India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ సమీక్షలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ వంటి స్మార్ట్ పోలీసింగ్ టెక్నాలజీతో నేరాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ సమీక్షలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ వంటి స్మార్ట్ పోలీసింగ్ టెక్నాలజీతో నేరాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ సమీక్షలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ వంటి స్మార్ట్ పోలీసింగ్ టెక్నాలజీతో నేరాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ సమీక్షలో ఎస్పీ డా. అజిత వేజెండ్ల పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. డ్రోన్ సర్వైలెన్స్, సీసీటీవీ వంటి స్మార్ట్ పోలీసింగ్ టెక్నాలజీతో నేరాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

తిరుపతి నుంచి నెల్లూరు మీదుగా శ్రీకాకుళానికి డైరెక్ట్ రైలు సర్వీసుకు రంగం సిద్ధమైంది. హంసఫర్ ఎక్స్ప్రెస్(17439/17440) రైలు ఆదివారం సా.4.55 గం.కు TPT నుంచి బయలుదేరి రాత్రి 8.03కు నెల్లూరు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి సోమవారం మ.12.30 గం.కు శ్రీకాకుళం రీచ్ అవుతుంది. బాపట్ల, రాజమండ్రి, దువ్వాడ మీదుగా వెళ్లే ఈ రైలు రూట్ మ్యాప్ కోసం <<-1>>క్లిక్<<>> చేయండి.

కుటుంబ కలహాల నేపథ్యంలో దగదర్తి మండలం తురుమెళ్ల పంచాయతీ లక్ష్మి నరసాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపాడు. కుటుంబ సభ్యులు 112 కి కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే దగదర్తి ఎస్సై జంపాని కుమార్ తమ సిబ్బందిని అప్రమత్తం చేసి ఆత్మహత్యకు యత్నిస్తున్న వ్యక్తిని మొబైల్ నంబర్, లొకేషన్ ఆధారంగా కనుగొని అతని ప్రాణాలను కాపాడారు.

అక్రమ రవాణాదారులు నిషేధిత చికెన్ వ్యర్థాలను బహిరంగంగానే తరలిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఎన్నిసార్లు దాడులు చేసి కేసులు పెట్టినా అక్రమ రవాణా ఆపడం లేదు. బద్వేల్ నుంచి వస్తున్న వాహనాలు దారి మార్చాయి. హైవేను తప్పించి అనంతసాగరం మండలంలోని పల్లెల మీదుగా రొయ్యల, చేపల గుంటలకు ఈ వ్యర్థాలు తరలిస్తున్నారు.

ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా ఐదోసారి నెల్లూరు శాస్త్రవేత్త డాక్టర్ అనుముకొండ వరదరాజులు చోటు సంపాదించారు. ఆయనను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సత్కరించారు. 75 ఏళ్ల వయసులో పసుపు, గోమూత్రం వంటి ప్రకృతి సిద్ధ పదార్థాలతో క్యాన్సర్ కణాలను నిరోధించే ‘నానో-మెడిసిన్’పై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఆయన సాధించిన అంతర్జాతీయ పేటెంట్లు జిల్లాకు గర్వకారణమని జేసీ కొనియాడారు.

నెల్లూరు జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 12న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీఈవో బాలాజీరావు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే పరీక్షకు హాజరుకావాలన్నారు. www.apms. apcfss.in నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

రాపూరు(M) కండలేరు జలాశయం నిర్మాణానికి భూములు ఇచ్చిన 19 గ్రామాల ప్రజలు 30 ఏళ్లుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారు. వేల ఎకరాల భూములతో పాటు విలువైన పండ్ల తోటలను కోల్పోయారు. ఇందులో కొంతమందికే ఇళ్లు కేటాయించారు. 117 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చినప్పటికీ మరో 60 కుటుంబాలకు ఇప్పటికీ కాలనీ ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వాలు మారడంతో పనులు ఆలస్యమవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.