Nellore

News October 9, 2025

నాయుడుపేటలో ట్రైన్ కింద పడి ఇంటర్ విద్యార్థి మృతి

image

నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ చదువుతున్న సంతోష్(17) ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. వరదయ్యపాలెంకు చెందిన సంతోష్ వెంకటాచలం వద్ద ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. దసరా సెలవులు ముగించుకొని తడ నుంచి వెంకటాచలానికి ఫ్రెండ్స్‌తో ట్రైన్‌లో బయలుదేరాడు. నాయుడుపేట వద్దకి వచ్చేసరికి అదుపుతప్పి ట్రైన్ కిందపడి మృతి చెందాడు.

News October 9, 2025

నెల్లూరు జిల్లాలో విస్తరిస్తున్న గంజాయి వ్యాపారం!

image

నెల్లూరు జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారం ఆగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ బృందం ఉన్నప్పటికీ పరిస్థితి యథాతథంగా ఉంది. యువత, విద్యార్థులే ప్రధాన లక్ష్యంగా మారి గంజాయి వ్యాపారం విస్తరిస్తోంది. విశాఖ నుంచి దిగుమతి చేసే గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి కళాశాలలు, బస్టాండ్లు, థియేటర్లు, కేఫేల్లో విక్రయిస్తున్నారు. మొదట ఉచితంగా ఇచ్చి తర్వాత అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

News October 9, 2025

నెల్లూరు: నగదు ఇవ్వలేదని ఇద్దరిని చంపేశారు!

image

నెల్లూరులో జంట హత్యలు సంచలనం సృష్టించాయి. నెల్లూరుకు చెందిన పాత నేరస్తులు సాయిశంకర్, మనోజ్ మద్యం తాగి జాఫర్ సాహెబ్ కాలువ వద్దకు వెళ్లారు. అటుగా వస్తున్న YSR కడప జిల్లాకు చెందిన శివను అడ్డుకుని నగదు అడగగా లేవని చెప్పడంతో దాడి చేసి చంపారు. పెన్నా సమీపంలో ఉంటున్న పోలయ్య అటుగా వెళ్తుండగా అడ్డుకుని డబ్బులు డిమాండ్ చేయగా లేవని చెప్పడంతో హత్యచేశారు. గంటల వ్యవధిలోనే నిందితులును పోలీసులు అరెస్ట్ చేశారు.

News October 9, 2025

10న వెంకటాచలం రానున్న CM..

image

CM చంద్రబాబు ఈ నెల 10న వెంకటాచలం మండలంలో పర్యటించనున్నారు. ఈదగాలి గ్రామంలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఏర్పాట్లను పరిశీలించారు. సర్వేపల్లి బిట్ 2 గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం, నందగోకులం లైఫ్ స్కూల్, గోశాల, విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ పరిసరాలను వారు ముమ్మరంగా తనిఖీ చేశారు.

News October 9, 2025

యూరియా కొరత నివారించేందుకు చర్యలు

image

రబీ వరి సాగులో యూరియా కొరతను నివారించేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. ఎకరాకు 3 బస్తాలకే పరిమితం చేసి, మొత్తం 94,383 టన్నుల అవసరాన్ని లెక్కగట్టింది. జిల్లాలో ప్రస్తుతం 6వేల టన్నుల నిల్వ ఉండగా, ఈ నెలాఖరుకు మరో 4వేల టన్నులు రానున్నాయి. రైతులు వ్యవసాయశాఖ ఇచ్చే ప్రత్యేక కార్డు ద్వారా మాత్రమే యూరియా పొందాలి. కార్డులో రైతు వివరాలు, భూమి విస్తీర్ణం, పంట వివరాలు ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారిణి అన్నారు.

News October 9, 2025

కనుపూరు కాలువలో పడి చార్టెడ్ అకౌంటెంట్ మృతి

image

వెంకటాచల మండలం కసుమూరు కాలువలో పడి అల్లూరు శ్రీకాంత్(30) మృతి చెందినట్లు బుధవారం రాత్రి పోలీసులు తెలిపారు. విడవలూరు మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ కసుమూరులో అత్తగారింటికి భార్య శిరీషతో కలిసి వచ్చాడు. బహిర్భూమికి పోయి ప్రమాదవశాత్తు కనుపూరు కాలువలో పడి చనిపోయాడు. ఇతను CAగా చెన్నైలో పనిచేస్తున్నాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 9, 2025

టపాసుల గోదాములపై తనిఖీలు చేపట్టండి: కలెక్టర్

image

రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల తయారీ కేంద్రాలు, గోదాములను వెంటనే తనిఖీ చేసి 48 గంటల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని అగ్నిమాపకశాఖ అధికారులను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలు, గోదాముల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం లైసెన్సు పొందినవారే బాణసంచా తయారీ, నిల్వలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

News October 9, 2025

10న వెంకటాచలం రానున్న CM..

image

CM చంద్రబాబు ఈ నెల 10న వెంకటాచలం మండలంలో పర్యటించనున్నారు. ఈదగాలి గ్రామంలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఏర్పాట్లను పరిశీలించారు. సర్వేపల్లి బిట్ 2 గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం, నందగోకులం లైఫ్ స్కూల్, గోశాల, విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ పరిసరాలను వారు ముమ్మరంగా తనిఖీ చేశారు.

News October 8, 2025

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ ఓపెనింగ్ ఎప్పుడో..?

image

పొదుపు మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో నెల్లూరులో పైలట్ ప్రాజెక్టుగా <<17847829>>స్మార్ట్ స్ట్రీట్<<>> ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో చాలా రోజుల కిందటే అక్కడి దుకాణాల ముందు భాగాలను తొలగించారు. కంటైనర్లతో స్మార్ట్ దుకాణాలు ఏర్పాటు చేశారు. దసరా తర్వాత ప్రారంభించాలని 4వ తేదీన ముహూర్తం కుదిర్చారు. ఏమైందో ఏమో ఓపెనింగ్‌ను మర్చిపోయారు. వీటిని ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో చూడాలి మరి.

News October 8, 2025

నెల్లూరు: దాహం తీర్చేవారేరి..!

image

దుత్తలూరు(M) నందిపాడు ఎస్సీ కాలనీ, వరికుంటపాడు(M) దక్కనూరు, వింజమూరు(M) కాటేపల్లి బీసీ కాలనీ, కొడవలూరు(M)గండవరంలో RO ప్లాంట్ల ఏర్పాట్లల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటిల్లో రూ.29 లక్షలతో ప్లాంట్లను నెలకొల్పాలని తీర్మానించారు. వీకేపాడులో కేవలం భవనం కట్టి వదిలేయగా, మరికొన్ని చోట్ల పనులే ప్రారంభం కాలేదు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు వీటిపై పునఃసమీక్షించాలని ప్రజలు కోరారు.