Kurnool

News September 16, 2024

నంద్యాల ప్రజలు, దాడులు ఫ్యాక్షనిజాన్ని సహించరు: ఫిరోజ్

image

నంద్యాలలో తనపై జరిగిన దాడి దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలను తమ కుటుంబం కానీ నంద్యాల పట్టణ ప్రజలు కానీ సహించబోరని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సోమవారం తెలిపారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో టీడీపీలోని మరో వర్గానికి చెందిన తమ నాయకుడు ఫొటో లేదని పదేపదే ఫోన్ చేస్తూ బెదిరింపులకు దిగారని ఫిరోజ్ తెలిపారు.

News September 16, 2024

కోసిగిలో రైలు కింద పడి వ్యక్తి మృతి

image

కోసిగిలోని రైల్వే గేట్ వద్ద గూడ్స్ రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రైల్వే గేట్ సమీపంలో బాలప్ప తోట వద్ద పట్టాలపై తల, మొండెం వేర్వేరుగా పడి ఉన్నాయి. మృతుడు పట్టణంలోని బులొల్లి గేరికి చెందిన బంగారి కోసిగయ్యగా స్థానికులు గుర్తించారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2024

నంద్యాల: ఫిరోజ్‌పై దాడి.. TDP అధిష్ఠానం సీరియస్..!

image

పక్కా వ్యూహంతోనే ఓ క్రియాశీలక టీడీపీ నాయకుడి అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కుమారుడు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంపై టీడీపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి ఘటనను ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఫిరోజ్ పేర్కొన్నారు.

News September 16, 2024

కర్నూలు క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా?

image

☛ ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సేవలందించింది?
☛ కొండారెడ్డి బురుజును ఎవరు నిర్మించారు?
☛ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జన్మించిన గ్రామం పేరేంటి?
☛ పూర్వం నంద్యాలను ఏ పేరుతో పిలిచేవారు?
☛ వరల్డ్​బుక్​ ఆఫ్​రికార్డ్స్‌లో శ్రీశైలం ఆలయానికి చోటు దక్కడానికి కారణమేంటి?
★ పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?
నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్‌లో జవాబులను చూడొచ్చు.

News September 16, 2024

నంద్యాలలో మంత్రి కుమారుడిపై దాడి

image

నంద్యాలలో ఆదివారం మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కుమారుడు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్‌పై నలుగురు దుండగులు దాడి చేశారు. రాజ్ థియేటర్ నుంచి వాహనంలో వెళ్తుండగా మోటార్ బైక్‌పై వెంబడించిన నలుగురు ఫిరోజ్ వెహికల్‌పై దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన ఫిరోజ్.. వాహనం దిగి దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పట్టుకున్నారు. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News September 16, 2024

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

image

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ పెద్దిరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలు అందించి సత్కరించారు.

News September 16, 2024

హోళగుందలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

image

హోళగుంద అయోధ్య నగర్ కాలనీలో ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ స్తంభాలు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. కాలనీవాసులు, మూగజీవాలు సంచరించే ప్రదేశంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి స్తంభాలను మార్చాలని వారు కోరారు.

News September 15, 2024

నంద్యాల విద్యార్థికి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్’లో చోటు

image

నంద్యాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి హావీస్ తన ప్రతిభతో ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. రమేశ్, స్వర్ణ దంపతుల కుమారుడు హావీస్ ప్రముఖ చిత్రకారుడు కోటేశ్ వద్ద చిత్రకళలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో ఆయన పోట్రేయిట్ చిత్రాన్ని 3 గంటల్లో 3,022 చిన్న బొట్టు బిళ్లలను అతికిస్తూ తయారు చేశాడు. హవీస్‌కు సంస్థ ప్రతినిధులు ప్రశంసా పత్రాన్ని అందించారు.

News September 15, 2024

యువకుడిని కాపాడిన నంద్యాల పోలీసులు

image

నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు కాపాడారు. వివరాలు.. గడివేముల మండలం మంచాలకట్టకు చెందిన మానస ఆత్మహత్యకు పాల్పడింది. మనస్తాపానికి గురైన మానస భర్త అశోక్ (25) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. బంధువుల సమాచారం, ఎస్పీ, డీఎస్పీల దిశానిర్దేశంతో ఆపరేషన్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబీకులకు అప్పగించారు.

News September 15, 2024

తుగ్గలి: వజ్రం దొరికింది

image

ఓ రైతుకు వజ్రం దొరికిన ఘటన తుగ్గలి మండలంలో జరిగింది. మండలంలోని సూర్యతండాకు చెందిన ఓ రైతు పొలం పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయనకు 8 క్యారెట్ల బరువైన వజ్రం దొరికింది. దానిని జొన్నగిరికి చెందిన ఓ వ్యాపారి రూ.10 లక్షలకు కొనేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.