Kurnool

News August 15, 2025

విద్యార్థుల సంక్షేమం కోసం మంత్రి లోకేశ్ కృషి: ఎంపీ

image

కర్నూలు మండలం పంచలింగాలలో పలు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం మంత్రి లోకేశ్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

News August 15, 2025

కర్నూలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు

image

79వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా కలెక్టర్ పి.రంజిత్ బాషా తన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్ర నేటి యువతరానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ వెంకట్ నారాయణమ్మ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

News August 15, 2025

కర్నూలు జిల్లాలో 276 బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ

image

మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి సర్వం సిద్ధమైంది. స్త్రీ శక్తి పథకాన్ని నేడు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. కర్నూలు జిల్లాలో 186 పల్లె వెలుగు, 2 అల్ట్రా పల్లె వెలుగు, 82 ఎక్స్‌ప్రెస్ బస్సులను ఉచిత ప్రయాణం కోసం ఉపయోగిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 390 బస్సులకు గానూ 276 ఉచిత బస్సులకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.

News August 15, 2025

కర్నూలులో ట్రాఫిక్ సమస్య ఉండొద్దు: మంత్రి

image

కర్నూలులో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. పాతబస్తీలో వన్ సైడ్ పార్కింగ్, ఆటోల కోసం ప్రత్యేక మార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌గా గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆర్టీసీ బస్సులు నగరంలోకి ప్రవేశించకుండా బయటి మార్గాల ద్వారా వెళ్లేలా చూడాలని పేర్కొన్నారు.

News August 14, 2025

కర్నూలు ఐపీఎస్ అధికారికి రాష్ట్రపతి మెడల్

image

కర్నూలుకు చెందిన 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డా.జీవీ సందీప్‌ చక్రవర్తి 6వ రాష్ట్రపతి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంటరీకి ఎంపికయ్యారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీనగర్‌ ఎస్ఎస్పీగా సెంట్రల్‌ క్యాడర్‌లో పనిచేస్తున్నారు.

News August 14, 2025

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: ఏఎస్పీ

image

కర్నూలులో శుక్రవారం నిర్వహిస్తున్న పంద్రాగస్టు వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ వెల్లడించారు. గురువారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన రిహార్సల్‌ను ఆయన పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

News August 14, 2025

కర్నూలు: అక్కడ బహిర్భూమికి వెళ్తే రూ.2,000 జరిమానా

image

కర్నూలు జిల్లా ఆస్పరిలోని చెరువులో బహిర్భూమికి వెళ్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ సెక్రటరీ విజయరాజు, సర్పంచ్ మూలింటి రాధమ్మ హెచ్చరించారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేయించారు. నిబంధన అతిక్రమించిన వారికి రూ.2,000 జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. చెరువు నుంచి బోర్లకు మంచినీరు వస్తుందని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

News August 14, 2025

పంద్రాగస్టు నాడు మాంసం విక్రయాలు బంద్

image

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో మాంసం విక్రయాలు నిషేధిస్తున్నామని కర్నూలు నగర పాలక ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. నగరంలోని కబేళాలు, మాంసం దుకాణాలు, నాన్ వెజ్ హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News August 14, 2025

రూ.5 లక్షల నగదు చోరీ

image

బ్యాంకులో డబ్బు డ్రా చేసుకొని వెళ్తున్న బాధితుడి నుంచి దుండగులు రూ.5 లక్షలు అపహరించారు. హాలహర్వి మండలం ఎంకేపల్లికి చెందిన గోపాల్ బుధవారం ఆలూరు ఎస్బీఐ నుంచి రూ.5 లక్షలు తీసుకొని స్కూటర్‌పై గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో స్కూటర్ నిలిపి మూత్రవిసర్జనకు వెళ్లారు. అప్పటికే బాధితుడిని అనుసరిస్తున్న దుండగులు స్కూటర్‌లో ఉంచిన నగదు సంచిని అపహరించారు. బాధితుడు గోపాల్ ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 14, 2025

కర్నూలు: అక్కడ బహిర్భూమికి వెళ్తే రూ.2,000 జరిమానా

image

కర్నూలు జిల్లా ఆస్పరిలోని చెరువులో బహిర్భూమికి వెళ్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ సెక్రటరీ విజయరాజు, సర్పంచ్ మూలింటి రాధమ్మ హెచ్చరించారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేయించారు. నిబంధన అతిక్రమించిన వారికి రూ.2,000 జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. చెరువు నుంచి బోర్లకు మంచినీరు వస్తుందని, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.