India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు సహకరించాలన్నారు. గురువారం సాయంత్రం నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఉదయగిరి పరీక్షా కేంద్రం చీఫ్ మారెళ్ల వాసు బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు ఆరు రోజులు పాటు జరిగే ఇంటర్ పరీక్షలకు 144 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందుకోసం ఐదు పరీక్ష రూములలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం మొదటి సంవత్సరం మధ్యాహ్నం రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు.
చికెన్ ప్రియులను ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం వేసవికాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి..చికెన్ ధర అమాంతం పెరిగింది. మనుబోలు మార్కెట్లో బుధవారం చికెన్ ధర ఏకంగా రూ.330 అయింది. దీంతో మాంసం ప్రియులు కడుపు నిండా చికెన్ తినాలంటే జేబులు కాస్త ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు వైసీపీ నేతలు ఓటరు జాబితాలను చించివేయడంతో పాటు తమను బెదిరించారని టీడీపీ బూత్ ఏజెంట్లు శరవణ, మహేశ్, శివకుమార్, శ్రీనివాసులు, రహీమ్ ఆరోపించారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ ఆర్వోకు ఫిర్యాదు చేశారు. 102, 103 బూతుల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి, 148వ బూత్ లో విజయసాయిరెడ్డి, 184, 185, 186 బూతుల్లో మొయిళ్ల గౌరీ, సురేష్ రెడ్డి భయానక వాతావరణం కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కృష్ణపట్నం పోర్ట్ నుంచి పేరేచర్ల వెళుతున్న లారీ.. మేదరమెట్ల పైలాన్ రహదారి పక్కన ఆగి ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇనమనమడుగు చెందిన డ్రైవర్ శ్రీధర్ క్యాబిన్లోనే ఇరుక్కుపోయారు. ఈ లోగా మంటలు చెలరేగి అతను సజీవదహనం అయ్యాడు.
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ ఎం.హరి నారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రోజువారీ తనిఖీల్లో భాగంగా బుధవారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ ఎం.హరి నారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రోజువారీ తనిఖీల్లో భాగంగా బుధవారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.
జిల్లా పర్యటనను ముగించుకుని విజయవాడకు బయలుదేరిన గవర్నర్ అబ్దుల్ నజీర్కు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీస్, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ GM సుందరవల్లి, రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి వీడ్కోలు పలికారు. విక్రమ సింహపురి యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవం ముగియగానే గవర్నర్ బుధవారం సాయంత్రం నెల్లూరు నుంచి విజయవాడకు బయలుదేరారు.
జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటిలో బుధవారం స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరులోని వి.మాలకొండ రెడ్డి నగర్కు చెందిన చందన గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మూడు గోల్డ్ మెడల్స్ అందుకుంది. చందన 2021-22 బ్యాచ్లో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూనివర్సిటీ టాపర్గా నిలిచింది. చందన మాట్లాడుతూ.. పీహెచ్డీ పూర్తి చేసి ప్రొఫెసర్గా రాణించాలన్నది తన ఆశయమన్నారు.
దూర ప్రాంతాల్లో ఉంటున్న నెల్లూరు జిల్లా ఉద్యోగులు తమ సర్వీసు ఓట్లను వినియోగించుకుంటున్నారు. ఆర్మీలో పని చేస్తున్న వారికి ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్(ETPBS) ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. వీళ్లు ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఓటు వేయవచ్చు. ఒక్క నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే 47 సర్వీసు ఓట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 13 మంది ఓటు వేశారు.
Sorry, no posts matched your criteria.