India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలుకు చేరుకున్నారు. ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరారు. మొత్తం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. కాగా పిన్నాపురం గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్ ఆసియాలోనే అతి పెద్దది.
నేడు వడ్డే ఓబన్న జయంతి. ఈయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నమ్మిన బంటు. ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఉద్యమాలకు ఊపిరిపోశారు. ఓబన్న సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు 1807 జనవరి 11న జన్మించారు. నరసింహారెడ్డి తాతది ఇదే గ్రామం కావడంతో ఇరు కుటుంబాలకూ సంబంధాలు ఉండేవి. 1846 అక్టోబరు 6న బ్రిటిష్ వారితో పోరాటంలో ఓబన్న 39ఏళ్లకే వీరమరణం పొందారు. ఆ తర్వాత నరసింహారెడ్డిని ఉరితీశారు.
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో దారుణ హత్య జరిగింది. కర్ణాటక సరిహద్దు సుళేకేరి గ్రామానికి చెందిన బసమ్మ (52)కు భర్త కురువ మారెప్ప మృతి చెందడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఆమె శుక్రవారం ఉదయం ఉచిత గ్యాస్ కోసం హచ్చోళ్లికి బయలుదేరగా మురవణి గ్రామ పొలాల్లో హత్యకు గురైంది. దుండగులు గొంతుకోసి హత్య హత్యచేసినట్లు సమాచారం. ఘటనపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్లో పిన్నాపురం వద్ద రూ.15 వేల కోట్లతో 5,230 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణంలో ఉన్న గ్రీన్కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. కాగా ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పిన్నాపురం ఎనర్జీ ప్రాజెక్టు దేశ చరిత్రలో నిలిచిపోనుంది.
భూ రికార్డులలో మ్యూటేషన్ల దిద్దుబాటు, రెవెన్యూ సదస్సుల్లో భూ పరిష్కార నిమిత్తం స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మండల తహశీల్దార్లు, ఆర్డీవోలను ఆదేశించారు. నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్తో కలిసి భూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రజలపై 2025-26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ భారం మరోసారి ఉండే అవకాశం లేదని ఏపీఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్, పీవీఆర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విద్యుత్ టారిఫ్ పెంపుపై నగరంలోని కల్లూరు ఏపీఈఆర్సీ భవన్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో విజయవాడ నుంచి ఛైర్మన్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై ఆలయ క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన ఖరారైంది. రేపు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు గన్నవరం నుంచి బయల్దేరి 11:30 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం గడివేముల మండలం గని వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ను ఆయన ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. సాయంత్కరం సాయంత్రం 4.50 గంటలకు తిరిగి విజయవాడకు వెళ్తారు.
బనగానపల్లెలోని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లె పంచాయతీ కార్యాలయంలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యతో పాటు పారిశుద్ధ్య అంశంపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బనగానపల్లె వాసులకు పంచాయతీ ద్వారా మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ (ఆర్యూ) పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. వివరాలను యూనిర్సిటీ వెబ్సైట్లో ఉంచినట్లు ఇన్ఛార్జ్ వీసీ ఎన్టీకే నాయక్ తెలిపారు. 2,647 మంది విద్యార్థులు రెగ్యులర్ కింద పరీక్షలు రాయగా.. వారిలో 2,499 మంది పాసయ్యారు. సప్లిమెంటరీ కింద 370 మంది పరీక్షలు రాయగా.. 342 మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.