India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గూడూరు నుంచి పనుల మీద రాపూరు వచ్చిన శివ అనే యువకుడు ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. తూర్పు ఆగర్త కట్టకు వెళ్లే దారిలో శివ నడచి వెళ్తూ అకస్మాత్తుగా కింద పడిపడి గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికులు రాపూరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఏఎస్ఐ వెంకటేశ్వర రావు ఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. మృతదేహన్ని ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు.
కొడవలూరు పరిధిలోని యల్లాయపాలెంలో 01.08.2022 న ఓ బాలిక(12)పై పలుమార్లు అత్యాచారం లైంగిక దాడకి పాల్పడినట్లు పొక్సోకేసు నమోదైంది. ఈ కేసులో మన్నేపల్లి@తాటలపూడి వెంకటరమణయ్య అనే ముద్దాయికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.20,000 జరిమానా కోర్టు విధించినట్లు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ పేర్కొన్నారు. జిల్లా పోక్సో కోర్టు జడ్జి శిరిపిరెడ్డి సుమ విచారణ పూర్తి చేసి శిక్ష విధించినట్లు తెలిపారు.
సర్వేపల్లిలో అనేక అక్రమాలకు పాల్పడి ఇప్పుడు ఓటమితో కాకాణి గోవర్ధన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేశ్ నాయుడు అన్నారు. ముత్తుకూరులో ఆయన మాట్లాడారు. కాకాణి చేసిన అక్రమాల ఆనవాళ్లు సర్వేపల్లిలో ఇంకా చెక్కు చెదరలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయకపోగా ఇప్పుడు రోజూ ప్రెస్ మీట్లతో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
సర్వేపల్లిలో అనేక అక్రమాలకు పాల్పడి ఇప్పుడు ఓటమితో కాకాణి గోవర్ధన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేశ్ నాయుడు అన్నారు. ముత్తుకూరులో ఆయన మాట్లాడారు. కాకాణి చేసిన అక్రమాల ఆనవాళ్లు సర్వేపల్లిలో ఇంకా చెక్కు చెదరలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయకపోగా ఇప్పుడు రోజూ ప్రెస్ మీట్లతో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ మునికుమారికి సోమవారం మెమో జారీ చేసినట్టు తిరుపతి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కోట ప్రాజెక్టు పరిధిలోని 9 సెక్టార్ల పరిధిలో గల 200 మంది ఆయాలచే కోటలోని ప్రాజెక్టు కార్యాలయంలో బాత్రూములు, మరుగుదొడ్లు కడిగించడం, కార్యాలయం, ఆవరణమంతా శుభ్రం చేయించడం, మొక్కలకు నీళ్లు పోయడం, ముగ్గులు వేయించడం చేశారు. దీంతో మెమో జారీ చేసినట్లు తెలిపారు.
అనుమతి పొందిన వాహనాల్లోనే ఇసుక రవాణాను అనుమతిస్తామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక యార్డుల వద్ద నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 350 వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. నిబంధనల మేరకే ఇసుక రవాణా జరగాలన్నారు.
నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఐదో రోజైన సోమవారం అమ్మవారు శ్రీ గజలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుందరేశ్వర స్వామి సన్నిధిలోనూ విశేష అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి.
YCP అధినేత జగన్ను CMను చేయడమే తన లక్ష్యమని నెల్లూరు జిల్లా YCP అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ కోఆర్డినేటర్ ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో ఆదివారం నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. కాకాణి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నేతలు పని చేయాలన్నారు. వారికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కాకాణి భరోసా ఇచ్చారు.
గుడ్లూరు ZPTC సభ్యుడు కొరిసిపాడు బాపినీడు(56) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా కావలిలో నివాసం ఉంటున్న ఆయన గత ఎన్నికల్లో YCP తరఫున ZPTC సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇటీవలె రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగిన ఆయనకు అప్పుల బాధలు ఎక్కువ అయ్యాయి. దీంతో ఒత్తిడి పెరిగి పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిచంగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కావలి పోలీసులు కేసు నమోదు చేశారు.
రాపూరు మండలం కండలేరు జలాశయం ఓబులాయపల్లి సమీపంలో చేపల వేటుకు వెళ్లిన చెంచయ్య అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేపలవేట సాగించి జీవనం సాగిస్తుంటాడు. చెంచయ్య ఆచూకీ కోసం కండలేరులో స్థానికులు గాలింపు వేగవంతం చేశారు.
Sorry, no posts matched your criteria.