Nellore

News June 2, 2024

ఎల్లుండి గూడూరు నిమ్మ మార్కెట్‌కు సెలవు

image

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఫలితాల రోజు తమకు సెలవు కావాలని గూడూరు నిమ్మ మార్కెట్ లోడింగ్ కూలీలు కోరారు. ఈ మేరకు నిమ్మ మార్కెట్ అసోసియేషన్ సెలవు ప్రకటించింది. రైతులు, ఆటో కార్మికులు ఈ విషయాన్ని గమనించాలని అసోసియేషన్ సభ్యులు సూచించారు.

News June 2, 2024

నెల్లూరు జిల్లాలో మద్యం బంద్

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు మూడు రోజుల పాటు మద్యం షాపులు, బార్లు బంద్ కానున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం అన్ని మద్యం షాపులకు సీల్ వేస్తామని ఎక్సైజ్ అధికారి పేర్కొన్నారు.

News June 2, 2024

నెల్లూరు: ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

బావిలో ఈత కొట్టేందుకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా, బోనకల్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆరిమేనిపాడు గ్రామానికి చెందిన నాగూర్ బోనకల్ సమీపంలో నిర్మిస్తున్న మొక్కజొన్న పరిశ్రమలో 3 నెలలుగా పనిచేస్తున్నాడు. సూపర్వైజర్‌తో కలిసి సమీపంలో ఉన్న బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. నీట మునిగి చనిపోయాడు.

News June 2, 2024

నెల్లూరు జిల్లాలో మొదలైన కౌంటింగ్ టెన్షన్

image

సార్వత్రిక ఎన్నికల ఆఖరి ఘట్టం కౌంటింగ్ ప్రక్రియకు కేవలం 48 గంటల సమయమే మిగిలి ఉంది. గత ఎన్నికల కంటే ఈ దఫా జిల్లాలో 2.39 శాతం పోలింగ్ పెరిగింది. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం గెలుపుపై వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News June 2, 2024

Exit polls: నెల్లూరు రూరల్‌లో గెలిచేది ఎవరంటే..!

image

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొంచెం బార్డర్‌కు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని, చివరిగా వైసీపీ గెలిచే చాన్స్ ఉందని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు పోస్ట్ పోల్ సర్వే టీడీపీయే గెలుస్తుందని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.

News June 2, 2024

కావలిలో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల మృతి

image

భార్య మరణం తట్టుకోలేక భర్త కూడా మరణించిన ఘటన కావలి పట్టణంలో చోటు చేసుకుంది. కావలి పట్టణం వైకుంఠాపురం అనపగుంత సమీపంలో నివాసం ఉంటున్న గంటా శ్రీనివాసరావు(71) వరలక్ష్మి (65)భార్య భర్తలు. జ్వరంతో బాధపడుతూ వరలక్ష్మి మృతి చెందగా ఆమె మరణ వార్తను తట్టుకోలేక భర్త శ్రీనివాసరావు కూడా మృతిచెందాడు. ఈ దంపతుల మృతదేహాలు పక్కపక్కనబెట్టి ఉండడం చూసి పలువురు కంటతడి పెట్టారు.

News June 2, 2024

EXIT POLLS: ఉమ్మడి నెల్లూరులో బిగ్ ఫైట్ !

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టప్ ఫైట్ నెలకొందని చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 10 స్థానాల్లో కూటమి 2సీట్లు, వైసీపీ 2 సీట్లు గెలుస్తుందని, ఆరు చోట్ల టఫ్ పైట్ ఉందని పేర్కొంది. అందులో రెండు చోట్ల టీడీపీ, మూడు చోట్ల వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలిపింది. మరో స్థానంలో రెండు పార్టీల మధ్య బిగ్ ఫైట్ నడిచినట్లు వివరించింది. ఈ సర్వేపై మీ COMMENT.

News June 2, 2024

కౌంటింగ్ కేంద్రం చుట్టూ పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు: ఎస్పీ

image

నెల్లూర్ రూరల్ కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ చుట్టూ భద్రతా ఏర్పాట్లను జిల్లా యస్.పి. ఆరీఫ్ హఫీజ్ శనివారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం, బారికేడ్ల ఏర్పాట్లు, కనుపర్తిపాడు ZP హైస్కూల్ లో పార్టీ అభ్యర్థులు, నేతల పార్కింగ్ ప్రాంతాలను స్వయంగా సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా మూడంచెల భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు

News June 1, 2024

మరో సర్వే: నెల్లూరులో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లకు గాను కూటమి 6-7 సీట్లు గెలుస్తుందని బిగ్ టీవీ సర్వే వెల్లడించింది. వైసీపీ 3-4 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తం మీద 175 అసెంబ్లీ సీట్లకు గానూ 106-119 కూటమి, 56-69 సీట్లు వైసీపీ గెలుస్తుందని పేర్కొంది.

News June 1, 2024

ఎగ్జిట్ పోల్స్.. నెల్లూరులో కూటమికే ఎక్కువ సీట్లు!

image

పోస్ట్ పోల్ సర్వే ప్రకారం ఉమ్మడి నెల్లూరులో ఎన్డీఏ కూటమికి 5-7, వైసీపీకి 3-5 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. అటు నెల్లూరు ఎంపీ స్థానంలో టీడీపీ గెలుస్తుందని, తిరుపతిలో వైసీపీ, కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చాణక్య ఎక్స్ సర్వే పేర్కొంది. దీంతో ప్రజల్లో ఉత్కంఠ నెలకొనగా.. జూన్ 4న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.