India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బిట్రగుంట -విజయవాడ- చెన్నై రైల్వే స్టేషన్ల మధ్య మరోమారు మెమూ రైళ్లు రద్దు కానున్నాయి. బిట్రగుంట – విజయవాడ మధ్య రాకపోకలు సాగించే రైలు ఈ నెల 27 నుంచి జూన్ 23 వరకు, బిట్రగుంట- చెన్నై సెంట్రల్ మధ్య రాకపోకలు సాగించే మెమూను ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు, జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు, తిరిగి 10 నుంచి 14, 17 నుంచి 21 తేదీల మధ్యలో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
కౌంటింగ్ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు సిటీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియపై అధికారులతో కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఇందులో జేసీ సేతు మాధవన్, సబ్ కలెక్టర్ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పాత షెడ్యూల్ ప్రకారం ఆయన 22న జిల్లాకు రానుండగా.. తాజా షెడ్యూల్ ప్రకాం 21వ తేదీ సాయంత్రం 5.10 నిమిషాలకు గుంటూరు నుంచి రైలులో బయలుదేరి రాత్రి 9.24 నిమిషాలకు నెల్లూరుకు చేరుకోనున్నారు. 22వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు.
ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, త్వరలో ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో నెల్లూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులోకి తెస్తున్నారు. ఇప్పటికే పలు డివిజన్లలో అధికారులు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా నెల్లూరు సిటీలోనూ అమలులో ఉందని DSP శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరిగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ ఈ సారి వెంకటగిరి పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. వాళ్లు ఎక్కువా. మేం తక్కువా అని గ్రామీణ ప్రాంతాల్లో చర్చ సైతం రేగింది. ఈక్రమంలో అభ్యర్థులు ప్రత్యేకంగా చూసుకున్న పట్టణ ఓటర్లు ఎవరికి అండగా నిలిచారో..?
వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని కలెక్టర్ హరి నారాయణన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నీటి వసతిపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవిలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.
నాయుడుపేట రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న రైలు… పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు నీలం రంగు జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్లో చిన్నారిని పోలీసులు వెతికిపట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన ఆదివారం జరిగింది. నెల్లూరుకు చెందిన శివ కుటుంబ సభ్యులతో ఆదివారం బీచ్కు వచ్చారు. వారి కుమార్తె రక్షిత(5) బీచ్లో తప్పిపోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మెరైన్ సీఐ కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో బీచ్లో ఒంటరిగా ఉన్న పాపను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపనున్నట్లు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఆదివారం నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని నవాబ్ పేట, కావలి 1 టౌన్, కావలి 2 టౌన్, కావలి రూరల్, ఉదయగిరి, వింజమూరు పరిధిలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ నెల 24వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇప్పటి వరకు ఫీజు చెల్లించ లేకపోయిన విద్యార్థులు సోమవారం చెల్లించాలని ఆర్ఐవో ఆదూరి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్లైన్లో తత్కాల్ పథకం కింద రూ.3000 అపరాధ రుసుముతో కలిపి ఫీజు చెల్లించడానికి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందన్నారు. SHARE IT..
Sorry, no posts matched your criteria.