India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

NTR ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేస్తూ నెల్లూరులోని కొన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యం బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు నిలిపివేయడంతో ఈమేరకు సేవలను నిలిపివేశారు. బకాయిలు విడుదల చేయకపోవడం, మరోవైపు 2010 నుంచి 2025 వరకు ఆసుపత్రిలో ఉపయోగించే పలు రకాల వస్తువులు, ఎంవోయూ ధరలు, విద్యుత్ ఛార్జీలు పెరగడంతో నిర్వహణ భారం అధికమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు చిన్నబజారులోని NMC కి చెందిన పలు షాపులు వారు అద్దెలు చెల్లించలేదు. దీంతో గురువారం NMC రెవెన్యూ అధికారి సమద్ ఆధ్వర్యంలో వాటిని సీజ్ చేశారు. వీటిల్లో 2 షాప్కు రూ.1 లక్ష, 11 నెంబర్ షాప్కు రూ. 6.57లక్షలు, 22 షాప్కు రూ. 72 వేలు , 30 షాప్కు రూ. 15 లక్షలు చొప్పున అద్దెలు చెల్లించాల్సి ఉంది. అద్దెలు చెల్లించకుండా ఉండడం వెనుక కార్యాలయంలోని పలువురు చక్రం తిప్పినట్లు విమర్శలొస్తున్నాయి.

జిల్లాలో యువత మత్తు పదార్థాల వాడకం ఎక్కువ అయినట్లు సమాచారం. ఎన్నడూ లేని విధంగా గంజాయి జాడ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్య శాఖ “TOBACO FREE YOUTH CAMPAIGN 3.0” పేరిట ఈ నెల 9 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది. పొగాకు వాడకంతో 2024-25 ఏడాదిలో నోటి క్యాన్సర్లు 225, సీవోపీడీ కేసులు 469 చొప్పున నమోదయ్యాయి. మరి అధికారులు చేపట్టిన చర్యలు ఎంత వరకు సఫలం అవుతాయో చూడాలి.

1,250 మంది పోలీసు అధికారులతో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు ఎస్పీ అజిత తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. అధికారులకు బ్రీఫింగ్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ సమస్య లేకుండా, పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే వాహనాలు ఏర్పాటు చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు అయింది. శుక్రవారం మ. 2.25 గంటలకు ఆయన కోవూరు(M) పోతిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానా మైపాడు గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ను ప్రారంభిస్తారు. షాపు ఓనర్లతో ఫొటోషూట్ అనంతరం 3.05 నిముషాలకు తిరిగి పోతిరెడ్డి పాలెం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఈదగాలి వెళ్తారు.

సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు అయింది. శుక్రవారం మ. 2.25 గంటలకు ఆయన కోవూరు(M) పోతిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గానా మైపాడు గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ను ప్రారంభిస్తారు. షాపు ఓనర్లతో ఫొటోషూట్ అనంతరం 3.05 నిముషాలకు తిరిగి పోతిరెడ్డి పాలెం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఈదగాలి వెళ్తారు.

పోర్టు ఆధారిత పరిశ్రమల రాకతో కరేడు గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్ల అన్నారు. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మొత్తం 4,800 ఎకరాల భూసేకరణ అవసరం కాగా ఇప్పటివరకు 515 ఎకరాలకు సంబంధించి రైతులకు అవార్డు పాస్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లాలోని 35 నెట్వర్క్ హాస్పిటళ్లలో శుక్రవారం నుంచి NTR ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోనున్నట్లు సమాచారం. ప్రభుత్వం బకాయలు విడుదల చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గతేడాది ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటళ్లలో 6,1765 మంది సేవలను వినియోగించుకోగా రూ.68.23 కోట్ల మేర ఖర్చు అయింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని ఆస్పత్రి వక్గాలు వెల్లడిస్తున్నాయి.

CM చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలోపాటు సిటీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చెయ్యాలి. ఈ క్రమంలో జిల్లా అధికారులు హెలిపాడ్ను సైతం సిద్ధం చేశారు. అయితే ఇంతవరకు సీఎం పర్యటన అధికారకంగా ఖరారు కాలేదు. నెల్లూరులో అడపదడప కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

గతంలో వేలాది ఎకరాలకు సాగునీటిని అందించిన పంట కాలువ నేడు ఆనవాళ్లు కోల్పోతుంది. స్వర్ణాల చెరువు నుంచి కుడితిపాలెం పంట కాలువకు అనుసంధానంగా ఈ కాలువ ఉండేదట. ప్రస్తుతం మూడోమైలు NH నుంచి కొత్తకాలువ-కోడూరుపాడు మీదుగా కుడితిపాలెం వరకు ఈ కాలువ వెళ్ళేది. కానీ కాలక్రమేణా దీనివెంట ఆక్రమణలు పెరిగడం, నగరం విస్తరించడంతో దీని గురించి పట్టించుకోలేదు. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ లోపమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.