India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాయుడుపేట గురుకులం విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్ దాదాపీర్, వార్డెన్ విజయభాస్కర్ను కలెక్టర్ వెంకటేశ్వర్ సస్పెండ్ చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళపై మండిపడ్డారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి చికిత్స అందించాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.
నాయుడుపేట పట్టణంలోని అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సోమవారం ఉదయం పరిశీలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడారు. అక్కడ వంటశాలను పరిశీలించారు. గురుకులంలో పిల్లలకు అందిస్తున్న భోజన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగ ఈనెల 17న ప్రారంభం కానుంది. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి కోర్కెల రొట్టెలను పట్టుకుని తింటున్నారు. బారాషహీదులకు గలేఫ్లు, పూల చద్దర్లను సమర్పిస్తున్నారు. 17 నుంచి రద్దీ ఉంటుందనే ఉద్దేశంతో ముందుగానే తెలంగాణ, KA, TN, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు చెరువు వద్దకు చేరుకోవడంతో ఘాట్, దర్గా ఆవరణం భక్తులతో సందడి నెలకొంది.
సోమశిల జలాశయాన్ని మంత్రులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ బందోబస్తులో ఉన్న అనంతసాగరం SI సూర్యప్రకాశ్ ప్రజాప్రతినిధులు, విలేకరుల వాహనాలను అడ్డుకోని దురుసుగా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్రులు జలాశయంపై సమావేశం నిర్వహించడంతో MLA ఇంటూరు నాగేశ్వరరావు తన కారులో వెళ్తుండగా SI కారును ఆపారు. మంత్రి నిమ్మల కారును సైతం ఆపారు. ఎస్సై దురుసు ప్రవర్తనపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
నాయుడుపేట పట్టణంలోని ఎల్ ఏ సాగరం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ బాలుర గురుకులంలో కలుషిత ఆహారం తిని ఆదివారం అర్ధరాత్రి 89 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురుకులంలో అర్బన్ హెల్త్ క్లినిక్ వైద్యులు, విద్యార్థులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన 40 మంది విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు.
తన భార్యకు గర్భం రావడానికి సుభాశ్, ఎంపీ విజయసాయి రెడ్డే కారణమని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో శాంతి మీడియా ముందుకు వచ్చి విజయసాయి రెడ్డికి, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఇవాళ ఉదయం 11 గంటలకు విశాఖలో విజయసాయి రెడ్డి ప్రెస్మీట్ పెట్టనున్నారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతి సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆదివారం కోరారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీలు స్వీకరిస్తారన్నారు.
చేజర్ల మండలం ఆదూరుపల్లిలో జగనన్న లే అవుట్ అక్రమణపై విచారణ చేయాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి మండల తహశీల్దార్ను ఆదేశించారు. ఆదూరుపల్లిలో జగనన్న లే అవుట్కు కేటాయించిన స్థలాన్ని వైసీపీ నాయకుడు హద్దులు తొలగించి ఆక్రమించి సాగు చేసుకుంటున్నట్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి స్పందించి చర్యలకు అధికారులను ఆదేశించారు.
సికింద్రాబాద్ నుంచి గూడూరు వరకు తిరిగే సింహపురి ఎక్స్ప్రెస్ రైలు రాకపోకల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. అక్టోబర్ 18వ తేదీ నుంచి ఈ మార్పు అమలు అవుతుందని వారు ప్రకటించారు. సింహపురి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో రాత్రి 11.05 గంటలకు బయలు దేరి గూడూరుకు ఉదయం 9.40 గంటలకు చేరుకుంటుంది. కానీ సికింద్రాబాద్లో రాత్రి 10.05 బయలు దేరి గూడూరుకు 8.55 గంటలకు చేరుకునేలా మార్పు చేశారు.
నేడు జిల్లాలో మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి పొంగూరు నారాయణ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సోమశిల జలాశయానికి సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారు పరిశీలించనున్నారు. ప్రధానంగా సోమశిల ఆఫ్రాన్, రక్షణ గోడ, నిర్మాణ పనులు, మరమ్మతులను వారు పరిశీలించనున్నారు. అనంతరం వారు గతేదాడి వరదలకు దెబ్బతిన్న సోమేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు.
Sorry, no posts matched your criteria.