Kurnool

News September 8, 2025

ఫిర్యాదులపై విచారణ చేసి న్యాయం చేస్తాం: కర్నూలు SP

image

బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించారు. ఎస్పీ పాల్గొని జిల్లా వ్యాప్తంగా వచ్చిన 98 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. త్వరితగతిన న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ బాధితులకు హామీ ఇచ్చారు.

News September 8, 2025

నేడు కర్నూలుకు వైఎస్ షర్మిల

image

ఉల్లి, టమాటా ధరల పతనంతో నష్టపోతున్న రైతులకు మద్దతుగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు కర్నూలుకు రానున్నారని కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ షేక్ జిలానీ బాషా తెలిపారు. ఉదయం 11 గంటలకు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద పార్టీ శ్రేణులు ఆమెకు స్వాగతం పలుకుతారని పేర్కొన్నారు. అనంతరం కొత్త బస్టాండ్ సమీపంలోని మార్కెట్ యార్డులో రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకుంటారని చెప్పారు.

News September 8, 2025

ఈనెల 9న కర్నూలు జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీలు

image

ఈనెల 9న ఉదయం 10 గంటలకు కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జిల్లాస్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో సెపక్ తక్రా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం కార్యదర్శి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీల్లో ఉరవకొండలో (సబ్ జూనియర్స్) అలాగే 27, 28 తేదీల్లో ఒంగోలులో (సీనియర్స్) విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

News September 7, 2025

కర్నూలు యోగా జట్టుకు మూడో స్థానం

image

ద్వారక తిరుమల వేదికగా ఈ నెల 6, 7 తేదీలలో నిర్వహించిన 50వ రాష్ట్రస్థాయి యోగా పోటీలలో కర్నూలు జిల్లా జట్టు పాల్గొని 25 పాయింట్ల‌తో మూడవ స్థానంలో నిలిచినట్లు రాష్ట్ర యోగ సంఘం ఛైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టుదలతో సాధన చేసి పథకాల సాధించడం గర్వకారణమని అన్నారు. జిల్లా అధ్యక్షుడు అవినాశ్ శెట్టి, సెక్రెటరీ ముని స్వామి హర్షం వ్యక్తం చేశారు.

News September 7, 2025

ఈనెల 9న కర్నూలు జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీలు

image

ఈనెల 9న ఉదయం 10 గంటలకు కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జిల్లాస్థాయి సీనియర్, జూనియర్ విభాగాల్లో సెపక్ తక్రా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆసంఘం కార్యదర్శి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 13, 14 తేదీల్లో ఉరవకొండలో (సబ్ జూనియర్స్) అలాగే 27, 28 తేదీల్లో ఒంగోలులో (సీనియర్స్) విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

News September 7, 2025

ఉల్లి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: కలెక్టర్

image

మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లి రైతులకు రూ.1200 ప్రకారం మద్దతు ధర లభిస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పి.రంజిత్ బాషా స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉల్లి రైతుల నుంచి 11, 174 టన్నుల ఉల్లిని కొనుగోలు చేశామని, అలాగే 3,200 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.

News September 7, 2025

ఉల్లి రైతులను అడ్డం పెట్టుకొని వైసీపీ డ్రామాలు ఆడుతోంది: మంత్రి టీజీ

image

ఉల్లి రైతులను అడ్డం పెట్టుకొని వైసీపీ డ్రామాలు ఆడుతోందని మంత్రి టీజీ భరత్ ఫైర్ అయ్యారు. ఉల్లి ధరల విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని రూ.1,200కు కొనాలని ఇదివరకే చెప్పారన్నారు. వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలు మానుకోవాలని మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో సమస్యలుంటే ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కరిస్తుందన్నారు. ఏమి లేకున్నా ఏదో జరిగిపోయినట్లు చెప్పడంలో వైసీపీ నేతలు ముందుంటారన్నారు.

News September 7, 2025

కర్నూలు: నర్సింగ్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల 2025-26 విద్యాసంవత్సరానికి GNM నర్సింగ్‌ కోర్సులకు రాష్ట్రంలోని ప్రభుత్వ, నర్సింగ్ కళాశాలల్లో అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఆసుపత్రి అడిషనల్ డీఎంఈ & సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. నర్సింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో 22వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తారన్నారు.

News September 7, 2025

కర్నూలులో ఏఐ టెక్నాలజీతో 100 సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు: మంత్రి

image

కర్నూలులో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏఐ టెక్నాలజీతో కూడిన 100 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. శనివారం ప్రభుత్వ అతిథి గృహంలో కెమెరాల ఏర్పాటుకు కుడా నిధులు రూ.29.84 లక్షల చెక్కును ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు మంత్రి అందజేశారు. కలెక్టర్ రంజిత్ బాషా, జేసీ నవ్య, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

News September 6, 2025

పేలుడు పదార్థాలు గుర్తించడంలో ‘హంటర్’ కీలకం: ఎస్పీ

image

పేలుడు పదార్థాలు గుర్తించడంలో బెల్జియం దేశ మలునాయిస్ జాతికి చెందిన హంటర్ డాగ్ కీలకమైన సేవలు అందిస్తుందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన హంటర్ డాగ్‌ను ఎస్పీ తన ఛాంబర్‌లో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో హంటర్ డాగ్ 10 నెలల పాటు శిక్షణ తీసుకుందని, అసాంఘిక శక్తులు చేసే కుట్రలను ఈ డాగ్ పసిగడుతుందన్నారు.