Kurnool

News June 29, 2024

జూలై 1న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం: కలెక్టర్

image

జూలై 1న కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్, డివిజన్ కార్యాలయాల్లో సంబంధింత అధికారులు ప్రజా ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

News June 29, 2024

AI సృష్టించిన రాగి ముద్ద చిత్రం

image

నాటుకోడి, రాగి సంగటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీమ ప్రజలు ఆస్వాదిస్తూ తినే వంటకం ఇది. ఇటీవల AI సృష్టించిన వినూత్న ఫొటోలు నెట్టింట వైరలవుతున్న విషయం తెలిసిందే. అలాగే చట్ని, రాగి ముద్ద, నెయ్యితోనూ AI ఓ ఫొటో తయారు చేసింది. దీన్ని ఓ నెటిజన్ నెట్టింట పోస్ట్ చేయడంతో ‘సీమరుచులను ఇంకా ప్రాచుర్యంలోకి తేవాలి’ అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

News June 29, 2024

కలెక్టర్, SP, MLAలతో మంత్రుల సమీక్ష

image

నంద్యాలలోని ఆర్&బీ అతిథి గృహంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూక్ శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, ఎస్పీ కే.రఘువీర్ రెడ్డి, JC టీ.రాహుల్ కుమార్ రెడ్డి, MLAలతో సమీక్షించారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు బీసీ, ఫరూక్ దిశా నిర్దేశం చేశారు. MLAలు కోట్ల, గౌరు, బుడ్డా, భూమా, జయసూర్య పాల్గొన్నారు.

News June 29, 2024

ఎంపీడీవోలపై నంద్యాల కలెక్టర్ ఆగ్రహం

image

నంద్యాల జిల్లా పరిధిలోని కొలిమిగుండ్ల, కొత్తపల్లి మండలాల ఎంపీడీవోల తీరుపై జిల్లా కలెక్టర్ డా.కే.శ్రీనివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీ అంశంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరు కావడం, ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లడాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆ ఇద్దరు ఎంపీడీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జడ్పీ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు.

News June 29, 2024

కర్నూలు: ఉరివేసుకొని మహిళ మృతి

image

ఉరివేసుకొని మహిళ సంగీత(23) మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన సంగీతను పెద్దకడబూరు మండలానికి చెందిన రవికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే రవి ఫిబ్రవరి నెలలో గుండెపోటుతో మృతిచెందగా.. అప్పటి నుంచి సంగీత తల్లితండ్రులతో ఉంటోంది. కుటుంబసభ్యులు ఉదయం కూలీ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లగా ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 29, 2024

నంద్యాల: జనసేన పార్టీలో చేరిన వైసీపీ కౌన్సిలర్ గురుమూర్తి

image

ఆళ్లగడ్డలోని ఎంవీ నగర్ 24వ వార్డు కౌన్సిలర్ గురుమూర్తి శనివారం జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ తాలూకా ఇన్‌ఛార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి సమక్షంలో ఆయన తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇరిగెల మాట్లాడుతూ.. త్వరలోనే మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎన్డీఏ కూటమి వశం కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ జోన్ కమిటీ సభ్యుడు మహబూబ్ హుస్సేన్ పాల్గొన్నారు.

News June 29, 2024

జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు కర్నూల్ యువకుడు

image

జులై మూడో వారంలో విజయవాడలో జరగనున్న జాతీయ స్థాయి అండర్-10 ఆర్చరీ పోటీలకు కర్నూల్ నగరానికి చెందిన యువకుడు కె.పార్థ చంద్ర ఎంపికైనట్లు జిల్లా ఆర్చరీ సంఘం ప్రధాన కార్యదర్శి నాగరత్నమయ్య తెలిపారు. పార్థ చంద్ర ఈ నెల 22 నుంచి 24 వరకు విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో 9వ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని వివరించారు.

News June 29, 2024

కర్నూల్ TO తిరుపతి, విజయవాడకు సర్వీసులు ఎప్పుడో?

image

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (ఓర్వకల్లు) విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకల సంఖ్య పెరుగుతోంది. మూడేళ్ల కాలంలో 1,20,732 మంది ప్రయాణం చేశారు. వైజాగ్, చెన్నై నగరాలకు తక్కువ సమయంలోనే చేరుకోగలుగుతున్నారు. అయితే ఈ ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ, తిరుపతి నగరాలకూ విమానాలు తిప్పాలని ప్రయాణికులు కోరుతున్నారు. మన రాష్ట్ర ఎంపీ రామ్మోహన్ నాయుడే కేంద్ర విమానయానశాఖ మంత్రి కావడంతో దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

News June 29, 2024

సైకిల్‌పై.. అయోధ్య నుంచి మహానందికి

image

ఢిల్లీకి చెందిన రాజేంద్ర శర్మ సైకిల్‌పై మహానందికి చేరుకున్నారు. వస్త్ర దుకాణంలో పనిచేసే ఆయన చిన్నప్పటి నుంచే హిందూ ధర్మం పట్ల ఆకర్షితుడై సైకిల్‌పై సంపూర్ణ భారత్ యాత్ర చేయాలని సంకల్పించాడు. ఈ ఏడాది మార్చి 13న అయోధ్య నుంచి సైకిల్ యాత్ర మొదలు పెట్టాడు. 7 రాష్ట్రాలను దాటుకుంటూ ఏపీకి చేరాడు. అందులో భాగంగా మహానంది చేరుకున్నారు. మహానందీశ్వర స్వామివారిని దర్శించుకుని అహోబిలం, తిరుపతికి వెళ్తానని చెప్పారు.

News June 29, 2024

రూ.1,861 కోట్లను దోచేశారు: ఎంపీ బైరెడ్డి శబరి

image

ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులను శిక్షించాలని ఎంపీ బైరెడ్డి శబరి ప్రభుత్వాన్ని కోరారు. ‘వైసీపీ పాలనలో ప్రజాధనం ఎంతలా దుర్వినియోగం అయిందో చెప్పేందుకు ఇదొక నిదర్శనం. మాజీ సీఎం జగన్ ప్రచార పిచ్చి కోసం ప్రత్యేకంగా డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏకంగా రూ.1,861 కోట్లను దోచేశారు. ఈ అక్రమాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనం దుర్వినియోగం చేసిన దోషులకు శిక్షించాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.