Kurnool

News August 21, 2025

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చే అర్జీల్లో 85శాతం రెవెన్యూకు సంబంధించినవేనని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి.రంజిత్ బాషా హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం భవనంలో రెవెన్యూ అంశాలపై సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్లు, సర్వేయర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే నాలుగైదు సార్లు చెప్పానని, ఇక ఉపేక్షించేది లేదని అన్నారు. జేసీ నవ్య పాల్గొన్నారు.

News August 21, 2025

సమస్యల పరిష్కారానికి పల్లెకు పోదాం: కలెక్టర్

image

గ్రామ సమస్యల పరిష్కారానికి పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. బుధవారం కర్నూలులోని సునయన ఆడిటోరియంలో స్పెషల్ ఆఫీసర్లు, తహశీల్దార్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పల్లెకు పోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అధికారులు ప్రతీ గ్రామానికి వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా చూడాలన్నారు.

News August 20, 2025

ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి: కలెక్టర్

image

ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కర్నూలు శివారులోని పెద్దపాడు నుంచి 44వ జాతీయ రహదారి హైదరాబాదుకు లింకు చేసే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ పి. రంజిత్ భాషా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశహాలులో ఎస్పీతో కలిసి రోడ్ సేఫ్టీ సమావేశం నిర్వహించారు. కర్నూలులో కిడ్స్ వరల్డ్ నుంచి కలెక్టరేట్ వరకు విస్తరణ, ఉల్చాల రోడ్డు సర్కిల్ పనులు వేగవంతం చేయాలన్నారు.

News August 19, 2025

యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు: కలెక్టర్

image

రైతులకు కాకుండా యూరియాను పక్కదారి పట్టిస్తే వ్యవసాయ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ రంజిత్ భాషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో యూరియా ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ షాపుల్లో అధిక ధరలకు అమ్మినా, లింకేజీలు పెట్టినా కేసులు తప్పవన్నారు. సరిహద్దు చెక్ పోస్ట్‌లలో విజిలెన్స్, పోలీస్, రవాణాశాఖ అధికారుల టీములతో తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

News August 19, 2025

తుంగభద్ర జలాశయం 26 గెట్లు ఎత్తివేత

image

ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల రైతులకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర జలాశయం వరుస వర్షాల కారణంగా మంగళవారం నిండుకుండలా మారింది. దీంతో బోర్డు అధికారులు జలాశయం నుంచి 26 గేట్లను ఎత్తి దిగువన గల నదికి నీటిని విడుదల చేశారు. దీంతో నది తీర ప్రాంత గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో ఉన్న నీటి సామర్థ్యం 1,626 అడుగులుగా ఉంది.

News August 19, 2025

మాదకద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

సమాజాన్ని నిర్వీర్యం చేసే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.రంజిత్ భాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్ భవనంలో నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో కలిసి “డ్రగ్స్ వద్దు బ్రో” పోస్టర్లను ఆవిష్కరించారు. జేడ్పీ సీఈఓ నాసర రెడ్డి, కమిషనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

News August 19, 2025

కర్నూలులో మహిళా దొంగలు అరెస్ట్

image

కర్నూల్ ఆర్టీసీ బస్టాండులో బస్సు ఎక్కే ప్రయాణికుల వద్ద బంగారు గొలుసులు, పర్సులను దొంగిలిస్తున్న మహిళా దొంగలు షేక్ ఖాజాబీ, షేక్ ఫరీదాను సోమవారం అరెస్టు చేసినట్లు కర్నూలు 4వ పట్టణ సీఐ విక్రమ సింహ తెలిపారు. ఈనెల 13న అలంపూర్‌కు చెందిన విమలమ్మ పర్సు దొంగిలించినట్లు ఫిర్యాదు చేయడంతో ఆర్టీసీ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇరువురు మహిళలను అరెస్టు చేశామన్నారు. విచారణలో నేరం అంగీకరించారన్నారు.

News August 19, 2025

రూ. వెయ్యి జరిమానా: కర్నూలు ట్రాఫిక్ సీఐ

image

కర్నూలులో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే యజమానులకు జరిమానా విధిస్తున్నట్లు కర్నూల్ ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ వెల్లడించారు. సోమవారం సీఐ ట్రాఫిక్ పోలీసులతో కలిసి సి.క్యాంప్, బళ్లారి చౌరస్తా, రాజ్ విహార్ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ఉన్న వాహనదారులకు రోజా పువ్వు ఇచ్చి, హెల్మెట్ లేని 100 మందికి రూ. 1000 చొప్పున జరిమానా విధించామన్నారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరని సూచించారు.

News August 19, 2025

KDCC బ్యాంక్ AGM రామ్మోహన్ మృతి

image

KDCC బ్యాంకు AGM రామ్మోహన్ సోమవారం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందారు. పత్తికొండ కేడీసీసీ బ్యాంకు మేనేజర్‌గా ఆయన చాలాకాలం పనిచేశారు. నియోజకవర్గం పరిధిలో ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి.

News August 19, 2025

కర్నూలు DEOపై విచారణకు ఆదేశం

image

కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న ఎస్.శామ్యూల్ పాల్ విద్యార్హతపై పాఠశాల విద్యా కమిషనర్ విజయరామ రాజు విచారణకు ఆదేశించారు. ఈ విషయాన్ని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ జనరల్ సెక్రటరీ ఎం.వి శేషఫణి రాజు తెలిపారు. ఈనెల 7న కడప ఆర్జేడీ శామ్యూల్‌ను రాష్ట్ర విద్యా కమిషనర్ ఆదేశించారన్నారు. ఈ అంశంపై ఇప్పటికే వివిధ సంఘాల నాయకులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.