India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ వేదికగా ఆదివారం జరిగిన ఏపీ గణేశ్ ఉత్సవ సమితి సర్వసభ్య సమావేశంలో కర్నూలు జిల్లాకు చెందిన బి.వేణుగోపాల్ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా గణేశ్ ఉత్సవ సమితికి చేసిన సేవకుల గాను రాష్ట్ర కమిటీ సభ్యులు తనను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
ప్రపంచ ఆదివాసుల దినోత్సవం పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వ గిరిజన సలహా మండలి కౌన్సిల్ వెంకటపతిని కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే శ్యాం కుమార్ శనివారం ఘనంగా సత్కరించి, మెమెంటో అందజేశారు. వెంకటపతి మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో 2వ గిరిజన మండలంగా తుగ్గలి గుర్తింపు పొందిందని, కేఈ కుటుంబం గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అన్నారు.
శాంతియుత వాతవారణం, ప్రజలకు తాము ఉన్నామనే భరోసా కల్పించేందుకు కేంద్ర సాయిధ బలగాల కవాతు (రాపిడ్ యాక్షన్ ఫోర్స్) నిర్వహించామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శనివారం కర్నూలు కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు కవాతును నిర్వహించారు. స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పుతూ, ప్రజలకు ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే తక్షణ సాయం అందిస్తామని అన్నారు. పండగలను ప్రశాంత వాతావరణ జరుపుకోవాలని సూచించారు.
అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. కష్టాల్లో తోడుగా నిలుస్తానంటూ సోదరుడు చెప్పేమాట సోదరికి కొండంత బలాన్నిస్తుంది. చిన్ననాటి నుంచి ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు, అల్లరి చేష్టలు, కోపతాపాలు ఎన్నున్నా.. ఎవరికి ఇబ్బంది కలిగినా మరొకరు తల్లడిల్లిపోతారు. ప్రేమా,ఆప్యాయతల కలబోత వీరి బంధం. ఆ బ్లడ్లో ఉండే మ్యాజిక్కే వేరు. మరి మీకు రాఖీకట్టే సోదరికి కామెంట్ ద్వారా విషెస్ చెప్పండి.
అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాలకు చెందిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆన్లైన్ పోర్టల్లో డాక్యుమెంట్ అప్లోడ్ చేసే అంశంపై MROలతో ఎంపీడీఓలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ కార్యాలయాలకు సంబంధించిన చట్టాలు, కోర్ ఆర్డర్లు, మెమోలు, జీఓలు, సర్కులర్లు, ప్రొసీడింగ్ స్కానింగ్ చేసి ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు.
కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎం విద్యాసంస్థ ఆధ్వర్యంలో డ్రోన్ ఆధారిత ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థ రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన క్యాంప్ కార్యాలయంలో ట్రిపుల్ ఐటీడీఎం ఆధ్వర్యంలో రూపొందుతున్న ప్రదర్శనను ఆయన పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని తక్షణ వైద్య సదుపాయం అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు.
కర్నూలులో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సురేంద్ర అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం సురేంద్ర ఎస్పీకి సీసీ కెమెరాలను ఉచితంగా అందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సురేంద్ర లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు ముందుకు వచ్చి నగరాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
దేశ భక్తిని ప్రతిబింబించేలా తిరంగా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కర్నూలులోని తన క్యాంప్ కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల ప్రచార పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు పర్యటనకు వచ్చిన కలెక్టర్కు దళిత చర్మకారుల వృత్తిదారుల సంఘం నేతలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. మూతబడిన లెదర్ సొసైటీ పునఃప్రారంభం, పింఛన్, గృహాలు, ఆరోగ్య బీమా, రుణాల మంజూరు వంటి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఫుట్పాత్పై పనిచేసే వారికి లైసెన్స్ మంజూరు చేసి, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలన్నారు. సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు.
శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాల్లో వచ్చిన భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ అన్నారు. గురువారం ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, ఎస్ఐలు రామాంజులు, శివాంజల్తో కలిసి పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. నదీ తీరాన్ని పరిశీలించారు. మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. మఠం అధికారులతో పలు అంశాలపై చర్చించారు.
Sorry, no posts matched your criteria.