు. కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని పలువురు ప్రజా సంఘాలు నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

News April 3, 2026

ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం: కలెక్టర్

image

భూసారాన్ని పెంచడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి శిక్షణలో రైతులకు PMDS, గ్రీన్ మేన్యూర్ పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. పంటల వైవిధ్యం, ఉద్యాన పంటల సాగు, మల్లె సాగు విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలన్నారు.