Nellore

News September 2, 2024

పోలీసు ప్రజా విజ్ఞప్తులకు 155 ఫిర్యాదులు: ఎస్పీ

image

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి సోమవారం 155 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.

News September 2, 2024

నెల్లూరు: సోమశిలకు భారీ వరద

image

అనంతసాగరం మండలం, సోమశిల జలాశయానికి సోమవారం ఉదయం 6 గంటలకు ఎగువ ప్రాంతాల నుంచి, కృష్ణా జలాల నుంచి 19,548 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు జలాశయ ఈఈ దశరథ రామిరెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 38.181 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెన్నా డెల్టాకు 550 క్యూసెక్కులు, కండలేరుకు 6000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 152 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.

News September 2, 2024

నెల్లూరు: 7న మద్యం దుకాణాల బంద్

image

నూతన మద్యం పాలసీ తీసుకురానున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్ నిర్వహించాలని ఏపీ స్టేట్‌బేవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. వారు మాట్లాడుతూ.. నూతన మద్యం పాలసీ పేరిట మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఇదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.

News September 2, 2024

చెన్నై నుంచి గూడూరు మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

image

వాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గూడూరు జంక్షన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు. రద్దు చేసిన రైళ్లు క్రింది విధంగా :
12759 – చార్మినార్ (తాంబరం – హైదరాబాద్)
12615 – గ్రాండ్ ట్రంక్ (చెన్నై – న్యూ ఢిల్లీ)
12967 – జైపూర్ (చెన్నై – జైపూర్)
12621 – తమిళనాడు (చెన్నై-న్యూ ఢిల్లీ)
12760 – చార్మినార్ (హైదరాబాద్ – తాంబరం)

News September 2, 2024

నెల్లూరు జిల్లాలో యువకుడి దారుణ హత్య 

image

యువకుడిని దారణంగా కొట్టి హత్య చేసిన ఘటన దగదర్తి మండలంలో చోటుచేసుకుంది. ఏఎస్ పేటకు చెందిన N ప్రభయ్య(37) బంధువులను కలిసేందుకని రంగసముద్రం వచ్చారు. ఆ క్రమంలో గ్రామ చెరువు సమీపంలో మృతిచెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని SI జంపానికుమార్ పరిశీలించారు. ఏఎస్పేటలో రెండు వర్గాల మధ్య విభేదాల కారణంగా అక్కడి నుంచి పిలిపించి హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

News September 1, 2024

రేపు నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు

image

సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నెల్లూరు జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు ప్రభుత్వ సెలవుగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

News September 1, 2024

నెల్లూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. వర్షాల దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఏదైనా ఇబ్బంది ఉంటే క్రింద తెలిపిన నంబర్లకు కాల్ చేయాలని ఆయన కోరారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్.0861-2331261
టోల్ ఫ్రీ No.1077

News September 1, 2024

నెల్లూరు: 24 మంది ASI (సివిల్)లకు SI లుగా పదోన్నతి

image

నెల్లూరు జిల్లాలో పని చేస్తున్న 24 మంది ASI (సివిల్)లకు SI లుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బంది సంక్షేమం, శాఖాపరమైన సౌకర్యాల పరంగా పోలీస్ శాఖలో ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. పదోన్నతి పొందిన ASIలు స్టేషన్లో రిపోర్ట్ చేసుకోవాలన్నారు.

News September 1, 2024

నెల్లూరు: టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు

image

 నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో వైసీపీ కార్పొరేటర్లు చేరారు. చేరిన వారిలో 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్, 18వ డివిజన్ కార్పొరేటర్ తోటకూర అశోక్ కుమార్, 34వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫామిదాలు ఉన్నారు. అందరం ఒక్కతాటిగా ముందుకు సాగుదామని, స్థానిక నాయకులు వ్యతిరేకించే వాళ్లను TDPలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే తెలిపారు.

News September 1, 2024

నెల్లూరు: YCP సీనియర్ నేత త్వరలో TDPలోకి

image

నెల్లూరు రూరల్లో టీడీపీలో చేరేందుకు కోటంరెడ్డి సోదరులు గేట్లు తీయడంతో వైసీపీ ముఖ్య నేతలు అందరూ టీడీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. నెల్లూరు కార్పొరేటర్ గా నాలుగు సార్లు సుదీర్ఘకాలం సేవలందించిన పిండి సురేశ్, ఆయన సతీమణి ప్రస్తుత కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ లు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. మాజీ మేయర్ భానుశ్రీతో కలిసి పిండి సురేశ్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలిశారు.