India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంజనీరింగ్లో సీఎస్ఈ గ్రూప్కు ఎంత డిమాండ్ ఉంది. నెల్లూరు జిల్లాలో ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్ 8722 సీట్లకు 6788 సీట్లు భర్తీ అయ్యాయి. సిఎస్ఈ గ్రూప్కు 3357 సీట్లు కేటాయించగా ఇప్పటికే 3059 సీట్లు భర్తీ అయ్యాయి. ఈసీఈ గ్రూపు 1725 సీట్లకు 1317 సీట్లు, ఏఐఎం, ఏఐఎం గ్రూపులకు 720 సీట్లకుగాను 661 భర్తీ కాగా మెకానికల్, ఈఈఈ ఉన్న సీట్లలో 50శాతం కూడా చేరలేదని ఉన్నత విద్య మండలి తెలిపింది.
దుత్తలూరు మండలం ఎరుకల్లు పాఠశాలలో మద్యం తాగి అపస్మారక స్థితిలో పడిఉన్న ఘటన శుక్రవారం జరిగింది. ఉదయం పాఠశాలకు వచ్చేసరికి గదిలో పడి ఉండడాన్ని గమనించిన విద్యార్థులు భయాందోళన చెందారు. గది తలుపులు తాళం వేసి ఉంటే ఎలా లోపలకు వెళ్లాడని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఆరు బయట, ప్రభుత్వ పాఠశాలలో మద్యం తాగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రయ సింహపురి విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీగా విజయభాస్కర్ రావు నియమితులయ్యారు. ఈయన తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రం లెక్చరర్గా, పరిశోధనాభివృద్ధి డీన్గా పనిచేస్తున్నారు. మరికాసేపట్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నట్లు VSU అధికారులు తెలిపారు.
నెల్లూరు బాలాజీనగర్లోని శ్రీహరినగర్ చెందిన ఓ మహిళకు సునీల్ బాబుతో వివాహమైంది. కుటుంబ కలహాలతో మూడేళ్లకే భర్త నుంచి విడిపోయి ఆమె తన కుమారుడితో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. 2014లో ఆమెకు వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన మనోజ్కుమార్తో పరిచయమైంది. తనకు వివాహం కాలేదని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె వద్ద నుంచి రూ.17 లక్షల దోచేసి మోసం చేశాడని భాధితురాలు ఫిర్యాదుతో గురువారం కేసు నమోదైంది.
నెల్లూరు జిల్లాలో ఓ సర్పంచ్ డిప్యూటీ సీఎం పవన్కు లేఖ రాశారు. ముత్తుకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్గా లక్ష్మి గెలిచారు. ‘గిరిజనురాలినని మూడేళ్లుగా YCP నాయకులు, పంచాయతీ కార్యదర్శి వేధించారు. నా సంతకం ఫోర్జరీ చేసి కోట్ల రూపాయల పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారు. సర్పంచ్ నేనైనా పాలన అంతా వైసీపీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఉపసర్పంచ్ అనితా రెడ్డి చేశారు. దీనిపై విచారణ చేయండి’ అని ఆమె కోరారు.
నెల్లూరు బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగకు రెండో రోజు భక్తులు పోటేత్తారు. గురువారం సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు దర్గాను దర్శించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, జేసీ సేదుమాధవన్, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ శర్మద ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నెల్లూరు సమీపంలో వెంకటేశ్వరపురం వద్ద బ్రడ్జి పనులు చేస్తున్నారు. దీంతో వాహనాలను కోవూరు, పడుగుపాడు మీదుగా నెల్లూరుకు మళ్లించారు. ఆత్మకూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు సైతం ఇదే దారిలో వెళ్లాల్సి ఉంది. అదనంగా 7 కిలో మీటర్లు ప్రయాణించి నెల్లూరుకు చేరుకోవాలి. దీంతో ప్రతి టికెట్ మీద రూ.10 అదనంగా వసూల్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గూడూరు పట్టణంలో కానిస్టేబుల్ దాసుపై పశ్చిమ బెంగాల్కు చెందిన 24 ఏళ్ల లల్తూ కలిండి అనే ఉన్మాది వెనక నుంచి కర్రతో దాడి చేసిన ఘటనలో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే కుప్పకూలిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పోలీస్ యూనిఫాంలో ఉన్న వారిని చూస్తే కలిండి ఉన్మాదిలా మారిపోతాడని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు.
బారాషాహీద్ దర్గా నందు ఏర్పాటు చేసిన తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసిన డ్రోన్, PTZ, CCTV పుటేజీలను ఎస్పీ కృష్ణ కాంత్ పరిశీలించారు. బందోబస్త్ నిర్వహిస్తున్న పలువురు సిబ్బందికి సూచనలు చేశారు. రెండవ రోజు రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. 140 మంది తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రులకు, పెద్దలను వారి కుటుంబ సభ్యుల వద్దకు నెల్లూరు పోలీసులు చేర్చారు.
నెల్లూరు జిల్లా సీతారామపురంలో కనపడిన ఈ ఘటన చూపారుల హృదయాన్ని చలింపజేసింది. తల్లిదండ్రుల ఒడిలో కూర్చొని కమ్మని లాలి పాటలు వింటూ, బడిలో గురువుల వద్ద పలకపై ఓనమాలు దిద్దాల్సిన చేతులు, నేడు మురికి గుంటలో చిన్నారి చెత్త వేరుకుంటూ కనిపించింది. దారినపోయే బాటసారులకు సైతం ఈ ఘటన చూసి కన్నీళ్లు తెప్పించక మానదు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.