Kurnool

News January 7, 2025

నంద్యాల సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్

image

నంద్యాల సబ్ రిజిస్ట్రార్ నాయక్ అబ్దుల్ సత్తార్ సస్పెండ్ అయ్యారు. కోర్టు స్టే ఉన్న ఓ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ దర్యాప్తు జరిపారు. వాస్తవాలు గుర్తించి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ ఉన్నంత వరకూ హెడ్ క్వార్టర్స్ వదిలి బయటికి వెళ్లరాదని ఆదేశించారు.

News January 7, 2025

నంద్యాల: ప్రియుడి మోజులో కుమార్తెను వదిలేసిన తల్లి!

image

ప్రియుడి మోజులో ఓ తల్లి కుమార్తెనే వదిలేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. నంద్యాల(D) పొన్నవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె (11)ను తీసుకొని గతేడాది ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య, కూతురు కనిపించడం లేదని ఆమె భర్త నంద్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. తాజాగా బాపులపాడు మండలంలో సంచరిస్తున్న బాలికను పోలీసులు వివరాలు ఆరా తీయగా తల్లి వదిలేసి వెళ్లినట్లు చెప్పారు. బాలికను నంద్యాల పోలీసులకు అప్పగించారు.

News January 7, 2025

కర్నూలుకు నారా లోకేశ్!

image

మంత్రి నారా లోకేశ్ ఈ నెల 9న కర్నూలుకు రానున్నారు. ఉదయం నగరానికి చేరుకుని సుంకేసుల రోడ్డులో వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అనంతపురం వెళ్తారు. సాయంత్రం నగరంలో జరగనున్న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాత్రికి అనంతపురంలోనే బస చేసే అవకాశం ఉంది. 10న కర్నూలులో మంత్రి టీజీ భరత్ కూతురు వివాహ రిసెప్షన్‌కు హాజరై మంగళగిరికి పయనమవుతారు.

News January 7, 2025

కర్నూలు జిల్లాలో నిందితుడి పరార్?

image

పోలీసుల అదుపులో నుంచి నిందితుడు పరారైన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఆదోని పట్టణ పరిధిలో జరిగిన చోరీ కేసులో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టుకు తీసుకెళ్తుండగా పోలీసులకు మస్కా కొట్టి పరారైనట్లు సమాచారం. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే సంబంధిత స్టేషన్ సిబ్బంది నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

News January 7, 2025

నంద్యాల జిల్లాలో 13,92,036 మంది ఓటర్లు

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టి తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని డీఆర్ఓ రామునాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటర్ల సవరణ అనంతరం జిల్లాలో 13,92,036 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో పురుష ఓటర్లు 6,81,581మంది, మహిళా ఓటర్లు 7,10,193 మంది, ఇతరులు 262 మంది ఉన్నారన్నారు. అన్ని నియోజకవర్గాల పోలింగ్ స్టేషన్లలో ఈఆర్వోలు తుది ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తున్నారన్నారు.

News January 6, 2025

నంద్యాల జిల్లాలో 13,92,036 మంది ఓటర్లు

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టి తుది ఓటర్ల జాబితా విడుదల చేశామని డీఆర్ఓ రామునాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటర్ల సవరణ అనంతరం జిల్లాలో 13,92,036 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో పురుష ఓటర్లు 6,81,581మంది, మహిళా ఓటర్లు 7,10,193 మంది, ఇతరులు 262 మంది ఉన్నారన్నారు. అన్ని నియోజకవర్గాల పోలింగ్ స్టేషన్లలో ఈఆర్వోలు తుది ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తున్నారన్నారు.

News January 6, 2025

నంద్యాల: జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన పోస్టర్‌ ఆవిష్కరణ

image

కుష్టి వ్యాధి నిర్ధారణ కోసం ఈనెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ ఎస్‌లో భాగంగా కుష్టి వ్యాధి నిర్మూలన గోడ పత్రికను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 85 మంది కొత్త రోగులను గుర్తించి వారికి చికిత్స అందించినట్లు స్పష్టం చేశారు. 

News January 6, 2025

గ్రీవెన్స్‌కు వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి: జేసీ

image

గ్రీవెన్స్‌కు వచ్చే ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం ఆదోనిలోని సబ్ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌కు వచ్చే సమస్యలపై నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. ఆయా శాఖల పరిధిలో ఉన్న సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

News January 6, 2025

గడివేముల: రూ. లక్షలు డిపాజిట్ అయ్యాయ్.. వేరే వారికి పంపే వీలు లేదు

image

రూ. 3.24 లక్షలు ఖాతాలోకి జమచేసి బ్యాంకు అకౌంట్ హ్యాక్ చేసే యత్నం గడివేములలో ఆదివారం జరిగింది. పరమేశ్ బ్యాంకు ఖాతాలోకి రూ. 3.24 లక్షలు వచ్చినట్లు మెసేజ్ వచ్చింది, ఖాతాలోనూ చూపించింది. కానీ వేరే వారి ఖాతాకు పంపేందుకు చూస్తే కుదురలేదు. మరొకసారి బ్యాంకు ఖాతా చెక్ చేయగా.. డిపాజిట్ అయిన నగదుతో పాటు తన డబ్బులు రూ. 1.600 కూడా కట్ అయ్యాయి. బాధితుడు మోసాన్ని గుర్తించి అప్రమత్తమయ్యాడు.

News January 6, 2025

మా ఊరిని టాప్ వన్‌గా మారుస్తా: కర్నూలు MP

image

తన సొంత గ్రామం పంచలింగాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే టాప్ వన్ విలేజ్‌గా తీర్చిదిద్దుతానని కర్నూలు MP బస్తిపాటి నాగరాజు హామీ ఇచ్చారు. ఆదివారం కర్నూలు పరిధిలోని పంచలింగాల ఎస్సీ కాలనీలో రూ.14 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. త్వరలోనే పంచలింగాల రూపు రేఖలు మారబోతున్నాయని ఎంపీ అన్నారు.