India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలకు గాను కూటమి 7, వైసీపీ 2, ఒకచోట టఫ్ ఫైట్ ఉంటుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేపై మీ కామెంట్ తెలపండి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కేకే సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు గాను కూటమికి 8, వైసీపీ 2 చోట్ల విజయం సాధించనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేపై మీ కామెంట్ తెలపండి
సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని ఆరా మస్తాన్ తన సర్వే ఫలితాన్ని ప్రకటించింది. అదేవిధంగా వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన వి.విజయసాయిరెడ్డి ఓడిపోతారని అంచనా వేసింది.
దేశవ్యాప్తంగా 7వ విడత పోలింగ్ ఇవాళ సాయంత్రంతో ముగుస్తుంది. ఈ క్రమంలో సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ పై నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయ నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కోసం నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా మరో మూడు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి.
నెల్లూర్ రూరల్ కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ చుట్టూ భద్రతా ఏర్పాట్లను జిల్లా యస్.పి. ఆరీఫ్ హఫీజ్ శనివారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం, బారికేడ్ల ఏర్పాట్లు, కనుపర్తిపాడు ZP హైస్కూల్ లో పార్టీ అభ్యర్థులు, నేతల పార్కింగ్ ప్రాంతాలను స్వయంగా సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా మూడంచెల భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు
నాయుడుపేట మండలం పండ్లూరు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి బైక్ ఢీకొంది. ఘటనలో సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన అరిషిత్ (21) మృతి చెందగా, శరత్ కుమార్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. శరత్ కుమార్ రెడ్డిని నాయుడుపేట పభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏటా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అందించే పద్మా పురస్కారాల కోసం క్రీడల్లో అత్యుత్తమ స్థాయిలో రాణించిన అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఆర్కే యతిరాజ్ తెలిపారు. అర్హులైన క్రీడాకారులు www.padmaawards.gov.in వెబ్సైట్లో పొందుపరిచిన మార్గదర్శకాలకు అనుగుణంగా sportsinap@gmail.com మెయిల్ అడ్రస్కు ఆగస్టు ఒకటో తేదీలోపు పంపాలని కోరారు.
ఎన్నికల ఫలితాల కోసం నెల్లూరు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.
ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నెల్లూరు రూరల్ మండలంలోని ఆమంచర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఆమంచర్లలోని పొలాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మృతుడు నీలం రంగు ప్యాంటు, ఎరుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఓట్ల కౌంటింగ్కు ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హరి నారాయణ్ పేర్కొన్నారు. శుక్రవారం కనుపర్తి పాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ లో ఏర్పాటే చేసిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ విధులకు ప్రత్యక్షంగా 1,100 మంది, పరోక్షంగా 2,500 మందితో మూడంచెల పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.