Nellore

News January 4, 2025

దగదర్తి ఎయిర్‌పోర్టుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

image

దగదర్తిలో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని CM చంద్రబాబు ప్రకటించారు. గతంలో జిల్లాలో దగదర్తి విమానాశ్రయాన్ని 1379 ఎకరాల్లో నిర్మించాలని కార్యాచరణను రూపొందించి 635 ఎకరాలను సేకరించారు. మిగిలిన 745 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈప్రాంతంలో BPCL చమురుశుద్ధి కార్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీసిటీ సెజ్‌లో ఎయిర్ స్ట్రిప్‌ను తేవాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు.

News January 4, 2025

ఎక్కడి వారు అక్కడే పనిచేయాలి: డీఎంహెచ్ఓ

image

వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడ పనిచేయాల్సిన వారు అక్కడే పని చేయాలని నెల్లూరు డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిప్యూటేషన్లపై విధులు నిర్వర్తిస్తున్న వారిని వెంటనే రిలీవ్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. జీవో నం. 143 ద్వారా డిప్యూటేషన్‌పై ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని వెల్లడించారు.

News January 4, 2025

సంగం: హైవేపై ఘోర ప్రమాదం.. ఒకరి మృతి

image

ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన శనివారం సంగం మండలం వెంగారెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 4, 2025

వైసీపీ జిల్లా అధికార ప్రతినిధులు వీరే

image

వైసీపీ జిల్లా అధికార ప్రతినిధులుగా నేతాజీ సుబ్బారెడ్డి, వీరి చలపతి, ఇర్మియా, ఆర్ఎస్ఆర్, కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మేకల శ్రీనివాసులు, ముప్పవరపు కిషోర్, కొడవలూరు భక్తవత్సలరెడ్డి, ఎస్కే కరిముల్లా, నెల్లూరు శివప్రసాద్, మాదాసు యజ్ఞ పవన్ నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

News January 4, 2025

దగదర్తి ఎయిర్ పోర్టు నిర్మాణంపై సీఎం సమీక్ష

image

దగదర్తిలో ఎయిర్ పోర్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగింది. 635 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. త్వరలోనే రామాయపట్నం సమీపంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణం జరగనుండటంతో దగదర్తి ఎయిర్ పోర్టుకు ప్రాధాన్యం పెరిగింది.

News January 3, 2025

కమిషనర్ సూర్యతేజతో సబ్ కలెక్టర్ పూజ భేటీ

image

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ సూర్యతేజతో కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి పూజ భేటీ అయ్యారు. కమిషనర్‌కు ఆమె నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పరిపాలనపరమైన అంశాలపై ఇరువురు  చర్చించుకున్నారు. 

News January 3, 2025

నెల్లూరు: 44 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

image

గుంటూరు జోన్ పరిధిలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నెల్లూరు DMHO V.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జోన్ పరిధిలో మొత్తం 44 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయన్నారు. ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. జనరల్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 15 సా.5 గంటల లోగా http://cfw.ap.nic.in‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 3, 2025

చంద్రబాబు పిలుపుతోనే టీడీపీలోకి: MP బీదమస్తాన్ రావు 

image

రాజ్యసభ సభకు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బీద మస్తాన్ రావుకు నెల్లూరు జిల్లా యాదవ సంఘం, యాదవ ఎంప్లాయిస్ అఫీషియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. గురువారం రాత్రి నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆత్మీయ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరానన్నారు. వైసీపీ ఓడిపోవడంతో తాను రాజ్యసభకు రాజీనామా చేసి హుందాగా వ్యవహరించానని అన్నారు.

News January 3, 2025

నెల్లూరులో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి పాఠశాలలో ఏడు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. SGT-2, SA గణితం-2, హిందీ-1, బయాలజికల్ సైన్స్-1, ఫిజికల్ సైన్స్-1 మొత్తం 7 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ పోస్టులను డైరెక్ట్ నియామకం ద్వారా భర్తీ చేస్తున్నామని అన్నారు.

News January 2, 2025

నెల్లూరుకు భారీగా యూరియా రాక

image

తొలికారు వరిసాగు నేపథ్యంలో నెల్లూరులో యూరియాకు భారీగా డిమాండ్ ఏర్పడింది. యూరియా కొరత విషయాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల క్రితం రైతు సంఘం నాయకుడు రాధాకృష్ణయ్య నాయుడు అగ్రికల్చర్ జేడీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో గురువారం ఒక వ్యాగన్(2700 టన్నులు)లో యూరియా రాగా, మరో రెండు వ్యాగన్లు మార్గమధ్యలో ఉన్నాయి.