Kurnool

News January 10, 2025

20 నుంచి జిల్లాలో రీ సర్వే ప్రారంభం: జేసీ

image

కర్నూలు జిల్లాలో ఈనెల 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు కింద జిల్లాలో సర్వే కార్యక్రమం ప్రారంభం కానున్నదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ.నవ్య పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టు కింద రీ సర్వేపై జిల్లాలోని RSDTలు, మండల సర్వేయర్లకు, డిప్యూటీ తహశీల్దార్లకు అవగాహన సదస్సు నిర్వహించారు.

News January 9, 2025

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు

image

23 రోజులలో శ్రీశైల మల్లన్నకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. రూ.3,39,61,457 నగదుతో పాటు 139 గ్రాముల 200 మిల్లీ గ్రాముల బంగారం, 5 కేజీల 400 గ్రాముల వెండి, పలు దేశాల విదేశీ కరెన్సీ ఆదాయంగా చేకూరింది. పటిష్ఠమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్యన లెక్కింపును చేపట్టామని ఈవో ఎం.శ్రీనివాసరావు, డిప్యూటీ ఈవో రమణమ్మ తెలిపారు.

News January 9, 2025

కర్నూలు: పోక్సో కేసులో మూడేళ్లు జైలు శిక్ష

image

పదేళ్ల బాలికకు అసభ్యకర ఫొటోలు చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కర్నూలు బుధవారపేటకు చెందిన బొగ్గుల రాజేశ్‌కు జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు మూడేళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2021 జూన్‌లో కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి పై విధంగా తీర్పునిచ్చారు.

News January 9, 2025

ఇస్తేమా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

ఆత్మకూరు కేంద్రంగా 3 రోజుల పాటు జరిగిన ఇస్తేమా కార్యక్రమంలో భాగంగా చివరి రోజైనా గురువారం వేడుక ముగుస్తున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రత్యేకించి ట్రాఫిక్ సమస్య వాటిల్లకుండా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

News January 9, 2025

పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన రద్దు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి కర్నూలు జిల్లా పర్యటన రద్దయింది. తిరుపతి బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆయన జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. త్వరలోనే మళ్లీ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.

News January 9, 2025

పోర్న్ సైట్ల పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

పోర్న్ సైట్ల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పోర్న్ సైట్లు చూస్తున్న వారిని కొంతమంది బెదిరించి, డబ్బు దోచుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే క్రమంలో సోషల్ మీడియాలో వచ్చే అనవసర లింక్స్ ఓపెన్ చేయవద్దని పేర్కొన్నారు.

News January 9, 2025

నేడు కర్నూలు జిల్లాకు పవన్ కళ్యాణ్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉ.11:45 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 11:50 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి గడివేముల మండలం గని వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అప్పర్ రిజర్వాయర్‌ను పరిశీలించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.

News January 9, 2025

రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో విద్యార్థి ప్రతిభ

image

రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో శ్రీ నవనంది పాఠశాల విద్యార్థి ప్రతిభ కనబరిచారు. నందికొట్కూరులోని నవనంది హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ముర్తుజా వలి గత నెల 26 నుంచి 29వ తేదీ వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో 55 కేజీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ఛైర్మన్ శ్రీధర్ అభినందించారు.

News January 9, 2025

బసినేపల్లిలో రూ.1.50 లక్షల విలువైన వజ్రం లభ్యం

image

పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలంలోని బసినేపల్లిలో ఓ వ్యవసాయ కూలీకి వజ్రం లభ్యమైంది. గ్రామంలో వ్యవసాయ తోటలో పనులు చేస్తుండగా వజ్రం లభ్యం కావడంతో పెరవలికి చెందిన ఓ వ్యాపారికి రూ.1.50 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. ప్రతి ఏడాది ఈ ప్రాంతాల్లో వజ్రాలు లభ్యం కావడం సర్వసాధారణం. వ్యవసాయ కూలీకి వజ్రం లభించడంతో వారి ఇంట్లో ఆనందం నెలకొంది.

News January 9, 2025

స్వయం ఉపాధి రుణాల మంజూరుకు దరఖాస్తుల ఆహ్వానం

image

నంద్యాల జిల్లాలోని బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ జీ.రాజకుమారి బ్యాంకర్లను సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బీసీల స్వయం సమృద్ధి రుణాల మంజూరుపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. అర్హత గల వ్యక్తులకే రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.