India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలులో బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని నరసింహారావు పేటను రెడ్ జోన్గా గుర్తించి చికెన్, గుడ్ల అమ్మకాలను నిలిపివేశామని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో చికెన్, గుడ్ల అమ్మకం కొనసాగుతుందన్నారు. చికెన్ను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు.
కర్నూలు డీసీసీ అధ్యక్షుడు పరిగెల మురళీకృష్ణను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పదవి నుంచి తప్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మురళీకృష్ణ డీసీసీ ఆస్తులను సొంత ఆస్తులుగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి, అక్రమాలకు పాల్పడినట్లు ఇటీవల ఏపీసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం ఆయనను పదవి నుంచి తప్పించారు.
కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బంత్రోతి నాగరాజు(50) మృతిచెందారు. రాజమహేంద్రవరంలో సీఐడీ ప్రాంతీయ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. కొంతకాలంగా కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ గతేడాది డిసెంబర్ వరకు మెడికల్ లీవ్లో ఉన్నారు. ఈనెల 2న తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో గురువారం గాంధీపురం-3లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కర్నూలులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నరసింహారావు పేటలో నమోదైనట్లు KMC ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో నరసింహారావు పేట, పరిసర ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించినట్లు వెల్లడించారు. సంకల్ప్ బాగ్లో ఓ వ్యక్తి తన నివాసంలో కోడిని పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఆ కోడి చనిపోవడంతో పరీక్షలు చేయించాడు. పరీక్షలో బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈనెల 15 నుంచి 28వ తేదీ కాకినాడలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలకు నర్సాపురం సచివాలయం అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రసూల్ ఖాన్, కొంగనపాడు సచివాలయం అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ మహేశ్ ఎంపికయ్యారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లోని పశుసంవర్ధక శాఖ జేడీ శ్రీనివాసులు, కల్లూరు ఏవీహెచ్ అడిషనల్ డైరెక్టర్ పార్థసారథి ప్రత్యేకంగా అభినందించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీకి రెండో సీఎంగా ఆయన సేవలు అందించారని, తొలి దళిత ముఖ్యమంత్రి కూడా ఆయనే అని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి జిల్లాకు దామోదరం పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. కాగా సంజీవయ్య జిల్లాలోని కల్లూరు మండలం పెద్దపాడులో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు 1921లో జన్మించిన విషయం తెలిసిందే.
పూర్వం పాండవులు శ్రీశైలం నల్లమల అడవుల్లో తీర్థయాత్రలు చేస్తుండగా ద్రౌపది దాహం తీర్చుకున్న కొలనే భీముని కొలనుగా ప్రసిద్ధి చెందింది. ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు చుట్టుపక్కల వెతికారని చరిత్ర చెబుతోంది. దాలోమశ మహర్షి ఒక శిలను చూపించి, పగులగొట్టమని చెప్పడంతో గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగా నీటి ధారలు దూకాయట. భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడంతో ‘భీముని కొలను‘ అనే పేరు వచ్చిందని అంటారు.
కర్నూలు జిల్లా పెద్ద తుంబలం గ్రామంలో విషాద ఘటన జరిగింది. 21ఏళ్ల వివాహిత అనూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అనూష, శాంతరాజును ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా విషాదం నింపింది. అనూష మృతికి కుటుంబ ఆర్థిక సమస్యలు కారణమా? గృహ కలహాలా? లేక మరేదైనా కారణమా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఆలూరులోని ఇబ్రహీం ఫంక్షన్ హాలులో ఈ నెల 20న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు బహుజన టైమ్స్ సభ్యుడు దుర్గాప్రసాద్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దాదాపు 70 కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొంటారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల పాఠశాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్, రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ సందర్శించారు. ఇక్బాల్ మాట్లాడుతూ.. బాలికలకు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థానాల్లో ఉండాలని, మహిళలు ఎందులో తక్కువ కాదని నిరూపించాలని అన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. బాలికలు పాఠశాలకు వస్తున్న సమయంలో గానీ, బయట గానీ ఎవరైనా ఆకతాయిలు ఈవ్టీజింగ్కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.