Kurnool

News February 21, 2025

కర్నూలులో జీబీఎస్ కేసు.. వ్యాధి లక్షణాలు ఇవే!

image

☞ కాళ్లు, చేతులలో మంట, <<15529133>>తిమ్మిర్లుగా<<>> అనిపించడం
☞ నరాల బలహీనత, కండరాల నొప్పులు
☞ సరిగ్గా నడవలేకపోవడం, తూలడం వంటి లక్షణాలు
☞ నోరు వంకర పోయి మింగలేక ఇబ్బంది పడే పరిస్థతి
☞ చెమటలు ఎక్కువగా పట్టడం
☞ వ్యాధి తీవ్రత ఎక్కువైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

News February 21, 2025

కర్నూలులో జీబీఎస్ కేసు నమోదు

image

కర్నూలులో తొలి గిలియన్‌ బార్ సిండ్రోమ్‌ (జీబీఎస్‌) కేసు నమోదైంది. నగరంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గోకారమ్మ (46) అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. జీబీఎస్ ఉన్నట్లు నిర్ధరించారు. దీంతో ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

News February 21, 2025

నంద్యాల-రేణిగుంట డెమో రైలు వేళల్లో మార్పులు

image

నంద్యాల-రేణిగుంట డెమో రైలు వేళల్లో మార్పులు చేశారు. ఈ రైలు నంద్యాల నుంచి ఉదయం 6:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:45 గంటలకు రేణిగుంటకు చేరుకునేది. నేటి నుంచి ఉదయం 6 గంటలకే బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో రేణిగుంటలో మధ్యాహ్నం 1:50కి బయలుదేరి, నంద్యాలకు రాత్రి 8:40 గంటలకు చేరుకుంటుంది. నిర్వహణపరమైన కారణాల వల్ల మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

News February 21, 2025

ప్రతి కార్మికుడు ఈ-శ్రమ్‌ పోర్టల్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

ఈ-శ్రమ్‌ కార్డు ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుందని, జిల్లాలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ్‌ పోర్టల్లో నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం ఈ-శ్రమ్‌ రిజిస్ట్రేషన్ అంశంపై కార్మిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమల శాఖ, మత్స్య శాఖతో పాటు ఇతర శాఖలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

News February 20, 2025

ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై గురువారం జరిగిన టెలి కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. 69 సెంటర్లలో 23,098 మంది ఫస్ట్ ఇయర్, 22,227 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి, 144 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

News February 20, 2025

‘మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి’

image

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, అమరావతి ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం కర్నూలులోని సంస్థ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ ఏర్పాటయ్యే పరిశ్రమలలో స్థానిక యువతకే 75% ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జీవో తేవాలని కోరారు. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

News February 20, 2025

శ్రీశైలం వెళ్లే యాత్రికులకు బిగ్ అలర్ట్

image

శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం వెళ్లే భక్తులకు అటవీ అధికారులు కీలక సూచన చేశారు. దోర్నాల, శిఖరం చెక్ పోస్ట్‌ల వద్ద ఈ నెల 24 నుంచి 28 వరకు వాహనాలకు 24 గంటల అనుమతి ఉందని రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. తెలంగాణ పరిధిలోని మన్ననూరు, దోమలపెంట వద్ద 23 నుంచి మార్చి 1 వరకు కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే 24 గంటలు అనుమతిస్తామని రేంజర్స్ రవికుమార్, గురు ప్రసాద్ వెల్లడించారు.

News February 20, 2025

38°C.. తగ్గట్లేదు!

image

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వారం రోజుల నుంచి జిల్లాలో 35-38°C ఉష్ణోగ్రత నమోదవుతోంది. నిన్న కర్నూలులో అత్యధికంగా 38°C ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

News February 20, 2025

పొరపాట్లకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియను చేయాలి: కలెక్టర్

image

రీ సర్వే ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్) ప్రకారం పొరపాట్లకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ రెవెన్యూ, సర్వే శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్ నిర్వహణపై రెవెన్యూ, సర్వే సిబ్బందికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

News February 19, 2025

గుంటూరులో కర్నూలు జిల్లా వ్యక్తి మృతి

image

బతుకుదెరువు కోసం వలస వెళ్లిన కర్నూలు జిల్లా వ్యక్తి గుంటూరులో మృతిచెందాడు. అందిన వివరాల మేరకు.. కౌతాళం మండలం సులకేరి గ్రామానికి చెందిన నాగేశ్ (28) జనవరిలో ఉపాధి కోసం వలస వెళ్లారు. ఇవాళ ఉదయం పనులకు పోతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి కింద పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.