India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జగన్ నెల్లూరు రాజకీయాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. రూరల్పై పట్టుకోసం మాజీ మంత్రి అనిల్ను ఇన్ఛార్జ్గా నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అక్కడ 3 సార్లు MLAగా గెలిచిన కోటంరెడ్డి కుటుంబం బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో MLA తమ్ముడు గిరిధర్ రెడ్డి బరిలో ఉంటారని పలు సమావేశాల్లో ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అనిల్ కోటంరెడ్డి కోటను ఢీ కొట్టగలరా?.

సాగులో డ్రోన్ల హవా పెరుగుతోంది. ఖర్చులు పెరగడం, రైతుకు పెనుభారమైన సమయంలో RKVY ద్వారా సబ్సిడీపై 5 మంది గ్రూప్ సభ్యులకు డ్రోన్లు మంజూరు చేస్తున్నారు. దీని ద్వారా పురుగు మందులు, ఎరువులను తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారి చేయవచ్చు. ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్ యాప్తో రైతులు డ్రోన్ బుక్ చేసుకొనే అవకాశాన్ని RTGS అందుబాటులోకి తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో వ్యవసాయ శాఖ అయోమయంలో పడింది. ఓ వైపు జిల్లా అంతటా సాగు నెలకొనగా ప్రభుత్వం మరోసారి భూసార పరీక్షలు చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో వ్యవసాయ శాఖ పరుగు పెడుతోంది. గతంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోని వైనంపై Way2Newsలో ‘సాగు మొదలైన భూసార నివేదికలు’ ఎక్కడ శీర్షికన కథనం రాసింది. దీంతో రానున్న 7 వారాల్లో 30 వేల నమూనాలను సేకరించాలని కమిషనరేట్ ఆదేశించింది. సాగు జరుగుతుంటే ఎక్కడ నమూనాలు తీయాలనేది ప్రశ్న.

జిల్లాకే తలమానికంగా మారనున్న దుగరాజపట్నం పోర్ట్ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. వాకాడు(M) పరిధిలోని 4 గ్రామాలు, కోట(M)లోని 2 గ్రామాల పరిధిలో 217.70 ఎకరాల్లో పోర్ట్ నిర్మాణం జరగనుంది. భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.544.30 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఏడాది 5 లక్షల టన్నుల సరకు రవాణా సామర్థ్యంతో షిప్ యార్డ్, నౌకా నిర్మాణం, వాటి మరమ్మతుల వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

మనుబోలులోని పెట్రోల్ బంక్ సమీపంలో జ్యన్తి మల్టీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా ఇండస్త్రిరియల్ ఆయిల్ను డీజిల్గా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆయిల్ తీసుకొచ్చి అమ్ముతున్నారన్నారు. రూ.లక్షా పదివేల లీటర్ల ఆయిల్ను, అయిదు ట్యాంకర్లను సీజ్ చేశారు.

తిరుపతిలో విద్యార్థి సంఘాల <<19040348>>కిడ్నాప్<<>> వ్యవహారంలో మోహన్ బాబు, మంచు విష్ణు, MBU PRO సతీశ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సతీశ్ను పోలీసులు రేణిగుంట ఎయిర్ పోర్ట్లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిపై తిరుచానూరు PSలో కేసు నమోదు అయింది.

మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసు అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు, సోమిరెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి దుర్బషలాడారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలులో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.

నెల్లూరు నగరం KVR పెట్రోల్ బంకు వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక టిప్పర్ బైక్ను ఢీకొనడంతో బైకుపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించి గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు నెల్లూరు వేదయపాలెంకు చెందిన మల్లికార్జున్, భరత్గా తెలుస్తుంది. అయితే ఢీకొట్టిన టిప్పర్ పరారవడం విశేషం.

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 3 నెలల క్రితం మగబిడ్డను వదిలి వెళ్లారు. బరువు తక్కువగా ఉన్న మగ శిశువును చిన్నపిల్లల వైద్యులే అన్నితామై సంరక్షించారు. వదిలి వెళ్లినవారు రాకపోవడంతో వారిని గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంచార జీవనం గడుపుతున్న రేణుక గతేడాది అక్టోబర్లో అల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కాగా శిశువు బరువు తక్కువగా ఉందని తన భర్తతో వచ్చి ఆసుపత్రిలో చేరారని తెలిపారు.

రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వివరించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. సోమవారం లోక్ సభలో కేజీబీవీలపై ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో 587 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలకు గాను 487 మాత్రమే పని చేస్తున్నాయని, ఇది నిజమేనా అని ఆయన ఆరా తీశారు.
Sorry, no posts matched your criteria.