Nellore

News August 31, 2024

నెల్లూరు: రెండో పెళ్లిని అడ్డుకున్న మొదటి భార్య

image

దగదర్తికి చెందిన యువకుడు కావలికి చెందిన యువతిని 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వారి మధ్య గొడవలు జరిగగా..పెద్దలు రాజీ చేశారు. ఇటీవల భర్త HYDలో ఉద్యోగం వచ్చిందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ క్రమంలో భార్యకు తెలియకుండా కందుకూరుకు చెందిన యువతిని అదే పట్టణంలో వివాహం చేసుకునేందుకు సిద్దమమయ్యాడు. విషయం తెలుసుకున్న భార్య మండపానికి వచ్చే లోపు వివాహమైంది. రచ్చ పోలీస్ స్టేషన్‌కు చేరింది.

News August 31, 2024

పొదలకూరు: నిమ్మ కిలో రూ.120

image

జిల్లాలో నిమ్మ ధరలు పెరిగాయి. పొదలకూరు మార్కెట్లో శుక్రవారం కిలో రూ.110 నుంచి రూ.120వరకు ధర పలికింది. ఈ మార్కెట్‌కు కలువాయి, చేజర్ల, రాపూరు, మనుబోలు, సైదాపురం మండలాల నుంచి కాయలు వస్తుంటాయి. ఏప్రిల్‌లో కురిసిన వర్షాలకు పూత, పిందె రాలిపోవడంతో వచ్చిన తక్కువ దిగుబడికి శ్రావణమాసం, వినాయకచవితి పండగల నేపథ్యంలో గిరాకీ పెరిగింది. మరో 3నెలలు నిమ్మ ధరలు ఇలాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

News August 31, 2024

పెంచలకోనలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం

image

రాపూర్ మండలంలోని పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాసం నాలుగోవ శుక్రవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అభిషేకం, అర్చన తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం రాత్రి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

News August 30, 2024

నెల్లూరు జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా హరికిరణ్

image

కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లుగా IASలను నియమించింది. నెల్లూరు జిల్లాకు ప్రజా వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ చేవూరి హరికిరణ్‌ IAS(2009)ను కేటాయించింది. మరోవైపు తిరుపతి జిల్లా(సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి)కు ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ IAS(2006) స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు..

News August 30, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు భారీగా పోటెత్తారు. కంపార్టుమెంట్లు అన్నీ నిండి… క్యూ లైన్ టీబీసీ వరకు వెళ్లింది. సర్వదర్శనం కోసం సుమారు 18గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక నిన్న స్వామివారిని 62, 569 మంది దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.15 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

News August 30, 2024

మనుబోలు: గెస్ట్ ఫ్యాకల్టీ భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

మండల కేంద్రమైన మనుబోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న బోటనీ అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ తెలిపారు. MSC బోటనీలో 50% మార్కులు పొందిన వారు, సెప్టెంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను కళాశాలలో అందించాలన్నారు.

News August 30, 2024

నెల్లూరు: ఫోర్జరీ కేసులో టీపీఓ అరెస్ట్

image

నగరపాలక సంస్థ కమిషనర్ల సంతకాల ఫోర్జరీ కేసులో మరో టౌన్ ప్లానింగ్ అధికారి ప్రవీణ్ కుమార్‌ను నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి గురువారం అరెస్ట్ చేశారు. కమిషనర్ల సంతకాల ఫోర్జరీ కేసులో ఇద్దరు టీపీఓలు, మేయర్ భర్త జయవర్ధన్, ఆయన సహాయకుడు, ఇద్దరు సచివాలయ ఉద్యోగులు, ప్రైవేట్ ఇంజినీర్ పై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే.

News August 30, 2024

నెల్లూరు మేయర్ భర్తకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

image

నెల్లూరు కార్పొరేషన్‌లో కమిషనర్ సంతకం ఫోర్జరీ కేసులో మేయర్ భర్త జయవర్ధన్‌కు సుప్రీం కోర్టు భారీ షాకిచ్చింది. ఈ కేసు విషయంలో కీలక సూత్రధారిగా ఉన్న జయవర్ధన్ కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించగా వెంటనే సరెండర్ అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నెల్లూరు పోలీసులు జయవర్ధన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

News August 29, 2024

SVU PG ఫలితాలు విడుదల

image

తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జులై నెలలో పీజీ (PG) M.A, M.SC 4వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు గురువారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News August 29, 2024

TDPపై మాజీ మంత్రి కాకాణి ఫైర్

image

టీడీపీపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ ఎంపీ బీద మస్తాన్ పార్టీని వీడుతున్నారని వినిపిస్తున్న నేపథ్యంలో.. టీడీపీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తోందని విమర్శిచారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇందంతా చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ని భూస్థాపితం చేసే కుట్ర జరుగుతోందని , ఎవరో ఒకరు ఇద్దరు ఎంపీలు పార్టీని వీడితే ఒరిగే నష్టం ఏమీ లేదని ఎద్దేవా చేశారు.