India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలో TDP ఆధిక్యత కనబరుస్తోంది. నెల్లూరు TDP ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. TDP అభ్యర్థులు నెల్లూరు సిటీలో నారాయణ, రూరల్లో కోటంరెడ్డి, ఉదయగిరిలో సురేశ్, గూడూరులో సునీల్, పేటలో విజయశ్రీ, కావలిలో కావ్య, కోవూరులో ప్రశాంతి రెడ్డి, వెంకటగిరిలో కురుగోండ్ల ముందంజలో ఉండగా.. ఆత్మకూరులో వైసీపీ అభ్యర్థి మేకపాటి లీడింగ్లో ఉన్నారు. సర్వేపల్లిలో హోరాహోరిగా సాగుతోంది.
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 22942 ఓట్ల ముందంజలో ఉన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయికి 66161 ఓట్లు రాగా.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 89103 ఓట్లు వచ్చాయి.
వెంకటగిరిలో ఇప్పటి వరకు మొదటి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు కురుగొండ్ల రామకృష్ణకు 4,717 ఓట్లు వచ్చాయి. దీంతో సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి 274 ఓట్లతో వెనుకపడ్డారు.
నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి సెగ్మంట్లో 5357 ఆధిక్యంలో నిలిచారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి 3649ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. వేమిరెడ్డి 1708 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం ఎనిమిది నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
విడవలూరులో రెండు వర్గాలు బాహాటంగా కత్తులతో దాడి చేసుకున్న ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఘర్షణలో పులి శ్రీకాంత్ అనే యువకుడిని గౌతం అనే వ్యక్తి కత్తితో పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో గాయపడిన పులి శ్రీకాంత్ ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
నెల్లూరు సిటీ 18, సర్వేపల్లి 21, కావలి 23 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. కందుకూరు, ఆత్మకూరు 20 రౌండ్లలో, కోవూరు, ఉదయగిరి 24.. నెల్లూరు రూరల్, సర్వేపల్లి ఓట్ల లెక్కింపు 21 రౌండ్లలో కొనసాగనుంది. ఒక్కో రౌండ్కు అరగంట పట్టినా.. నెల్లూరు సిటీ తుది ఫలితం మధ్యాహ్నం 2 గంటలకు తేలుతుంది. కందుకూరు, ఆత్మకూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి MLA ఎవరనేది 3 గంటలకు తెలిసిపోతుంది. మిగిలిన ఫలితాలు 4 గంటలకు వస్తాయి.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం హరి నారాయణన్ తెలిపారు. సోమవారం సాయంత్రం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ ఏర్పాట్లను ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఈవీఎం ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు.
ఓ బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేసిన ఘటన గూడూరులో చోటు చేసుకుంది. స్థానికులు వివరాలు ప్రకారం.. గూడూరుకు చెందిన ముస్లిం బాలిక(9)పై ఓ యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నెల్లూరు టౌన్, రూరల్ పరిధిలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నెల్లూరు రూరల్ DSP పి.వీరాంజనేయ రెడ్డి పేర్కొన్నారు. ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. ప్రియదర్శిని కాలేజ్ మీదుగా కనుపర్తిపాడు వెళ్లే మార్గంలో వాహనాలకు అనుమత లేదన్నారు. గొలగమూడి దేవాలయానికి వెళ్లే భక్తులు కాకుటూరు మీదుగా వెళ్లాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.