Nellore

News October 9, 2024

నెల్లూరు: క్రికెట్‌ ఆడటానికి వెళ్తూ యువకుడి మృతి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. గూడూరు నియోజకవర్గం కోట పట్టణానికి చెందిన ప్రసాద్ కుమారుడు కార్తిక్(19) తన స్నేహితుడితో కలిసి క్రికెట్ ఆడటానికి బైకుపై విద్యానగర్‌కు బయల్దేరాడు. ఈక్రమంలో HP పెట్రోల్ బంక్ వద్ద బైకు అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో తలకు పెద్ద గాయమైంది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

News October 9, 2024

నెల్లూరు: నేటి నుంచి K.G రూ.50కే టమోటాలు

image

నెల్లూరు జిల్లా రైతుబజార్‌ల‌లో నేటి నుంచి కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై టమోటాల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ అనితాకుమారి పేర్కొన్నారు. ప్రధానంగా నెల్లూరులోని పత్తేఖాన్ పేట, నవాబుపేట రైతుబజార్లో పాటు, కావలి, కందుకూరు, పొదలకూరు రైతుబజారులలో టమోటాలు విక్రయిస్తారన్నారు. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు తీసుకుని రావాలని, ఒకరికి రెండు కిలోలు మాత్రమే ఇస్తామన్నారు.

News October 9, 2024

నెల్లూరు జిల్లాలో త్వరలో ఎన్నికలు: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో త్వరలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఒ.ఆనంద్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇరు శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేసి ఓటరు జాబితా తయారు చేయాలని కోరారు. రెవెన్యూలో ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్ల మంజూరు, మ్యూటేషన్‌ ట్రాన్సాక్షన్లపై తహశీల్దార్లు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.

News October 8, 2024

నెల్లూరు: భక్తిశ్రద్ధలతో కౌమారి పూజ

image

నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కౌమారి పూజను మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి స్వరూపంగా ఓ చిన్నారికి బాలత్రిపుర సుందరి అలంకారం చేసి పూజలు జరిపారు. అనంతరం ఆ చిన్నారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పోటీపడ్డారు. మరోవైపు బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు సరస్వతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

News October 8, 2024

దోచుకోవడంలో సోమిరెడ్డి దిట్ట: వైసీపీ

image

దోచుకోవడంలో సర్వేపల్లి MLA సోమిరెడ్డి దిట్ట అని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆడపాల ఏడుకొండలు ఆరోపించారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సర్వేపల్లిలో సోమిరెడ్డి దోపిడీపై ప్రశ్నించిన వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగతన్నారు. సోమిరెడ్డికి దమ్ముంటే తన అవినీతిపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎస్పీ నాయకులు నరసయ్య, కృష్ణ, రఘు, శివ, సుబ్బారాయుడు పాల్గొన్నారు.

News October 8, 2024

నెల్లూరులో దిగేసిన తెలంగాణ వ్యాపారులు

image

తెలంగాణలో మద్యం వ్యాపారం చేస్తున్న పలువురు ఇప్పుడు నెల్లూరులో షాపులపై గురిపెట్టారు. అక్కడ ఉన్న అనుభవంతో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో దుకాణాలను పొందేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఓ వ్యాపారి 100కి పైగా దరఖాస్తులను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బంధువులు, స్నేహితులతో కలిసి ఆయన అదృష్టం పరీక్షికునేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.

News October 8, 2024

నెల్లూరు: ఇసుక కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

image

జిల్లాలో ఇసుక విధానం మీద కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లోని కమాండ్ కంట్రోల్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేషన్ టీంను సచివాలయ ఉద్యోగులతో ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇసుక సకాలంలో సరఫరా అయ్యేందుకు ఇది పనిచేస్తుందన్నారు. ఇసుక ఫిర్యాదులు, సమాచారం, సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 0861– 2943569ను సంప్రదించాలని సూచించారు.

News October 8, 2024

వాకాటి నారాయణరెడ్డికి బెదిరింపు కాల్స్.. రూ.15 కోట్ల డిమాండ్

image

మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత వాకాటి నారాయణరెడ్డికి సోమవారం బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. సీబీఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ వాకాటి నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. రూ.15 కోట్లు ఇవ్వాలని లేకుంటే వివిధ కేసుల్లో అరెస్ట్ చేస్తామని వాకాటి నారాయణరెడ్డిని బెదిరించారు. దీంతో ఆయన నెల్లూరు వేదయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News October 8, 2024

రేపు టీడీపీలో చేరనున్న బీద మస్తాన్ రావు

image

నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు బుధవారం టీడీపీలో చేరనున్నారు. ఈయన ఆగస్టు 29వ తేదీ రాజ్యసభ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరునున్నారు. 2019 డిసెంబర్‌లో ఈయన టీడీపీ నుంచి వైసీపీలో చేరారు.

News October 8, 2024

వాకాడు: టీడీపీ నేత సంచలన ప్రకటన

image

వాకాడు మండలం రాగుంటపాలెం పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన వాకాడు మండల టీడీపీ బీసీ సెల్ నాయకుడు చెన్నపట్నం జమిందార్ బాబు సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన నాయకులను టీడీపీలో చేర్చుకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. గతంలో తనపై ఎన్నో కేసులు పెట్టారని అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవద్దన్నారు.