India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకులైన ఉపాధ్యాయుడిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు ముందు టీచర్ హేళనగా మాట్లాడటంతో మనస్తాపం చెంది హాస్టల్ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేసి ఉపాధ్యాయుడు వీర రాఘవులుపై కేసు నమోదు చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కందుకూరు పర్యటనలో భాగంగా బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు 1060 మంది సిబ్బందితో పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన ప్రదేశాల్లో బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రధాన భాగస్వాములైన ఎగ్జామినర్లు, చీఫ్, అడిషనల్ సూపరింటెండెంట్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆర్ఐఓ డాక్టర్ ఏ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం తుది విడత పరీక్ష కేంద్రాల చీఫ్ అడిషనల్, చీఫ్ సూపరింటెండెంట్లకు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆర్ఐఓ సూచించారు. పరీక్ష పై ఆపోహలు, ఆరోపణలు రాకుండా చూడాలని కోరారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కందుకూరు పర్యటనలో భాగంగా బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు 1060 మంది సిబ్బందితో పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన ప్రదేశాల్లో బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

కార్పొరేషన్ లోన్ల కోసం నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 15వేల దరఖాస్తులు వచ్చాయని బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి పేర్కొన్నారు. శుక్రవారం సంగం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగు లక్షల సబ్సిడీతో మండలానికి ఒక జనరిక్ మెడిసిన్ యూనిట్ మంజూరైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాలెట్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

జలదంకి మండలం చిన్న క్రాకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి చించివేశారు. చిన్న క్రాకలో ఓ చెరువు వద్ద ఒక వర్గం ఎమ్మెల్యే ఆయన సోదరుడు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు చించివేయడంతో రాజకీయంగా దుమారం లేపింది.

వాలంటైన్స్ డే సందర్భంగా విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పచ్చ పెంచలయ్య ప్రేమికుల చిత్రాన్ని రావి ఆకుపై గీశారు. పొదలకూరు మండలం మహమ్మదాపురానికి పెంచలయ్య ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని వినూత్న చిత్రాలను గీస్తుంటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేమికులందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూ రులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు ముందు టీచర్ మందలించడంతో మనస్తాపం చెంది భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆనంతరం ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై నెల్లూరు నగరంలోని చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. కోటమిట్టకు చెందిన సిరాజ్ ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నితిన్, గోయల్ అనే ఇద్దరు వ్యక్తులు నమ్మబలికి సిరాజ్ వద్ద నుంచి కొంత డబ్బులు తీసుకున్నారు. మోసపోయినట్లు గ్రహించిన సిరాజ్ సైబర్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నాలుగో రోజు ప్రశాంతంగా ముగిశాయని ఆర్ఐవో డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన 8 కేంద్రాలను, జిల్లా ఒకేషనల్ విద్యాశాఖ అధికారి 8 కేంద్రాలను, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు 7 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 13 కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు. మొత్తం 122 మంది ఈ పరీక్షలకు గైర్హాజరయ్యారని ఆర్ఐఓ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.