Kurnool

News September 17, 2024

కర్నూలు: రూ.2 లక్షలు పలికిన మహాగణపతి లడ్డూ

image

కర్నూలు పాత నగరంలోని తుంగభద్ర నదీ తీరాన కొలువుదీరిన 63 అడుగుల మహాగణపతి విగ్రహం వద్ద జరిగిన లడ్డూ వేలం పాటలో కాంచనం సురేశ్ బాబు (స్వస్తిక్ డెవలపర్స్) రూ.2 లక్షలకు దక్కించుకున్నారు. నగరానికి చెందిన చింటూ, భరత్, వికాస్ స్వామివారి హుండీని రూ.1,45,000కు పాట పాడి దక్కించుకున్నారు.

News September 17, 2024

గుంటూరు ప్యాసింజర్ ట్రైన్‌లో మృతదేహం

image

డోన్ పట్టణం రైల్వేస్టేషన్‌లో గుంటూరు ప్యాసింజర్ ట్రైన్‌లోని టాయిలెట్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం రైల్వే అధికారులు గుర్తించారు. మృతుడికి సుమారు 55 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 17, 2024

17,523 ఎకరాల్లో పంట నష్టం: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న 17,523 ఎకరాల పంటలకు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. 400 ఎకరాలలో గుర్తించిన పండ్లతోటల పెంపకానికి చర్యలు తీసుకుంటామన్నారు. 57 ఆయిల్ ఫామ్ ప్లాంట్లను ప్రోత్సహించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పశుసంపదకు డీ వార్మింగ్, వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు.

News September 17, 2024

ప్రతి విద్యార్థి చేత ఆల్బెండజోల్ మాత్రలు మింగించండి: కలెక్టర్

image

జాతీయ నులిపురుగుల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి విద్యార్థి చేత ఆల్బెండజోల్ మాత్రలను మింగించాలని కలెక్టర్ రాజకుమారి ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే నులిపురుగుల నివారణ మాత్రలు మింగించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి గురువారం పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే ఐరన్ పోలీక్ ఆసిడ్ మాత్రలను తప్పనిసరిగా మింగాలని ఆమె తెలిపారు.

News September 17, 2024

మొక్క నాటిన డ్వామా పీడీ

image

‘ఏక్ పేడ్ మాకే నామ్’లో భాగంగా జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ రామచంద్రా రెడ్డి చాగలమర్రిలోని మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణంలో మొక్క నాటారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మ పేరుతో మొక్క నాటాలని, చెట్లు పెంచాలన్న ప్రధాని పిలుపు మేరకు మొక్కలు నాటుతున్నామన్నారు. నవమాసాలు మోసి పెంచిన అమ్మకు గుర్తుగా చెట్టు నాటాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ నిర్మల, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

News September 17, 2024

పేదింటి రైతు బిడ్డకు ఎంబీబీఎస్ సీటు

image

క్రిష్ణగిరి మండలం కంబాలపాడుకు చెందిన దూదేకుల రంజిత్ కర్నూలు మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు. తల్లిదండ్రులు రెహమాన్, మహబూబ్ బీ వ్యవసాయం చేసుకుంటూ జీవినం సాగిస్తున్నారు. తన కుమారుడు రంజిత్ నీట్‌లో 582/720 మార్కులు సాధించి మొదట విడత కౌన్సెలింగ్‌లోనే సీటు సాధించాడని ఆనందం వ్యక్తం చేశారు. రంజిత్‌ను పలువురు అభినందించారు.

News September 17, 2024

ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల జననం

image

ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. పట్టణానికి చెందిన ఆవుల స్వప్న అనే గర్భిణి పురిటి నొప్పులతో ఇవాళ ఉదయం డా.వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రిలో (శివమ్మ ఆసుపత్రి)లో చేరారు. డా.హనీషా, డా.యశ్వంత్ రెడ్డితో కూడిన వైద్యుల బృందం ఆమెకు నార్మల్ డెలివరీ ద్వారా కాన్పు చేయగా ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

News September 17, 2024

గోనెగండ్ల వద్ద విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కర్నూలు జల్లా గోనెగండ్ల మండలంలోని బైలుప్పల గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చాకలి తిక్కన్న (35) అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జరిగింది. తిక్కన్న ఇంటి సమీపంలోని మేకల షెడ్డులో విద్యుత్ వైర్లను సరి చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు తిక్కన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 17, 2024

రాష్ట్రస్థాయి యోగా పోటీలలో కర్నూలు జిల్లా జట్టుకు మూడో స్థానం

image

ఈనెల 14-15వ తేదీ వరకు భీమిలిలో జరిగిన 49వ రాష్ట్రస్థాయి యోగా పోటీలలో 149 పాయింట్లతో కర్నూలు జిల్లా జట్టు మూడో స్థానం సాధించినట్లు రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్ శెట్టి తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులు అక్టోబర్ 24-27వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే 49వ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు.

News September 16, 2024

కర్నూలు: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య UPDATE

image

కోసిగి గ్రామానికి చెందిన బలకుందు కోసిగయ్య(52) సోమవారం మధ్యాహ్నం కోసిగి నుంచి ఐరనగల్ 523/40-42 కిలోమీటర్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కోసిగయ్య తాగుడుకు బానిసై, కుటుంబ కలహాలతో గూడ్స్ రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మొండెం నుంచి తల తెగిపడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదోని రైల్వే పోలీసులు తెలిపారు.