Kurnool

News January 8, 2025

20న దివ్యాంగులకు జిల్లాస్థాయి పోటీలు

image

ఈనెల 20న కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో దివ్యాంగులకు జిల్లాస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప తెలిపారు. ఆయన బుధవారం వికలాంగుల సంక్షేమ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు.

News January 8, 2025

కర్నూలు: పెళ్లయిన 21 రోజులకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్

image

పెళ్లయిన 21 రోజులకే ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. కర్నూలుకు చెందిన రాకేశ్ గౌడ్(34)కు కొన్ని రోజుల క్రితమే వివాహమైంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్యానుకు ఉరివేసుకొని అరుణ్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 8, 2025

రేపు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

image

పాణ్యం మండలంలోని పిన్నాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించనున్నారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాఫ్టర్‌లో కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుని, పిన్నాపురంలోని గ్రీన్ సోలార్ పార్కును, పంపింగ్ స్టోరేజ్ ప్రాజెక్టును పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం పవర్ హౌస్‌ను సందర్శిస్తారని తెలిపారు.

News January 8, 2025

శ్రీశైలంలో ఇష్ట కామేశ్వరి అమ్మవారి గురించి తెలుసా?

image

భారతదేశంలో శ్రీశైలంలో మాత్రమే ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఇష్ట కామేశ్వరి అమ్మవారు. పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే కొలవబడే అమ్మవారు ప్రస్తుతం సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటున్నారు. కోరికలు తీర్చే అమ్మవారిగా ఈ ఆలయం ప్రసిద్ధి. ఎంత గొప్ప కోరికైనా ఇక్కడి అమ్మవారికి చెప్పుకుంటే కచ్చితంగా జరిగి తీరుతుందనేది భక్తుల నమ్మకం. పరమశివుడు, పార్వతి దేవిల ప్రతిరూపంగా ఇష్ట కామేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు.

News January 8, 2025

ట్రాక్టర్ కింద పడి నంద్యాల జిల్లా వ్యక్తి మృతి

image

అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ కింద పడి నంద్యాల జిల్లా వ్యక్తి మృతి చెందారు. అందిన వివరాల మేరకు.. అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన వెంకట చరణ్ రెడ్డి ట్రాక్టర్‌లో నంద్యాల నుంచి ధర్మవరానికి వెళ్తున్నారు. అతడు డ్రైవర్ పక్కన కూర్చోగా ముచ్చుకోట వద్ద ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దపప్పూరు పోలీసులు తెలిపారు.

News January 8, 2025

శ్రీశైలంలో ఇష్ట కామేశ్వరి అమ్మవారి గురించి తెలుసా?

image

భారతదేశంలో శ్రీశైలంలో మాత్రమే ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఇష్ట కామేశ్వరి అమ్మవారు. పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే కొలవబడే అమ్మవారు ప్రస్తుతం సామాన్య ప్రజల చేత కూడా పూజలందుకుంటున్నారు. కోరికలు తీర్చే అమ్మవారిగా ఈ ఆలయం ప్రసిద్ధి. ఎంత గొప్ప కోరికైనా ఇక్కడి అమ్మవారికి చెప్పుకుంటే కచ్చితంగా జరిగి తీరుతుందనేది భక్తుల నమ్మకం. పరమశివుడు, పార్వతి దేవిల ప్రతిరూపంగా ఇష్ట కామేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు.

News January 8, 2025

ఆదోనిలో పత్తి క్వింటా రూ.7,500

image

ఆదోని మార్కెట్‌లో చాలా రోజుల తర్వాత పత్తికి గిట్టుబాటు ధర లభిస్తోంది. మార్కెట్ యార్డులో నిన్న క్వింటా రూ.7,500 పలికింది. పత్తి కోతలు మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధిక ధర. నిన్న 3,131 క్వింటాళ్ల సరకు మార్కెట్‌కు రాగా గరిష్ఠ ధర రూ.7,509, సరాసరి రూ.7,209, కనిష్ఠ ధర రూ.5,080తో అమ్మకాలు జరిగాయి.

News January 8, 2025

ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి.. ఐదుగురు అరెస్టు

image

అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సీనియర్ అసిస్టెంట్ ఈరన్న, జూ.అసిస్టెంట్ రమేశ్, డాక్యుమెంట్ రైటర్లు మహబూబ్, షబ్బీర్, సాక్షి ఇలియాస్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు టూ టౌన్ సీఐ సూర్య మనోహర్ రావు వివరాలను వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. వారిని సబ్ జైలుకు తరలించామని, ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.

News January 8, 2025

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

‘పాన్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే.. ఈ రోజే మీ బ్యాంకు అకౌంట్ బ్లాక్ అవుతుంది’ అంటూ వచ్చే మెసెజ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎటువంటి లింకులు/apk ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఇంస్టాల్ చేయకూడదన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే బాధితులు 1930 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు.

News January 7, 2025

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో ఈనెల 26న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జీ.రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో జేసీ విష్ణు చరణ్, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.