Nellore

News September 8, 2024

గూడూరు వైసీపీ నేతకు షాక్..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కనుమూరు రవిచంద్రారెడ్డి అధికార ప్రతినిధిగా పలు టీవీ డిబేట్లలో YCP వాయిస్ వినిపించారు. MLAలు, MPలతో పాటు కొందరు నేతలతో టీవీ డిబేట్లలో పాల్గొనే వాళ్ల లిస్ట్‌ను YCP తాజాగా విడుదల చేసింది. వీళ్లను తప్ప మిగిలిన వాళ్లను డిబేట్లకు పిలవకూడదని.. వాళ్ల కామెంట్స్‌కు పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ జాబితాలో రవిచంద్రా రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

News September 8, 2024

గూడూరులో భారీగా గంజాయి స్వాధీనం 

image

గూడూరు బైపాస్ జంక్షన్‌లో శనివారం సాయంత్రం గంజాయి దొరికింది. అనంతపురం, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురి నుంచి 30 కేజీల 900 గ్రాముల గంజాయి సీజ్ చేసినట్లు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. వీరు వైజాగ్ నుంచి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని.. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

News September 7, 2024

నెల్లూరు: బాధితుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు

image

విజయవాడ వరద బాధితులకు ఆహారం, తాగునీటిని అందించాలనుకునే వారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 0861 2331261, 79955 76699 కాల్ సెంటర్ ద్వారా సమాచారం పొం దాలని అధికారులు సూచించారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు CMRF పేరిట డీడీ తీసి, కలెక్టర్ కు అందజేయాలని, వీటిని సీఎం కార్యాలయానికి పంపుతామని చెప్పారు.

News September 7, 2024

నెల్లూరు: రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్

image

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న నూతన విధానంతో తాము ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆదివారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. అంతవరకు విడతల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు.

News September 7, 2024

ముత్తుకూరు: పంచాయతీ కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు

image

నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామ పంచాయతీ సెక్రెటరీ శుక్రవారం సస్పెండ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని సర్పంచ్ బూదురు లక్ష్మి పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ స్వయంగా విచారణ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి చక్రం వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు పడినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

News September 7, 2024

నేడు నెల్లూరు జిల్లాకు వర్షసూచన

image

నెల్లూరు జిల్లా పరిధిలో నేడు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు, పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News September 7, 2024

నెల్లూరు: వరద బాధితులకు అండగా సైకత శిల్పి

image

వరద బాధితులకు సాయం చేయాలంటూ ప్రముఖ సాయి శిల్పి మంచాల సనత్ కుమార్ దాతలను కోరారు. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామ సముద్రతీరంలో హెల్పింగ్ హ్యాండ్‌ను సైకత శిల్పంగా తీర్చిదిద్దాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది ఈ వరదల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం ఒకటే ఆదుకుంటే సరిపోదని, దాతలు కూడా ముందుకు రావాలని అందుకోసమే ఈ హెల్పింగ్ హ్యాండ్ తయారు చేయడం జరిగిందన్నారు.

News September 6, 2024

సోమశిలలో 42.080 టీఎంసీల నీరు నిల్వ

image

అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి 13,053 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు జలాశయ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 42.080 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 1050 క్యూసెక్కులు, కండలేరుకు 6000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 169 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.

News September 6, 2024

నెల్లూరు: కొత్తదారుల్లో ఇసుక అక్రమ రవాణా

image

ఇసుక డిమాండ్ పెరగడంతో అక్రమార్కులు సరికొత్త ఆలోచనలకు తెర తీస్తున్నారు. ఎడ్లబండ్లలో ఇసుక తరలించి దానిని ట్రక్కులకు నింపి సొమ్ము చేసుకుంటున్న ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వెలుగు చూసింది. వాస్తవానికి బండ్లకు ఎటువంటి డబ్బులు కట్టకుండా తరలించవచ్చు. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమంగా ఇలా ఇసుక రవాణా చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News September 6, 2024

UDG: నకిలీ విత్తనాలను విక్రయిస్తే చర్యలు

image

వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే దుకాణ యజమానులపై చట్ట పరమైన చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి హెచ్చరించారు. ఉదయగిరి వ్యవసాయ కార్యాలయంలో ఎరువుల దుకాణ యజమానులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. నిబంధనలను పాటిస్తూ దుకాణాల వద్ద ధరల పట్టికను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.