Nellore

News August 25, 2025

నెల్లూరు: రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులు అరెస్ట్

image

నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరులపై జిల్లా పోలీసులు దృష్టిపెట్టారు. అతని ప్రధాన అనుచరులు జగదీశ్‌తో పాటు భూపతి, సురేంద్రను వేదయపాలెం పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాంత్ గ్యాంగ్‌పై పోలీసులు సీరియస్‌గా దృష్టి పెట్టిన నేపథ్యంలో మరి కొంతమందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి.

News August 25, 2025

నెల్లూరు: మద్యం కోసం కత్తితో బావనే బెదిరించాడు

image

మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో సొంత బావనే కత్తితో బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. జ్యోతి నగర్‌కు చెందిన సాజిద్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు లేకపోవడంతో తన బావ సంధానిని అడిగాడు. అతను లేవని చెప్పడంతో కత్తితో బెదిరించి అతని వద్ద నుంచి రూ.1000 తీసుకున్నాడు. దీంతో బాధితుడు వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News August 25, 2025

నెల్లూరు: జీవిత ఖైదు మృతి

image

అనారోగ్యంతో జీవిత ఖైదీ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో మృతి చెందాడు. నెల్లూరు జిల్లా మైపాడుకు చెందిన షేక్ కాలేషా(64) ఓ వ్యక్తిని హత్య చేసి నెల్లూరు సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో నెల్లూరు జైలు పోలీసులు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

News August 25, 2025

నెల్లూరు జిల్లాలో 7,10,990 కుటుంబాలకు కార్డులు పంపిణీ

image

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. నెల్లూరు జిల్లాలో 7,10,990 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ నుంచి కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుని ఫొటో, ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది.

News August 24, 2025

సైదాపురం: తండ్రి కల నెరవేర్చిన కుమారుడు

image

నెల్లూరు జిల్లా, సైదాపురం మండలం అనంతమడుగు గ్రామపంచాయతీ అరుంధతి వాడకు చెందిన లేట్ కత్తి సుబ్బయ్య పెద్ద కుమారుడు కత్తి శ్రీనివాసులు డీఎస్సీ పరీక్షలో సత్తా చాటారు. డీఎస్సీలో డిస్టిక్‌లో ఎస్ఏలో 19వ ర్యాంకు, TGTలో 40, PGTలో 17వ ర్యాంకు సాధించారు. డీఎస్సీలో ఉద్యోగం సాధించి తన తండ్రి కల, ఊరి పేరు నిలబెట్టాడు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

News August 24, 2025

నెల్లూరు: 10 కిలోల గంజాయి సీజ్

image

వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. తిరుపతి వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేసేందుకు ఆపగా అందులో రూ.80 వేలు విలువచేసే 10 కేజీల గంజాయిను గుర్తించారు. గంజాయిని సీజ్ చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాలోని కోరాపూర్ వద్ద గంజాయిని కొనుగోలు చేసి తిరుపతిలో అమ్మేందుకు వెళుతుండగా మార్గం మధ్యలో వారిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

News August 24, 2025

కాకాణి గోవర్ధన్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ భేటీ

image

మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆదివారం పొదలకూరు రోడ్డులోని YCP జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, భవిష్య కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించారు. భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలు, జిల్లా నాయకత్వం పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సుమారు అరగంట పాటు మాట్లాడుకున్నారు.

News August 24, 2025

DCSలో ఉద్యోగాల సాధించిన అన్నదమ్ములు

image

ఉదయగిరిలోని దిలార్ బావి వీధి వీధికి చెందిన అన్నదమ్ములు టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. షేక్ నస్రుల్లా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ సబ్జెక్టులో 57వ ర్యాంకు సాధించగా, ఆయన సోదరుడు షేక్ సిగ్బతుల్లా పీఈటీ జోనల్-3 జనరల్ విభాగంలో 179 వ ర్యాంకు, బీసీఈలో 1వ ర్యాంకు సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నస్రుల్లా ప్రస్తుతం దుత్తలూరు మండలం వెంకటంపేట యూపీ స్కూల్లో SGTగా పనిచేస్తున్నారు.

News August 24, 2025

ఆత్మకూరులో దొంగనోట్ల కలకలం

image

ఆత్మకూరులోని మున్సిపల్ కూరగాయల మార్కెట్లో శనివారం నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. రెండు రూ.200 నోట్లను షాపులలో ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కూరగాయలు కొనుగోలు చేసి వెళ్లారు. ఆ షాపు నిర్వాహకులు నోట్లను మరొకరికి ఇచ్చే క్రమంలో దొంగనోట్లుగా తేలింది. దీంతో వారు కంగుతున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని పలువురు హెచ్చరించారు.

News August 24, 2025

కీలక మలుపు తిరిగిన కరేడు రైతు ఉద్యమం

image

రాష్ట్రంలో సంచలనం రేపిన కరేడు రైతు ఉద్యమం ఆసక్తికర మలుపు తిరిగింది. ఉలవపాడు(M) కరేడులో ఇండోసోల్ పరిశ్రమ కోసం ఇచ్చిన 4,800 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కరేడు, ఉలవపాడు, కందుకూరు తదితర ప్రాంతాలలోని 10 దేవాలయాలకు చెందిన 104.21 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్దంగా నోటిఫికేషన్‌లో చేర్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో హైకోర్టు విచారణ చేపట్టింది.