Nellore

News June 1, 2024

3,600 మందితో పటిష్ఠ భధ్రత: నెల్లూరు కలెక్టర్

image

ఓట్ల కౌంటింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హరి నారాయణ్ పేర్కొన్నారు. శుక్రవారం కనుపర్తి పాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ లో ఏర్పాటే చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ విధులకు ప్రత్యక్షంగా 1,100 మంది, పరోక్షంగా 2,500 మందితో మూడంచెల పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News May 31, 2024

3,600 మందితో పటిష్ఠ భధ్రత: నెల్లూరు కలెక్టర్

image

ఓట్ల కౌంటింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హరి నారాయణ్ పేర్కొన్నారు. శుక్రవారం కనుపర్తి పాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ లో ఏర్పాటే చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ విధులకు ప్రత్యక్షంగా 1,100 మంది, పరోక్షంగా 2,500 మందితో మూడంచెల పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News May 31, 2024

నెల్లూరులో జూన్ 6 వరకు 144 సెక్షన్

image

ఓట్ల లెక్కింపును ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడడం, చట్ట విరుద్ధమైన సమావేశాలు, బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదన్నారు.

News May 31, 2024

ఉదయగిరి-కావలి హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

ఉదయగిరి పట్టణ శివారు ప్రాంతంలోని దాసరపల్లి సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నేలటూరు గ్రామానికి చెందిన మేడేపల్లి రమణయ్య వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై కొండాపురం వెళుతుండగా బైక్ అదుపుతప్పి కింద పడింది. ఘటనలో రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News May 31, 2024

నెల్లూరు: జాగ్రత్తగా ఫోన్ వాడండి..!

image

నెల్లూరు జిల్లాలో దాదాపు 7.50 లక్షల మంది మొబైల్ వాడుతున్నారు. ఇందులో 4.50 లక్షల మంది 5G, 4G కనెక్షన్ తీసుకున్నారు. 1.50 లక్షల మంది 3G, మరో 1.50 లక్షల మంది 2G నెట్ వినియోగిస్తున్నారు. 5జీ రాకతో కంటెంట్ స్క్రీనింగ్, షేరింగ్ పెరుగుతోంది. ఈక్రమంలో ఫేక్, గొడవలకు కారణమయ్యే సమాచారం వ్యాపిస్తోంది. ఎన్నికల సమయంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా సమాచారం షేర్ చేస్తే చర్యలు తప్పవని SP ఆరిఫ్ హఫీజ్ హెచ్చరిస్తున్నారు.

News May 31, 2024

నెల్లూరు: 43 బైకులు స్వాధీనం

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వేదాయపాళెం, విడవలూరు, సీతారామపురం, కలిగిరి, వింజమూరు, ఉదయగిరి, వరికుంటపాడు తదితర పోలీసుస్టేషన్ల పరిధిలో సమస్యాత్మక, శివారు ప్రాంతాల్లో స్థానిక పోలీసు అధికారులు తమ సిబ్బందితో కలిసి గురువారం తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 43 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

News May 31, 2024

నెల్లూరు: ఆలస్యంగా వస్తోన్న కృష్ణా

image

ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ గురువారం సుమారు మూడు గంటలపాటు ఆలస్యంగా నడిచింది. సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకోవాల్సిన రైలు రాత్రి 9 గంటల తర్వాత వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ రైలు కనీసం 2 గంటలు ఆలస్యంగా నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

News May 31, 2024

పాలిసెట్ విద్యార్థులకు గమనిక

image

నెల్లూరు: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను జూన్ 6 వరకు.. ఆప్షన్లను పదో తేదీ వరకు.. ఆప్షన్ల మార్పు 11 వరకు.. సీట్ల కేటాయింపు 13న.. జాయినింగ్ రిపోర్టులను 14 నుంచి 19వ తేదీ వరకు అందజేయనున్నట్లు చెప్పారు.

News May 31, 2024

నెల్లూరు: భారీగా దొరికిన బంగారం, డబ్బు

image

కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద రూ.కోట్ల విలువైన సొత్తు పట్టుబడింది. చెన్నై బస్సులో సీఐ శ్రీనివాసరావు తనిఖీలు చేయగా ఐదుగురు మహిళల వద్ద రూ.1.61 కోట్లు పట్టుబడింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని అరెస్ట్ చేశారు. అలాగే మిర్యాలగూడ నుంచి చెన్నై వెళ్తున్న కారులో రూ.కోటి విలువైన 1497 గ్రాముల బంగారు బిస్కెట్లు దొరికాయి. మరోవైపు వెంకటాచలం టోల్‌గేట్ వద్ద 1.65 కేజీల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు.

News May 31, 2024

నెల్లూరు: పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు

image

నెల్లూరు జిల్లాలో 3,14,422 మంది లబ్ధిదారులకు పింఛన్ కానుక అందజేయనున్నారు. 2,28,471 మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జూన్ 5వ తేదీలోపు జమ చేస్తారు. దివ్యాంగులు, ఆరోగ్యం సక్రమంగా లేని 85,951 మంది లబ్ధిదారులకు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటి వద్దే నగదు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టింది.