India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా, అనుమతులు మంజూరు చేసి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పీఎంఈజీసి రుణాల మంజూరు అంశాలను కలెక్టర్కు వివరించారు.
నెల్లూరు కేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో గురువారం ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమైందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో మూల్యాంకనం పూర్తవుతుందని ఆర్ఐఓ తెలిపారు.
నెల్లూరు జీజీహెచ్లో జరుగుతున్న సదరం క్యాంప్ను జిల్లా కలెక్టర్ ఆనంద్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులతో మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సదరం క్యాంప్లో దివ్యాంగులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జీజీహెచ్ అధికారులు, వైద్యులు, సిబ్బందికి కలెక్టర్ సూచించారు.
నెల్లూరు జిల్లాలోని 11 ఆదర్శ పాఠశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.150 దరఖాస్తు ఫీజు చెల్లించాలన్నారు.
Open 10th Examsలో మాస్ కాపీయింగ్కు పాల్పడిన ఘటనలో 10 మంది టీచర్లపై చర్యలు తీసుకున్నట్లు RJD లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కందుకూరు మండలంలోని TRR ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీచైతన్య హైస్కూల్ పరీక్ష కేంద్రాల్లో Open 10th Exams జరుగుతుండగా RJD తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్ను ఎంకరేజ్ చేసిన 10మంది టీచర్లను సస్పెండ్ చేయగా, నలుగురు విద్యార్థులను డిబార్ చేశామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ గుండ్రాత్ సతీశ్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్మకూరు నియోజకవర్గం, మహిమలూరు గ్రామానికి చెందిన DRDO మాజీ ఛైర్మెన్, భారత రక్షణ శాఖ సలహాదారు గుండ్రాత్ సతీశ్ రెడ్డికి క్యాబినెట్ హోదా దక్కడంపై ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ సుకన్య బుధవారం గుండెపోటుతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందారు. గుండెపోటు రావడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం భేటీ అయ్యింది. ఈ భేటీకి నెల్లూరు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ హాజరయ్యారు. భూ పరిపాలన సంస్కరణలపై వారు చర్చించారు. ప్రధానంగా మంత్రి వర్గ ఉప సంఘంలో ఫ్రీ హోల్డ్ భూములపై చర్చ సాగింది.
అమరావతిలోని సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం భేటీ అయ్యింది. ఈ భేటీకి నెల్లూరు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ హాజరయ్యారు. భూ పరిపాలన సంస్కరణలపై వారు చర్చించారు. ప్రధానంగా మంత్రి వర్గ ఉప సంఘంలో ఫ్రీ హోల్డ్ భూములపై చర్చ సాగింది.
ఎంఎస్ఎంఈ రుణాలతో అన్ని రంగాల ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, ఎంఎస్ఎంఈ రుణాల మంజూరులో ప్రైవేటు బ్యాంకర్లు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ కోరారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు.
Sorry, no posts matched your criteria.