India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-5, YCP-5 సీట్లు గెలుస్తుందని తెలిపారు. కోవూరు, నెల్లూరు సిటీ, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి స్థానాల్లో TDP పాగా వేస్తుందని, నెల్లూరు రూరల్, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేటలో YCP గెలిచే అవకాశం ఉందన్నారు.
నెల్లూరు: ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ సిబ్బంది భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకే పని చేయాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి కారణాలు లేకుండా ఓట్ల లెక్కింపు ఆలస్యం కాకూడదని చెప్పారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలను తప్పకుండా పాటిస్తూ ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ సమయంలో ఏజెంట్ల సందేహాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
నెల్లూరు జిల్లాలో ముగ్గురు సీనియర్ నాయకులకు రేపటి ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయి. నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థులు ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇవే చివరి ప్రత్యక్ష ఎన్నికలు కావచ్చొని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మరికొద్ది గంటల్లోనే వారి భవితవ్యం తేలనుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇవాళ సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు మద్యం దుకాణాలు, బార్లు, కళ్లు దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ ఎన్.హరినారాయణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బాధ్యతను ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. కౌంటింగ్ రోజును పూర్తి డ్రైడేగా పాటించాలని, దుకాణదారులు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు వైసీపీని వీడటంతోనే నెల్లూరులో ఆపార్టీపై నెగటివ్ ఇంపాక్ట్ పడిందని ఆరా మస్తాన్ వెల్లడించారు. ఇది విజయసాయి రెడ్డి ఓటమికి దారి తీస్తోందని ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. వీపీఆర్ భార్య ప్రశాంతి రెడ్డి కోవూరులో పోటీ చేయడంతో ఆ నియోజకవర్గం వైసీపీకి టైట్గా మారిందన్నారు. నెల్లూరు సిటీ, కందుకూరు, ఉదయగిరిపైనా VPR పార్టీ మారిన ప్రభావం పడిందన్నారు.
నెల్లూరు జిల్లాలోని పలు సీట్లపై ఆరా సర్వే యజమాని మస్తాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బరిలో దిగడంతో అక్కడ టఫ్ ఫైట్ నెలకొంది. కావలిలో ఎవరు గెలుస్తారనేది పసుపులేటి సుధాకర్పై ఆధారపడింది. ఆయన చీల్చే ఓట్లతో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉదయగిరిలోనూ టఫ్ ఫైట్ ఉంది’ అని ఆయన చెప్పారు. మరి ఆరా సర్వేపై మీ కామెంట్.
ఎన్నికలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఓ పార్లమెంట్ నియోజకవర్గానికి పరిశీలకులను నియమించారు. కోవూరు, నెల్లూరు సిటీ, ఉదయగిరి, నెల్లూరు పార్లమెంట్కు నితిన్ సింగ్ బదారియా అబ్జర్వర్గా వ్యవహరిస్తారు. కందుకూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు పార్లమెంట్కు రాం మార్గాతం.. కావలి, ఆత్మకూరు, నెల్లూరు పార్లమెంట్కు అభిలాశ్ కుమార్ను పరిశీలకునిగా నియమించారు.
సీఎం జగన్పై రాయి విసిరిన దానికి తనకు సంబంధం లేదని నిందితుడు సతీశ్ స్పష్టం చేశాడు. ‘అసలు నిందితులు ఎవరో పట్టుకోకుండా నన్ను ఇరికించారు. దాడి నేను చేయలేదని ప్రతి అధికారికి చెప్పినా పట్టించుకోలేదు. 45 రోజులు నెల్లూరు జైలులో నరకయాతన అనుభవించా. అమ్మానాన్న గుర్తు వచ్చి ప్రతిక్షణం ఏడ్చాను. ఇప్పటికైనా నాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా’ అని బెయిల్పై విడుదలైన తర్వాత సతీశ్ అన్నాడు.
నెల్లూరు నగరంలోని ప్రియదర్శిని కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం కౌంటింగ్ ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ హాల్స్, మీడియా సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రణాళికాబద్ధంగా జరపటానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.
అనంతసాగరం మండలం సోమశిల జలాశయానికి వరద నీరు వస్తోంది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ఆదివారం నాటికి జలాశయంలో 7.387 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 245 క్యూసెక్కుల వరద వస్తోంది. పెన్నా డెల్టాకు 200, దక్షిణ కాలువకు 5, ఉత్తర కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 70 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.
Sorry, no posts matched your criteria.