India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు నగరం ఆర్అండ్బీ అతిథి గృహానికి విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్రీనివాసరెడ్డిని శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్, నెల్లూరు ఆర్డీవో అనూష మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, నెల్లూరు ఆర్డీవోలు రాష్ట్ర హైకోర్టు జడ్జితో వివిధ అంశాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
ఉదయగిరి RTC డిపో సమీపంలో బ్రిటిష్ కాలం నాటి మార్చురీ భవనం కబ్జాకు గురైనట్లు స్థానికులు ఆరోపించారు. మార్చురీ భవనానికి సంబంధించిన స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కంప చెట్లను తొలగించి, చదును చేసి ఆక్రమించేందుకు హద్దు రాళ్లు ఏర్పాటు చేశారన్నారు. విషయం తెలుసుకున్న ఉదయగిరి CHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్.. ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించి రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం తన చాంబర్లో ఉగాది వేడుక నిర్వహణకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో ఉగాది వేడుక నిర్వహిస్తామన్నారు.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కస్తూరిదేవి గార్డెన్స్లో శుక్రవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి, కలెక్టర్ ఆనంద్, కమిషనర్ తోపాటు ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. వారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
విడవలూరు మండలానికి సంబంధించిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులను వైసీపీ అధిష్ఠానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు ఆవుల శ్రీనివాసులు(రామచంద్రాపురం), అక్కయ్యగారి బుజ్జమ్మ(పెద్దపాళెం), వెందోటి భక్తవత్సలయ్య(వరిణి), ముంగర భానుప్రకాశ్(దంపూరు), చింతాటి జగన్మోహన్(అలగానిపాడు)ను సస్పెండ్ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు.
తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన కాకాణి పిటిషన్పై కోర్ట్.. పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వరదాపురం పరిధిలోని ప్రభుత్వ భూమిలో కాకాణి అక్రమంగా మైనింగ్ చేశారంటూ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ నెల 16న ఆయనపై కేసు నమోదైంది. దీనిపై బెయిల్ కోరుతూ కాకాణి కోర్టుకు వెళ్లగా.. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తమకు సర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
సినీ హీరోను అంటూ నమ్మించి మహిళను మోసం చేసిన ఘటనలో యువకుడిపై నెల్లూరు చిన్న బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి(D) కోట మండలానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఇన్స్టాలో సునీల్ రెడ్డి పరిచయం అయ్యాడు. హీరోను అంటూ నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలతో సునీల్ బెదిరించి దాడి చేశాడు.
ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ నగదును లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేస్తుందని జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. దీపం 2 స్కీం కింద లబ్ధిదారులు సబ్సిడీ అమౌంట్ తమ ఖాతాలో జమ అయిందా లేదా అని https://epds2.ap.gov.in/lpgDeepam/epds పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ కోరారు.
మండలంలోని చాకిచర్ల సచివాలయం వివాదాస్పద వ్యవహారంపై జిల్లా కలెక్టర్ నివేదిక కోరినట్లు MPDOవిజయ తెలిపారు. మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ వ్యక్తి సచివాలయం తాళం తీసి లోపలికి వెళ్ళడం.. దానిని పసిగట్టిన స్థానికులు ఆ వ్యక్తిని నిలదీసిన వైనం గురించి way2news లో ‘తాళం ఎందుకు తీశారు’.? అంటూ కథనం వచ్చిన సంగతి తెలిసిందే. సంచలనం రేపిన ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక పంపుతున్నట్లుMPDO చెప్పారు
అనంతసాగరం మండలం గోవిందమ్మపల్లి జాతీయ రహదారి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో అనంతసాగరం ఏసీ మెకానిక్ హమీద్ (29) తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.