India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద హైవేపై సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని సమాచారం. స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. యువకుడిని పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసుల ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఉదయగిరి దుర్గం పై గత కొన్ని రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వీరు సాధు వస్త్రాలు ధరించి గుప్తనిధుల కోసం పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ గుప్త నిధులు కోసం వచ్చి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే అధికారులు నిఘా ఉంచాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
నెల్లూరు రూరల్, కోవూరు డివిజన్ లలో డి.పి.ఈ. విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో అక్రమ విద్యుత్ వినియోగంపై తనిఖీలు నిర్వహించారు. ఆదివారం రొయ్యల గుంటలకు అక్రమ విద్యుత్ వాడుతున్న వారిపై రాత్రి దాడులు నిర్వహించారు. రైడ్స్ లో విద్యుత్ డి.పి.ఈ. విభాగం, ఏ.పి.టి.ఎస్.సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది పాల్గొన్నారు. సుమారు మూడు లక్షల వరకు జరిమానా విధించారు.
చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని ఎంకొంగవారిపల్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు నుంచి వేలూరు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. మృతులు ఇందుకూరుపేటకు చెందిన వారుగా గుర్తించారు.
చిల్లకూరు: కోట అడ్డరోడ్డు ప్రాంతంలోని హైవేపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల కథనం.. సైదాపురం మండలం గిద్దలూరుకి చెందిన వేణుగోపాల్ గుప్తా(58) బైక్పై కోటకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళ్తుండగా కోట అడ్డరోడ్డు వద్ద అదుపుతప్పి లారీని ఢీకొట్టాడు. తీవ్రగాయాలైన ఆయన్ను చికిత్స నిమిత్తం గూడూరులోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వేంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం కౌన్సిలింగ్, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కానుంది. అర్హులైన వారు ముందుగా కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కళాశాలలో వెరిఫికేషన్, ఫీజు రసీదుతో పాటు పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10వ తరగతి మార్క్ లిస్ట్, 4 -10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని ప్రిన్సిపల్ రాంప్రసాద్ తెలిపారు.
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం హరి నారాయణన్ పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రోజువారీ తనిఖీల్లో భాగంగా ఆదివారం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ విఫలమయ్యారన్నారు. ఇలాంటి అధికారి కౌంటింగ్లో ఉంటే పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తారని ఆరోపించారు. తన రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నికల అధికారిని ఎప్పుడూ చూడలేదని, ఎన్నికల నిర్వహణలో ఓటర్లకు గాని, ఎన్నికల అధికారులకు గానీ కనీసం వసతులు కల్పించలేదన్నారు.
వరికుంటపాడు మండల పరిధిలోని విరువూరు శివారు ప్రాంతంలోని ఆంజనేయస్వామి గుడి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గత రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిన విరువూరు గ్రామానికి చెందిన తాళ్ల నాగార్జున రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మృతుడు ఆంజనేయస్వామి మాల ధరించి ఉన్నారు.
వాకాడు మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలిరెడ్డిపాలెం వద్ద అతివేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం ఏమీ జరగలేదు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.