India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో YCPని వీడిన వారంతా TDP, జనసేన నుంచి పోటీ చేసి గెలిచారు. ఒక్క వరప్రసాద్కే ఆ అదృష్టం దక్కలేదు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన గూడూరు MLAగా గెలిచారు. తాజా ఎన్నికల్లో ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. ఈక్రమంలో ఆయన BJPలో చేరి తిరుపతి పార్లమెంట్ టికెట్ సంపాదించారు. దీని పరిధిలోని 7 చోట్లా కూటమి అభ్యర్థులు గెలిచినా.. క్రాస్ ఓట్ కారణంగా వరప్రసాద్ గట్టెక్కలేకపోయారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. దీంతో ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు పలువురు రాజీనామా చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(DCCB) ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ తన పదవికి రిజైన్ చేశారు. ఎస్సీ రిజర్వ్ అయిన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆయన కీలక నేతగా వ్యహరించారు. జగన్తోనూ ఆయనకు నేరుగా సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.
కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘన విజయం నమోదు చేశారు. మరోవైపు అక్కడ గెలిచిన తొలి ఎమ్మెల్యే రికార్డును తన బుట్టలో వేసుకున్నారు. ఇప్పటి వరకు అక్కడ 14 సార్లు సాధారణ, ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు ఓ ఏ ఒక్క మహిళకూ ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచే అవకాశం రాలేదు. ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రశాంతి రెడ్డి 54, 583 ఓట్లతో వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించారు.
శాసనసభ ఎన్నికల బరిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి తొలిసారి ఓటమిపాలయ్యారు. 1999 ఎన్నికల్లో అల్లూరు ఎమ్మెల్యేగా, 2004, 2009 ఎన్నికల్లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆదాల 2019లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసిన ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓడారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇదే ఆయనకు తొలి ఓటమి.
నెల్లూరు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2,45,902 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ నుంచి పోటీచేసిన విజయసాయిరెడ్డికి 5,20,300 ఓట్లు రాగా.. వేమిరెడ్డికి 7,66,202 ఓట్లు వచ్చాయి.
సర్వేపల్లి ఎమ్మెల్యేగా మూడోసారి ఎన్నికైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన మెజార్టీ రికార్డును తానే తిరగరాశారు. 1994లో 33,775 ఓట్లు, 1999లో 16,032 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత ఆ స్థాయిలో మెజార్టీ ఎవరికీ రాలేదు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన 16,288కి పైగా ఓట్లతో గెలుపొందారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగురవేసింది. 2004 ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో వరుస ఓటములు ఎదుర్కొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో 16 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
నెల్లూరు రూరల్లో 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 13087 ఓట్ల ఆధ్యిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి ఆదాల ప్రబాకర్ రెడ్డికి 28320 ఓట్లు రాగా.. కోటంరెడ్డికి 41407 ఓట్లు వచ్చాయి.
నెల్లూరులో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. పోటీ చేసిన అన్నీ చోట్ల టీడీపి ఆధిక్యంలో కొనసాగుతోంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 90 వేల మెజార్టీలో దూసుకుపోతున్నారు. కాగా.. 2019లో నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా ఈ సారి సీన్ రివర్స్ అయ్యింది.
5 రౌండ్లు ముగిసేసరికి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా ఫలితాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు సిటీలో నారాయణ 7వేలు, రూరల్లో కోటంరెడ్డి 5వేలు పైచిలుకు, కావలిలో కావ్యకి 7000 పైచిలుకు, సర్వేపల్లిలో సోమిరెడ్డికి 1500పై మెజార్టీ, ఆత్మకూరులో విక్రం రెడ్డికి 1500 ఓట్ల ముందంజ, ఉదయగిరిలో రాజగోపాల్ రెడ్డి 600 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. గూడూరులో సునీల్, వెంకటగిరిలో కురుగోండ్ల, పేటలో విజయశ్రీ లీడ్లో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.