India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూన్ నెల 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు. అనంతరం 8.30 గంటల నుంచి ఈవిఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులుగా శామ్యూల్, ప్రత్యూషలను ఎన్నికల సంఘం నియమించినట్లు కమిషనర్ వివరించారు.
ఆహార విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జరిమానాలు విధిస్తామని ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశాల మేరకు చిల్డ్రన్స్ పార్కు రోడ్డులో వివిధ హోటళ్లు, బేకరీల ప్రాంగణాలను తనిఖీ చేశారు. పరిశుభ్రతా ప్రమాణాలను పాటించని వివిధ దుకాణాలకు 10 వేల రూపాయల జరిమానాలు విధించి, కొన్ని దుకాణాలను మూసివేశారు.
ఇందుకూరుపేట(మం) నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య, శ్రీనివాసులు అన్నదమ్ములు. శేషయ్య భార్య జయంతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీనివాసులు భార్య నీరజ అనారోగ్యానికి గురయ్యారు. జయంతి, నీరజలకు మెరుగైన వైద్యం అందించడానికి అద్దెకారులో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి వెళ్తుండగా నిన్న చంద్రగిరిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు శేషయ్య, పద్మమ్మ, జయంతి దుర్మరణం చెందారు.
సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలకు నగదు పంపిణీ చేసిన వ్యవహారంపై మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అప్పట్లోనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందిచకపోవడంతో మూడు రోజుల క్రితం కాకాణి మీడియా సమావేశం నిర్వహించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు. దీంతో జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై కేసు నమోదు చేసింది.
సంగం మండలంలోని ఓ బాలికను ఆటో డ్రైవర్ రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన బాలిక పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు షేక్ బాదుషా అనే వ్యక్తి ఆటోలో వెళ్తుండేది. కాగా వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్న అతను.. బాలికపై కన్నేసి తన ఆటోలో పక్కనే కూర్చొబెట్టుకుని అశ్లీల వీడియోలు చూపిస్తూ అసభ్యకరకంగా ప్రవర్తించేవాడు. చివరికి వివాహం చేసుకునే కుట్రకు పాల్పడ్డాడు.
నెల్లూరు: పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేది ప్రియదర్శిని కాలేజీలో జరుగుతుందన్నారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. మీడియా సెంటర్, కౌంటింగ్ ఏజెంట్ల భోజన ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అంశాలను ఆయన పరిశీలించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు ముగిశాయి. ఫలితాలపై ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఎడతెగని టెన్షన్ నెలకొంది. మరో వారం రోజుల్లోనే ఓటర్ తీర్పు బహిర్గతం కానుంది. ఈక్రమంలో జిల్లాలో ఏ మూల చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. సిటీలో కన్నా గ్రామాల్లో రచ్చబండలపై అందరూ వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో చూడలి మరి.
నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద సోమవారం ఆటో బోల్తా పడింది. కడపకు చెందిన కరీమున్నీసా మృతిచెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇవాళ ఒక్కో రోజే అనంతసాగరం, ఏఎస్ పేట, సైదాపురం, మనుబోలు మండలాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు చనిపోగా.. చంద్రగిరి వద్ద కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామస్థులు నలుగురు కన్నుమూశారు.
నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్ను కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి పనుల పురోగతిని అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.