Nellore

News September 1, 2024

జిల్లా విద్యుత్ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లా విద్యుత్ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా విద్యుత్ కు సంబంధిం ఏవైనా సమస్యలు ఉంటే క్రింద తెలిపిన నంబర్ కు సమాచారం అందించాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ : 9440817468

News September 1, 2024

సోమశిల జలాశయంలో చేపల వేట నిషేధం ఎత్తివేత

image

అనంతసాగరం మండలం సోమశిల జలాశయంలో జూలై నుంచి ఆగస్టు 31 వరకు చేపలు వేట నిషేధం విధితమే. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి చేపల వేట నిషేధం ఎత్తివేస్తున్నట్లు మత్స్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు శనివారం తెలిపారు. జలాశయంలో చేపల వేట చేస్తున్న వారికి లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిషేధం సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

News September 1, 2024

విద్యుత్ శాఖ కంట్రోల్ రూంలు ఏర్పాటు

image

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని ఏడు డివిజన్లలో, విద్యుత్ భవన్ లో విద్యుత్ శాఖ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు నోడల్ అధికారి ఆదిశేషయ్య తెలిపారు. నాయుడుపేట: 7382623177, గూడూరు:701036852, నెల్లూరు రూరల్:9381815083, నెల్లూరు టౌన్:7901642857, కోవూరు:8328082583, కావలి:7901056437, ఆత్మకూరు: 7901056906

News September 1, 2024

31వ తేదీ పింఛన్ ఇవ్వడం దేశ చరిత్రలోనే తొలిసారి: మంత్రి కుమార్తె

image

నెల్లూరు నగరంలోని 44వ డివిజన్లో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు అనే పింఛన్ అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ఒకటవ తేదీ ఆదివారం వచ్చిందని 31వ తేదీ పింఛన్ ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అని ఆమె అన్నారు.

News September 1, 2024

నెల్లూరు రూరల్లో వైసీపీ కార్పొరేటర్లు అంతా టీడీపీలోకి?

image

నెల్లూరు రూరల్లో వైసీపీ కార్పొరేటర్లు పేనాటి సుధాకర్, ఆశోక్ నాయుడు, తాళ్లూరి అవినాశ్, ఫామిదా ఇవాళ టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం 26 మంది కార్పొరేటర్ లు ఉండగా ఇప్పటికే కోటంరెడ్డి సోదరుల వెంట 9 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరో 13 మంది కార్పొరేటర్లు కోటంరెడ్డి సోదరులను కలిసి తమ పార్టీలో చేరేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

News September 1, 2024

వినాయక మండపం కోసం సింగిల్ విండో క్లియరెన్స్ విధానం: ఎస్పీ

image

వినాయక మంటపం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగల్ విండో క్లియరెన్స్ విధానాన్ని సిద్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా ప్రజలు http//GaneshUtsov.net కు గాని, ఫోన్ నెంబర్ 7995095800 వాట్స్ ఆఫ్ కి Hi అని టైప్ చేసిన, సింగిల్ విండో పద్ధతి ప్రకారం పర్మిషన్ మంజూరు అవుతుందన్నారు.

News August 31, 2024

జిల్లా వ్యాప్తంగా 95 శాతం వరకు పింఛన్ల పంపిణీ: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా 95 శాతం వరకు పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో శనివారం రోజునే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు చెప్పారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి జిల్లావ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ మొదలు కాగా, రాత్రి 7 గంటల సమయానికి 95 శాతం వరకు పింఛన్లను ప్రభుత్వ అధికారులు పంపిణి చేశారు.

News August 31, 2024

నెల్లూరు : భారీ వర్షాలు.. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు

image

రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రూట్ మార్చినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. వాటి వివరాల కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని హెల్ప్ లైన్ నెంబర్లను రైల్వే శాఖ ప్రకటించింది. నెల్లూరు- 7815909469, గూడూరు-08624-250795 నంబర్లకు సంప్రదించాలని పేర్కొంది.

News August 31, 2024

నెల్లూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. వర్షాల దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఏదైనా ఇబ్బంది ఉంటే క్రింద తెలిపిన నంబర్లకు కాల్ చేయాలని ఆయన కోరారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్.0861-2331261
టోల్ ఫ్రీ No.1077

News August 31, 2024

నెల్లూరు: భర్తను వదిలి భార్యను ఎక్కించుకొని వెళ్లిన కండక్టర్

image

అనంతసాగరం వద్ద కండక్టర్ చేసిన నిర్వాకం స్థానికులు విస్తు పోయారు. సరస్వతమ్మ(60), రామచంద్రరెడ్డి(75) అనే వృద్ధ దంపతులు అనంతసాగరం నుంచి తమ గ్రామం కంభంపాడు వెళ్లేందుకు బస్టాండ్‌లో వేచి ఉన్నారు. బస్సు రాగానే భార్యను రామచంద్రరెడ్డి బస్సు ఎక్కించి కింద ఉండే సంచులు తీసుకుని వచ్చేలోపే బస్సు బయలు దేరి వెళ్లిపోయింది. భర్త వస్తున్నాడు అన్న వినకుండా వెనక బండ్లో రండి అని ఆమెను కూడా కండక్టర్ మధ్యలో దించేశాడు