Nellore

News July 20, 2024

ఎంపీ విజయసాయి రెడ్డితో చంద్రశేఖర్ రెడ్డి భేటీ

image

ఢిల్లీలో చేపట్టబోయే దీక్షకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎంపీ విజయసాయి రెడ్డితో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యను నిరసిస్తూ ఈ నెల 24 వ తేదీ ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నారు.

News July 20, 2024

నెల్లూరు: పెట్రోల్ బంకులపై వాహనదారుల ఆగ్రహం

image

జిల్లాలోని పలు పెట్రోల్ బంకులలో గాలి మిషన్లు పని చేయడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 189 పెట్రోల్ బంకులు ఉండగా ప్రతి రోజూ 7 లక్షల లీటర్ల డీజిల్, 4 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతోంది. నిబంధనల మేరకు ప్రతి బంకులో గాలి మిషన్ ఏర్పాటు చేయాలి. కొన్ని చోట్ల గాలి మిషన్లు లేవని, మరికొన్ని చోట్ల పని చేయడం లేదన్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు వాహన దారులు వాపోయారు.

News July 20, 2024

నెల్లూరు: ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు

image

అగ్నివీర్ వాయు పథకంలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి వినయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అభ్యర్థులు 21 ఏళ్లలోపు వయసు ఉండి, కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ డిప్లొమాతో సమానమైన విద్యార్హత కలిగి పెళ్లి కాని యువత అర్హులని తెలిపారు. ఈ నెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 20, 2024

తూపిలిపాలెంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్

image

వాకాడు మండలం తూపిలిపాలెంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఆయన వాకాడు మండలం తూపిలిపాలెం తీరప్రాంతాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూపిలిపాలెం గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, బీచ్‌ను అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ కుమార్, అన్ని శాఖల అధికారులు ఉన్నారు.

News July 19, 2024

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌‌లో నాయుడుపేట వద్ద పొగలు

image

పాండిచ్చేరి నుంచి కాకినాడ పోర్టు వెళ్లే సర్కార్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో, సాంకేతిక లోపం తలెత్తి నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్దకు వచ్చే సరికి ఎస్ 8 బోగీలో పొగలు వ్యాపించాయి. ట్రైన్ బోగీలో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ట్రైన్‌లోని ప్రయాణికులు, ట్రైన్ కోసం ప్లాట్ ఫామ్‌పై వేచి ఉన్న ప్రయాణికులు భయంతో, తమ లగేజీలను తీసుకుని రైల్వే స్టేషన్ వెలుపలకు పరుగులు తీశారు.

News July 19, 2024

నెల్లూరు: 3వ రోజు తప్పిపోయిన 152 మంది పిల్లలు సేఫ్

image

బారాషాహీద్ దర్గా నందు ఏర్పాటు చేసిన పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసిన డ్రోన్, PTZ, CC TV ఫుటేజీలను జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. బందోబస్త్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. మొదటి రోజు 92, రెండవ రోజు 140, మూడవ రోజు 152 మంది తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రుల వద్దకు నెల్లూరు పోలీసులు చేర్చారు. నిరంతరం పోలీసు పర్యవేక్షణలో దర్గా ప్రాంగణం ఉందన్నారు.

News July 19, 2024

రాష్ట్రం అభివృద్ధి చెందాలని రొట్టెలు వదలండి: సీఎం చంద్రబాబు

image

నెల్లూరు ద‌ర్గాలో జరిగే రొట్టెల పండుగను సీఎం చంద్ర‌బాబు వీడియో వ‌ర్చువ‌ల్ ద్వారా వీక్షించారు. అనంతరం భక్తులతో, టీడీపీ నేతలతో లైవ్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెంది, బాగా ఆదాయం రావాలని చెరువులో రొట్టెలు వదలమని చంద్రబాబు తెలిపారు. బారాష‌హీద్ దర్గాలో ఏర్పాటుచేసిన వీడియో వ‌ర్చువ‌ల్ కార్యక్రమానికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి, మంత్రులు నారాయణ, ఆనం, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.

News July 19, 2024

రాష్ట్రం అభివృద్ధి చెందాలని రొట్టెలు వదలండి: సీఎం చంద్రబాబు

image

నెల్లూరు ద‌ర్గాలో జరిగే రొట్టెల పండుగను సీఎం చంద్ర‌బాబు వీడియో వ‌ర్చువ‌ల్ ద్వారా వీక్షించారు. అనంతరం భక్తులతో, టీడీపీ నేతలతో లైవ్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెంది, బాగా ఆదాయం రావాలని చెరువులో రొట్టెలు వదలమని చంద్రబాబు తెలిపారు. బారాష‌హీద్ దర్గాలో ఏర్పాటుచేసిన వీడియో వ‌ర్చువ‌ల్ కార్యక్రమానికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి, మంత్రులు నారాయణ, ఆనం, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.

News July 19, 2024

రాష్ట్రం అభివృద్ధి చేందాలని రొట్టెలు వదలండి: సీఎం చంద్రబాబు

image

నెల్లూరు ద‌ర్గాలో జరిగే రొట్టెల పండుగను సీఎం చంద్ర‌బాబు వీడియో వ‌ర్చువ‌ల్ ద్వారా వీక్షించారు. అనంతరం భక్తులతో, టీడీపీ నేతలతో లైవ్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెంది, బాగా ఆదాయం రావాలని చెరువులో రొట్టెలు వదలమని చంద్రబాబు తెలిపారు. బారాష‌హీద్ దర్గాలో ఏర్పాటుచేసిన వీడియో వ‌ర్చువ‌ల్ కార్యక్రమానికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి, మంత్రులు నారాయణ, ఆనం, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.

News July 19, 2024

వైభవంగా రొట్టెల పండుగ.. ఇవాళ చంద్రబాబు సందేశం

image

నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద అత్యంత వైభవంగా రొట్టెల పండుగ కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు వర్చువల్ సందేశం ఇవ్వనున్నారు. దర్గా, స్వర్ణాల చెరువు ప్రాంతంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తుల రాకతో నెల్లూరు కిటకిటలాడుతోంది.